Sunrisers Hyderabad: సన్రైజర్స్ కెప్టెన్గా కమిన్స్?
ఈ ఏడాది ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ మారబోతున్నాడా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.
దిల్లీ: ఈ ఏడాది ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ మారబోతున్నాడా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. మార్క్రమ్ స్థానంలో కమిన్స్కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పేందుకు సన్రైజర్స్ యాజమాన్యం ఆసక్తితో ఉన్నట్లు సమాచారం. నిరుడు ఐపీఎల్ వేలంలో కమిన్స్ కోసం సన్రైజర్స్ ఏకంగా రూ.20.5 కోట్లు చెల్లించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక ధర. జట్టుకు కెప్టెన్గా నియమించడం కోసమే కమిన్స్కు జట్టు భారీ మొత్తం చెల్లించిందని తెలిసింది. గత సీజన్లో మార్క్రమ్ నాయకత్వంలోని సన్రైజర్స్ 14 మ్యాచ్ల్లో కేవలం నాలుగు విజయాలతో పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రధాన కోచ్ బ్రయాన్ లారా స్థానాన్ని డేనియల్ వెటోరితో భర్తీ చేసిన విషయం విదితమే. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు సహాయక కోచ్గా వెటోరి ఉన్నాడు. కమిన్స్ సారథ్యంలో కంగారూ జట్టు నిరుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్గా నిలవడంతో పాటు వన్డే ప్రపంచకప్నూ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో వెటోరి, కమిన్స్ కలిసి సన్రైజర్స్ కోసం పనిచేయబోతున్నారని సమాచారం. ఇక సన్రైజర్స్కు చెందిన సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టును వరుసగా రెండో సారి దక్షిణాఫ్రికా టీ20 లీగ్లో సారథిగా మార్క్రమ్ విజేతగా నిలిపాడు. అయినప్పటికీ ఐపీఎల్లో మాత్రం సన్రైజర్స్ కెప్టెన్గా అతనిపై వేటు పడటం ఖాయమేనని తెలిసింది. మరోవైపు ఆ జట్టు బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ ఈ ఏడాది ఐపీఎల్కు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. బాధ్యతల నుంచి విరామం కోరుకుంటున్న అతను.. 2025 ఐపీఎల్ కోసం తిరిగి జట్టుతో చేరే అవకాశముంది. స్టెయిన్ స్థానంలో న్యూజిలాండ్ మాజీ పేసర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ సన్రైజర్స్ జట్టుతో చేరనున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర