కొత్త కుర్రాడు.. కట్టిపడేశాడు
200 పరుగుల లక్ష్యమంటే తేలిక కాదు. కానీ పంజాబ్ ఓపెనర్లు శిఖర్ ధావన్, బెయిర్స్టో చెలరేగిపోయారు. 11 ఓవర్లకు 101/0తో పంజాబ్ తిరుగులేని స్థితిలో నిలిచింది. ఆ జట్టు విజయం లాంఛనమే అనుకున్నారంతా.
అరంగేట్రంలో మయాంక్ అదుర్స్
ఐపీఎల్-17లో లఖ్నవూ బోణీ
పంజాబ్కు తప్పని ఓటమి
లఖ్నవూ
200 పరుగుల లక్ష్యమంటే తేలిక కాదు. కానీ పంజాబ్ ఓపెనర్లు శిఖర్ ధావన్, బెయిర్స్టో చెలరేగిపోయారు. 11 ఓవర్లకు 101/0తో పంజాబ్ తిరుగులేని స్థితిలో నిలిచింది. ఆ జట్టు విజయం లాంఛనమే అనుకున్నారంతా. అయితే అనుభవజ్ఞులైన బౌలర్లు తేలిపోతున్న సమయంలో అరంగేట్ర బౌలర్ మయాంక్ యాదవ్ బంతి అందుకుని సంచలన ప్రదర్శనతో పంజాబ్కు చెక్ పెట్టాడు. మెరుపు వేగంతో బంతులేసిన అతను.. పరుగులు కట్టడి చేయడమే కాక, మూడు కీలక వికెట్లు పడగొట్టి పంజాబ్ను ఓటమి బాట పట్టించాడు. చివర్లో మిగతా బౌలర్లూ రాణించడంతో విజయం లఖ్నవూ సొంతమైంది.
ఐపీఎల్-17లో లఖ్నవూ సూపర్జెయింట్స్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో ఓడిన ఆ జట్టు.. శనివారం 21 పరుగుల తేడాతో పంజాబ్పై విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. నిర్ణీత ఓవర్లలో 178/5కు పరిమితమైంది. శిఖర్ ధావన్ (70; 50 బంతుల్లో 7×4, 3×6), బెయిర్స్టో (42; 29 బంతుల్లో 3×4, 3×6) జట్టుకు అదిరే ఆరంభాన్నిచ్చినా.. వీరు వెనుదిరిగాక ఇన్నింగ్స్ గాడి తప్పింది. అరంగేట్ర బౌలర్ మయాంక్ యాదవ్ (3/27), మోసిన్ ఖాన్ (2/34) పంజాబ్ను దెబ్బ తీశారు. మొదట డికాక్ (54; 38 బంతుల్లో 5×4, 2×6), పూరన్ (42; 21 బంతుల్లో 3×4, 3×6), కృనాల్ పాండ్య (43 నాటౌట్; 22 బంతుల్లో 4×4, 2×6) మెరుపులతో లఖ్నవూ 8 వికెట్లకు 199 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్ (3/28), అర్ష్దీప్ (2/30) రాణించారు.
అతడి రాకతో..: పంజాబ్ ఇన్నింగ్స్ సగం వరకు చూసిన వాళ్లెవ్వరూ ఈ మ్యాచ్లో ఆ జట్టు ఓటమి వైపు నిలుస్తుందని అనుకుని ఉండరు. కెప్టెన్ ధావన్ సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ మరో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన బెయిర్స్టో ఈసారి ధాటిగా బ్యాటింగ్ చేశాడు. ఇద్దరూ స్వేచ్ఛగా షాట్లు ఆడడంతో లఖ్నవూ బౌలర్లకు దిక్కుతోచలేదు. పవర్ప్లేలో 61 పరుగులు రాబట్టిన పంజాబ్.. 11వ ఓవర్లోనే వందకు చేరుకుంది. ఆరుగురు బౌలర్లు దిగినా ఎవ్వరూ వికెట్ సాధించలేకపోయారు. ఓపెనర్లు జోరుమీదుండగా.. ఇంకా ప్రభ్సిమ్రన్, లివింగ్స్టన్, సామ్ కరన్, జితేశ్ శర్మ రావాల్సి ఉండడంతో పంజాబ్ అలవోకగా మ్యాచ్ గెలిచేస్తుందనిపించింది. కానీ అప్పటికే ఒక ఓవర్ వేసి పరుగులు కట్టడి చేసిన కొత్త బౌలర్ మయాంక్.. 12వ ఓవర్లో బెయిర్స్టోను ఔట్ చేసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ప్రభ్సిమ్రన్ (19) ధాటిగా ఆడి లక్ష్యాన్ని కరిగించే ప్రయత్నం చేస్తుంటే.. తన తర్వాతి ఓవర్లో అతణ్నీ ఔట్ చేశాడు మయాంక్. తన చివరి ఓవర్లో జితేశ్ శర్మ (6)ను సైతం అతనే ఔట్ చేశాడు. మయాంక్ పొదుపుగానూ బౌలింగ్ చేయడంతో సాధించాల్సిన రన్రేట్, పంజాబ్పై ఒత్తిడీ పెరిగిపోయాయి. మోసిన్ ఖాన్ 17వ ఓవర్లో వరుస బంతుల్లో ధావన్, సామ్ కరన్ (0)లను ఔట్ చేసి కింగ్స్ కష్టాలను రెట్టింపు చేశాడు. లివింగ్స్టన్ (28 నాటౌట్; 17 బంతుల్లో 2×4, 2×6) క్రీజులో ఉన్నా.. ధాటిగా ఆడలేకపోవడంతో పంజాబ్ ఓటమి ముందే ఖరారైపోయింది. చివరి ఓవర్లో 41 పరుగులు చేయాల్సిన స్థితిలో అతను 6, 4, 6 బాది ఓటమి అంతరాన్ని కొంత తగ్గించాడు.
లఖ్నవూ.. దంచుడే దంచుడు: మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లఖ్నవూ సొంతగడ్డపై రెచ్చిపోయింది. క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా ఆ జట్టు జోరు తగ్గలేదు. కెప్టెన్సీని పూరన్కు అప్పగించి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిన కేఎల్ రాహుల్ (15) రెండు షాట్లు ఆడి వెనుదిరిగినా.. మరో ఓపెనర్ డికాక్ చెలరేగి ఆడుతూ స్కోరింగ్ రేట్ తగ్గకుండా చూసుకున్నాడు. దేవ్దత్ పడిక్కల్ (9) వైఫల్యాన్ని కొనసాగించినా.. స్టాయినిస్ (19) కాసేపు నిలిచాడు. అతడి సహకారంతో డికాక్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. రాహుల్ చాహర్ బౌలింగ్లో రెండు వరుస సిక్సర్లు బాది ప్రమాదకరంగా కనిపించినా.. అతను తర్వాతి బంతికే బౌల్డయ్యాడు. ఆపై డికాక్కు పూరన్ తోడవడంతో స్కోరు బోర్డు దూసుకెళ్లింది. పూరన్ ఉన్నంతసేపు భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 13 ఓవర్లకు 125/3తో లఖ్నవూ తిరుగులేని స్థితికి చేరుకుంది. ఈ స్థితిలో తక్కువ వ్యవధిలో డికాక్, పూరన్ వెనుదిరగడంతో ఎల్ఎస్జీ ఓ మోస్తరు స్కోరుకు పరిమితమవుతుందనిపించింది. కానీ కృనాల్ చెలరేగడంతో చివరి 5 ఓవర్లలో 53 పరుగులు రాబట్టిన లఖ్నవూ ప్రత్యర్థికి 200 లక్ష్యాన్ని నిర్దేశించింది.
లఖ్నవూ ఇన్నింగ్స్: డికాక్ (సి) జితేశ్ (బి) అర్ష్దీప్ 54; రాహుల్ (సి) బెయిర్స్టో (బి) అర్ష్దీప్ 15; దేవ్దత్ (సి) ధావన్ (బి) కరన్ 9; స్టాయినిస్ (బి) రాహుల్ చాహర్ 19; పూరన్ (బి) రబాడ 42; బదోని (సి) బెయిర్స్టో (బి) కరన్ 8; కృనాల్ నాటౌట్ 43; బిష్ణోయ్ (సి) త్యాగరాజన్ (బి) కరన్ 0; మోసిన్ రనౌట్ 2; నవీనుల్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 199; వికెట్ల పతనం: 1-35, 2-45, 3-78, 4-125, 5-146, 6-189, 7-189; బౌలింగ్: సామ్ కరన్ 4-0-28-3; అర్ష్దీప్ 3-0-30-2; రబాడ 4-0-38-1; రాహుల్ చాహర్ 3-0-42-1; హర్ప్రీత్ 2-0-14-0; హర్షల్ 4-0-45-0
పంజాబ్ ఇన్నింగ్స్: ధావన్ (సి) డికాక్ (బి) మోసిన్ 70; బెయిర్స్టో (సి) స్టాయినిస్ (బి) మయాంక్ యాదవ్ 42; ప్రభ్ సిమ్రన్ (సి) నవీనుల్ (బి) మయాంక్ యాదవ్ 19; జితేశ్ (సి) నవీనుల్ (బి) మయాంక్ యాదవ్ 6; లివింగ్స్టన్ నాటౌట్ 28; సామ్ కరన్ (సి) పూరన్ (బి) మోసిన్ 0; శశాంక్ నాటౌట్ 9; ఎక్స్ట్రాలు 4; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 178; వికెట్ల పతనం: 1-102, 2-128, 3-139, 4-141, 5-141; బౌలింగ్: సిద్ధార్థ్ 2-0-21-0; నవీనుల్ 4-0-43-0; మోసిన్ 4-0-34-2; కృనాల్ 3-0-26-0; బిష్ణోయ్ 3-0-25-0; మయాంక్ యాదవ్ 4-0-27-3
మయాంక్ @ 155.8 కి.మీ
తన తొలి ఐపీఎల్ మ్యాచ్లోనే అదరగొట్టాడు లఖ్నవూ సూపర్జెయింట్స్ ఫాస్ట్బౌలర్ మయాంక్ యాదవ్. 21 ఏళ్ల ఈ దిల్లీ కుర్రాడు.. లఖ్నవూ తరఫున శనివారమే ఐపీఎల్లో అడుగు పెట్టాడు. ఛేదనలో చెలరేగిపోతున్న పంజాబ్ బ్యాటర్లకు కళ్లెం వేసింది అతనే. ఆ జట్టు కోల్పోయిన తొలి మూడు వికెట్లూ మయాంక్ ఖాతాలోనే చేరాయి. తన వేగానికి.. ధాటిగా ఆడుతున్న బెయిర్స్టో, ధావన్ సైతం ఇబ్బంది పడ్డారు. బెయిర్స్టోతో పాటు ప్రభ్సిమ్రన్, జితేశ్ శర్మ అతడికి వికెట్లు సమర్పించుకున్నారు. నిలకడగా 145 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బంతులేసిన మయాంక్.. ఒక దశలో 155.8 కి.మీ వేగాన్నందుకుని ఆశ్చర్యపరిచాడు. ఈ ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన బంతి అతడిదే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం. -
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
శ్రీలంకతో టీమ్ ఇండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ రెండు ఫార్మాట్లకు శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఎంపికైన విషయం తెలిసిందే. -
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM