విశాఖలో దిల్లీ కేక
ఐపీఎల్-17లో దిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. వరుసగా రెండు ఓటముల నుంచి పుంజుకున్న ఆ జట్టు ఆదివారం విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్లో 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై గెలిచింది.
ఐపీఎల్-17లో బోణీ
సీఎస్కేపై విజయం
మెరిసిన వార్నర్, పంత్
గత నాలుగు ఐపీఎల్ మ్యాచ్ల్లో దిల్లీపై సీఎస్కేదే విజయం. ఈ సీజన్లో తొలి రెండు మ్యాచ్ల్లో అన్ని విభాగాల్లోనూ విఫలమైన దిల్లీ ఓటములతో ఢీలా పడింది. దీంతో మరోసారి చెన్నై ఫేవరెట్గా కనిపించింది. కానీ విశాఖ వేదికగా దిల్లీ గెలుపు కేక పెట్టింది. పంత్ ఒకప్పటిలా మెరుపులు మెరిపించగా.. వార్నర్ నిలకడ కొనసాగించాడు. బౌలింగ్లో ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్ చెలరేగారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో.. అదిరే ఆటతీరుతో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్కు ఈ సీజన్లో దిల్లీ తొలి ఓటమి రుచి చూపించింది.
విశాఖపట్నం
ఐపీఎల్-17లో దిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. వరుసగా రెండు ఓటముల నుంచి పుంజుకున్న ఆ జట్టు ఆదివారం విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్లో 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై గెలిచింది. మొదట దిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. వార్నర్ (52; 35 బంతుల్లో 5×4, 3×6), పంత్ (51; 32 బంతుల్లో 4×4, 3×6), పృథ్వీ షా (43; 27 బంతుల్లో 4×4, 2×6) రాణించారు. చెన్నై బౌలర్లలో పతిరన (3/31) సత్తాచాటాడు. ఛేదనలో ముకేశ్ కుమార్ (3/21), ఖలీల్ అహ్మద్ (2/21) ధాటికి సీఎస్కే 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులే చేయగలిగింది. రహానె (45; 30 బంతుల్లో 5×4, 2×6) పోరాడాడు. ధోని (37 నాటౌట్; 16 బంతుల్లో 4×4, 3×6) అభిమానులను అలరించాడు.
పేస్ దెబ్బ: భారీ లక్ష్య ఛేదనలో చెన్నైని ఆరంభంలో అహ్మద్, ఆఖర్లో ముకేశ్ దెబ్బకొట్టారు. అహ్మద్ వరుస ఓవర్లలో ఓపెనర్లు రుతురాజ్ (1), రచిన్ (2)ను ఔట్ చేసి షాకిచ్చాడు. వెటరన్ పేసర్ ఇషాంత్ కూడా మెరుగ్గా బౌలింగ్ వేయడంతో చెన్నైకు పరుగులు రావడం కష్టమైంది. పవర్ప్లేలో 32/2తో నిలిచిన జట్టును నడిపించే బాధ్యతను రహానె, డరిల్ మిచెల్ (34) తీసుకున్నారు. రసిక్ బౌలింగ్లో చెరో సిక్సర్తో ఈ జోడీ వేగం పెంచాలని చూసింది. కానీ మిచెల్ను అక్షర్ (1/20) బుట్టలో వేసుకున్నాడు. ఓ ఎండ్లో పోరాటం కొనసాగించిన రహానెకు శివమ్ దూబె (18) తోడవడంతో 13 ఓవర్లలో స్కోరు 100 దాటింది. అప్పుడు బౌలింగ్కు వచ్చిన ముకేశ్ మ్యాచ్ను పూర్తిగా దిల్లీ వైపు తిప్పేశాడు. వరుస బంతుల్లో రహానె, సమీర్ రిజ్వీ (0)ను ఔట్ చేసిన అతను.. ఆ తర్వాత దూబేను పెవిలియన్ చేర్చడంతో చెన్నై పనైపోయింది. జట్టు ఓటమి ఖాయమైనా.. అభిమానులకు ధోని బ్యాటింగ్ చూసే అవకాశం రావడంతో స్టేడియం దద్దరిల్లింది. జడేజా (21 నాటౌట్)తో కలిసి ధోని ఓటమి అంతరాన్ని తగ్గించగలిగాడు.
ఆ మెరుపులతో..: విశాఖలో టీ20ల్లో ఛేదన జట్లదే ఆధిపత్యం. కానీ పిచ్ చక్కగా సహకరిస్తుందని పంత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే కాస్త పచ్చికతో కూడిన పిచ్పై చెన్నై పేసర్లు ఆరంభంలో కట్టడి చేయడంతో 4 ఓవర్లకు దిల్లీ స్కోరు 24. కానీ చాహర్ వేసిన ఇన్నింగ్స్ అయిదో ఓవర్తో అంతా మారిపోయింది. ఆ ఓవర్లో వరుసగా 6, 4, 4తో వార్నర్ విధ్వంసం మొదలెట్టగా.. ఆ వెంటనే ముస్తాఫిజుర్ బౌలింగ్లో హ్యాట్రిక్ ఫోర్లతో ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న పృథ్వీ జోరందుకున్నాడు. ఈ ఇద్దరు బౌండరీల వేటలో సాగిపోయారు. కానీ పతిరన అద్భుత ఫీల్డింగ్, సంచలన బౌలింగ్తో దిల్లీకి కళ్లెం వేశాడు. పతిరన పట్టిన సూపర్ క్యాచ్కు వార్నర్ నిష్క్రమించాడు. పృథ్వీ కూడా వెనుదిరడగంతో 11 ఓవర్లకు దిల్లీ 104/2తో నిలిచింది. మిచెల్ మార్ష్ (18)తో పాటు స్టబ్స్ (0)ను ఒకే ఓవర్లో తిరుగులేని యార్కర్లతో పతిరన బౌల్డ్ చేయడంతో దిల్లీ కష్టాల్లో పడింది. ఈ దశలో పంత్ నిలబడ్డాడు. నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించిన అతను లయ అందుకున్నాక చెలరేగాడు. మొదట 23 బంతుల్లో 23 పరుగులే చేసిన పంత్.. ఆ తర్వాత ఆడిన 9 బంతుల్లో ఏకంగా 28 పరుగులు చేశాడు. పతిరన బౌలింగ్లో క్రీజులో బలంగా నిలబడి, భుజాల బలాన్ని ఉపయోగించి అతను కొట్టిన సిక్సర్ ఆకట్టుకుంది. ఆ వెంటనే మరో రెండు ఫోర్లతో పంత్ అర్ధశతకం అందుకున్నాడు. కానీ వెంటనే ఔటైపోవడంతో దిల్లీ 200లోపే ఆగిపోయింది.
దిల్లీ ఇన్నింగ్స్: పృథ్వీ (సి) ధోని (బి) జడేజా 43; వార్నర్ (సి) పతిరన (బి) ముస్తాఫిజుర్ 52; పంత్ (సి) రుతురాజ్ (బి) పతిరన 51; మార్ష్ (బి) పతిరన 18; స్టబ్స్ (బి) పతిరన 0; అక్షర్ నాటౌట్ 7; అభిషేక్ నాటౌట్ 9; ఎక్స్ట్రాలు 11; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 191; వికెట్ల పతనం: 1-93, 2-103, 3-134, 4-134, 5-178; బౌలింగ్: దీపక్ చాహర్ 4-0-42-0; తుషార్ 4-0-24-0; ముస్తాఫిజుర్ 4-0-47-1; జడేజా 4-0-43-1; పతిరన 4-0-31-3
చెన్నై ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) పంత్ (బి) ఖలీల్ 1; రచిన్ (సి) స్టబ్స్ (బి) ఖలీల్ 2; రహానె (సి) వార్నర్ (బి) ముకేశ్ 45; మిచెల్ (సి) అండ్ (బి) అక్షర్ 34; దూబె (సి) స్టబ్స్ (బి) ముకేశ్ 18; సమీర్ (సి) ఖలీల్ (బి) ముకేశ్ 0; జడేజా నాటౌట్ 21; ధోని నాటౌట్ 37; ఎక్స్ట్రాలు 13; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 171; వికెట్ల పతనం: 1-3, 2-7, 3-75, 4-102, 5-102, 6-120; బౌలింగ్: ఖలీల్ 4-1-21-2; ఇషాంత్ 3-0-23-0; నోకియా 4-0-43-0; అక్షర్ 3-0-20-1; రసిక్ 2-0-25-0; మార్ష్ 1-0-14-0; ముకేశ్ 3-0-21-3
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి