హార్దిక్కు అండగా అశ్విన్
ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యను హేళన చేస్తున్న అభిమానులపై సీనియర్ స్పిన్నర్ అశ్విన్ మండిపడ్డాడు. ఆటగాళ్లు ఏ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తారో గుర్తుంచుకోవాలని చెప్పాడు. రోహిత్ స్థానంలో హార్దిక్కు ముంబయి సారథ్య బాధ్యతలు అప్పజెప్పడంపై అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
దిల్లీ: ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యను హేళన చేస్తున్న అభిమానులపై సీనియర్ స్పిన్నర్ అశ్విన్ మండిపడ్డాడు. ఆటగాళ్లు ఏ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తారో గుర్తుంచుకోవాలని చెప్పాడు. రోహిత్ స్థానంలో హార్దిక్కు ముంబయి సారథ్య బాధ్యతలు అప్పజెప్పడంపై అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ముంబయి మ్యాచ్లాడిన చోట హార్దిక్ను లక్ష్యంగా చేసుకుని హేళన చేస్తున్నారు. అహ్మదాబాద్, హైదరాబాద్లోనూ అదే జరిగింది. ఈ నేపథ్యంలో తన యూట్యూబ్ ఛానెల్లో ఓ అభిమాని.. ‘‘ఇది పేలవమైన మార్పిడి (హార్దిక్ను గుజరాత్ నుంచి ముంబయికి) అని ముంబయి ఇండియన్స్ ప్రకటించేందుకు ఇదే సమయమా?’’ అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ అశ్విన్ అభిమానుల తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ‘‘ఈ విషయంలో ఫ్రాంఛైజీ లేదా ఆటగాడిది ఎలాంటి పాత్ర లేదు. ఆ బాధ్యత అభిమానులపై ఉంది. చాలా సార్లు చెప్పా ఇది క్రికెట్. ఇందులో సినిమా సంస్కృతి సరికాదు. హీరోలను ఆరాధించడం వేరు. అభిమానుల మధ్య పోరు ఇలాంటి వికారమైన మార్గంలో వెళ్లకూడదు. ఈ ఆటగాళ్లు మన దేశానికి ప్రాతినిథ్యం వహిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాంటప్పుడు ఓ ఆటగాడిని హేళన చేసే హక్కు ఎక్కడిది? ఓ ఆటగాడిని గేలి చేస్తుంటే జట్టు ఎందుకు స్పష్టతనివ్వాలి? ఇతర దేశాల్లో ఇలా జరగడం చూశారా? రూట్, క్రాలీ.. స్మిత్, కమిన్స్ అభిమానులు ఎప్పుడైనా గొడవపడ్డారా? గతంలో సచిన్, గంగూలీ ఒకరి సారథ్యంలో మరొకరు ఆడారు. ఈ ఇద్దరూ ద్రవిడ్ కెప్టెన్సీలో ఆడారు. ఈ ముగ్గురికి కుంబ్లే సారథిగా ఉన్నాడు. వీళ్లంతా కలిసి ధోని నాయకత్వంలో ఆడారు. అప్పుడు వీళ్లందరూ దిగ్గజాలే. ధోని కూడా కోహ్లి సారథ్యంలో ప్రాతినిథ్యం వహించాడు. ఇంట్లో కూర్చుని ఒకరి గురించి చెడుగా మాట్లాడమంటే అందరికీ సంతోషమే. ముందు మనల్ని మనం సరిదిద్దుకోవాలి. మీ ఆరాధ్య ఆటగాడిపై ఇష్టాన్ని ఆస్వాదించండి. కానీ ఇతర ఆటగాళ్లను కించపర్చవద్దు’’ అని అశ్విన్ పేర్కొన్నాడు. ముంబయి ఇండియన్స్ సోమవారం సొంత మైదానం వాంఖడేలో రాజస్థాన్తో తలపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?