విశాఖలో ఐపీఎల్ కిక్కు.. నేడు చెన్నైతో దిల్లీ పోరు
విశాఖపట్నంలో మరోసారి ఐపీఎల్ మజా అభిమానులకు కిక్కు అందించనుంది. టీ20 సునామీ విశాఖను ముంచెత్తనుంది. అయిదేళ్ల విరామం తర్వాత ఇక్కడి వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో తిరిగి ఐపీఎల్ మ్యాచ్ జరగబోతోంది.
ఈనాడు, హైదరాబాద్: విశాఖపట్నంలో మరోసారి ఐపీఎల్ మజా అభిమానులకు కిక్కు అందించనుంది. టీ20 సునామీ విశాఖను ముంచెత్తనుంది. అయిదేళ్ల విరామం తర్వాత ఇక్కడి వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో తిరిగి ఐపీఎల్ మ్యాచ్ జరగబోతోంది. ఆదివారం రాత్రి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో దిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఈ సీజన్లో రెండు మ్యాచ్ల కోసం విశాఖను దిల్లీ సొంత వేదికగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. మరో మ్యాచ్ బుధవారం కోల్కతా నైట్రైడర్స్తో ఆడుతుంది. 2012, 2015, 2016, 2019 సీజన్లలో విశాఖలో ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. చివరి మ్యాచ్ కూడా దిల్లీ, చెన్నై (2019లో రెండో క్వాలిఫయర్) మధ్యే జరగడం విశేషం. ఇప్పుడీ రెండు జట్ల పోరులో సీఎస్కేనే ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఆ జట్టు గెలవగా.. దిల్లీ రెండింట్లోనూ ఓడింది. పైగా సీఎస్కేతో ఆడిన గత నాలుగు ఐపీఎల్ మ్యాచ్ల్లోనూ దిల్లీ పరాజయం పాలైంది. చెన్నై అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తోంది. బ్యాటింగ్లో శివమ్ దూబె, రచిన్ రవీంద్ర నిలకడగా రాణిస్తున్నారు. బౌలింగ్లో ముస్తాఫిజుర్, దీపక్ చాహర్ సత్తాచాటుతున్నారు. ఆ జట్టుకు ప్రధాన ఆకర్షణ అయిన ధోని కోసం అభిమానులు స్టేడియానికి పోటెత్తే అవకాశముంది. మరోవైపు వరుస పరాజయాల నుంచి పుంజుకోవాలని దిల్లీ చూస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత బరిలో దిగిన పంత్ ఇంకా లయ అందుకోలేదు. ఆ జట్టులో ఆంధ్ర రంజీ కెప్టెన్ రికీ భుయ్ ఉన్నాడు. కానీ పృథ్వీ షాను ఆడించాలనుకుంటే అతను పెవిలియన్కు పరిమితమవొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు