విశాఖలో దిల్లీ కేక
ఐపీఎల్-17లో దిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. వరుసగా రెండు ఓటముల నుంచి పుంజుకున్న ఆ జట్టు ఆదివారం విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్లో 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై గెలిచింది.
ఐపీఎల్-17లో బోణీ
సీఎస్కేపై విజయం
మెరిసిన వార్నర్, పంత్
గత నాలుగు ఐపీఎల్ మ్యాచ్ల్లో దిల్లీపై సీఎస్కేదే విజయం. ఈ సీజన్లో తొలి రెండు మ్యాచ్ల్లో అన్ని విభాగాల్లోనూ విఫలమైన దిల్లీ ఓటములతో ఢీలా పడింది. దీంతో మరోసారి చెన్నై ఫేవరెట్గా కనిపించింది. కానీ విశాఖ వేదికగా దిల్లీ గెలుపు కేక పెట్టింది. పంత్ ఒకప్పటిలా మెరుపులు మెరిపించగా.. వార్నర్ నిలకడ కొనసాగించాడు. బౌలింగ్లో ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్ చెలరేగారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో.. అదిరే ఆటతీరుతో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్కు ఈ సీజన్లో దిల్లీ తొలి ఓటమి రుచి చూపించింది.
విశాఖపట్నం
ఐపీఎల్-17లో దిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. వరుసగా రెండు ఓటముల నుంచి పుంజుకున్న ఆ జట్టు ఆదివారం విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్లో 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై గెలిచింది. మొదట దిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. వార్నర్ (52; 35 బంతుల్లో 5×4, 3×6), పంత్ (51; 32 బంతుల్లో 4×4, 3×6), పృథ్వీ షా (43; 27 బంతుల్లో 4×4, 2×6) రాణించారు. చెన్నై బౌలర్లలో పతిరన (3/31) సత్తాచాటాడు. ఛేదనలో ముకేశ్ కుమార్ (3/21), ఖలీల్ అహ్మద్ (2/21) ధాటికి సీఎస్కే 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులే చేయగలిగింది. రహానె (45; 30 బంతుల్లో 5×4, 2×6) పోరాడాడు. ధోని (37 నాటౌట్; 16 బంతుల్లో 4×4, 3×6) అభిమానులను అలరించాడు.
పేస్ దెబ్బ: భారీ లక్ష్య ఛేదనలో చెన్నైని ఆరంభంలో అహ్మద్, ఆఖర్లో ముకేశ్ దెబ్బకొట్టారు. అహ్మద్ వరుస ఓవర్లలో ఓపెనర్లు రుతురాజ్ (1), రచిన్ (2)ను ఔట్ చేసి షాకిచ్చాడు. వెటరన్ పేసర్ ఇషాంత్ కూడా మెరుగ్గా బౌలింగ్ వేయడంతో చెన్నైకు పరుగులు రావడం కష్టమైంది. పవర్ప్లేలో 32/2తో నిలిచిన జట్టును నడిపించే బాధ్యతను రహానె, డరిల్ మిచెల్ (34) తీసుకున్నారు. రసిక్ బౌలింగ్లో చెరో సిక్సర్తో ఈ జోడీ వేగం పెంచాలని చూసింది. కానీ మిచెల్ను అక్షర్ (1/20) బుట్టలో వేసుకున్నాడు. ఓ ఎండ్లో పోరాటం కొనసాగించిన రహానెకు శివమ్ దూబె (18) తోడవడంతో 13 ఓవర్లలో స్కోరు 100 దాటింది. అప్పుడు బౌలింగ్కు వచ్చిన ముకేశ్ మ్యాచ్ను పూర్తిగా దిల్లీ వైపు తిప్పేశాడు. వరుస బంతుల్లో రహానె, సమీర్ రిజ్వీ (0)ను ఔట్ చేసిన అతను.. ఆ తర్వాత దూబేను పెవిలియన్ చేర్చడంతో చెన్నై పనైపోయింది. జట్టు ఓటమి ఖాయమైనా.. అభిమానులకు ధోని బ్యాటింగ్ చూసే అవకాశం రావడంతో స్టేడియం దద్దరిల్లింది. జడేజా (21 నాటౌట్)తో కలిసి ధోని ఓటమి అంతరాన్ని తగ్గించగలిగాడు.
ఆ మెరుపులతో..: విశాఖలో టీ20ల్లో ఛేదన జట్లదే ఆధిపత్యం. కానీ పిచ్ చక్కగా సహకరిస్తుందని పంత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే కాస్త పచ్చికతో కూడిన పిచ్పై చెన్నై పేసర్లు ఆరంభంలో కట్టడి చేయడంతో 4 ఓవర్లకు దిల్లీ స్కోరు 24. కానీ చాహర్ వేసిన ఇన్నింగ్స్ అయిదో ఓవర్తో అంతా మారిపోయింది. ఆ ఓవర్లో వరుసగా 6, 4, 4తో వార్నర్ విధ్వంసం మొదలెట్టగా.. ఆ వెంటనే ముస్తాఫిజుర్ బౌలింగ్లో హ్యాట్రిక్ ఫోర్లతో ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న పృథ్వీ జోరందుకున్నాడు. ఈ ఇద్దరు బౌండరీల వేటలో సాగిపోయారు. కానీ పతిరన అద్భుత ఫీల్డింగ్, సంచలన బౌలింగ్తో దిల్లీకి కళ్లెం వేశాడు. పతిరన పట్టిన సూపర్ క్యాచ్కు వార్నర్ నిష్క్రమించాడు. పృథ్వీ కూడా వెనుదిరడగంతో 11 ఓవర్లకు దిల్లీ 104/2తో నిలిచింది. మిచెల్ మార్ష్ (18)తో పాటు స్టబ్స్ (0)ను ఒకే ఓవర్లో తిరుగులేని యార్కర్లతో పతిరన బౌల్డ్ చేయడంతో దిల్లీ కష్టాల్లో పడింది. ఈ దశలో పంత్ నిలబడ్డాడు. నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించిన అతను లయ అందుకున్నాక చెలరేగాడు. మొదట 23 బంతుల్లో 23 పరుగులే చేసిన పంత్.. ఆ తర్వాత ఆడిన 9 బంతుల్లో ఏకంగా 28 పరుగులు చేశాడు. పతిరన బౌలింగ్లో క్రీజులో బలంగా నిలబడి, భుజాల బలాన్ని ఉపయోగించి అతను కొట్టిన సిక్సర్ ఆకట్టుకుంది. ఆ వెంటనే మరో రెండు ఫోర్లతో పంత్ అర్ధశతకం అందుకున్నాడు. కానీ వెంటనే ఔటైపోవడంతో దిల్లీ 200లోపే ఆగిపోయింది.
దిల్లీ ఇన్నింగ్స్: పృథ్వీ (సి) ధోని (బి) జడేజా 43; వార్నర్ (సి) పతిరన (బి) ముస్తాఫిజుర్ 52; పంత్ (సి) రుతురాజ్ (బి) పతిరన 51; మార్ష్ (బి) పతిరన 18; స్టబ్స్ (బి) పతిరన 0; అక్షర్ నాటౌట్ 7; అభిషేక్ నాటౌట్ 9; ఎక్స్ట్రాలు 11; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 191; వికెట్ల పతనం: 1-93, 2-103, 3-134, 4-134, 5-178; బౌలింగ్: దీపక్ చాహర్ 4-0-42-0; తుషార్ 4-0-24-0; ముస్తాఫిజుర్ 4-0-47-1; జడేజా 4-0-43-1; పతిరన 4-0-31-3
చెన్నై ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) పంత్ (బి) ఖలీల్ 1; రచిన్ (సి) స్టబ్స్ (బి) ఖలీల్ 2; రహానె (సి) వార్నర్ (బి) ముకేశ్ 45; మిచెల్ (సి) అండ్ (బి) అక్షర్ 34; దూబె (సి) స్టబ్స్ (బి) ముకేశ్ 18; సమీర్ (సి) ఖలీల్ (బి) ముకేశ్ 0; జడేజా నాటౌట్ 21; ధోని నాటౌట్ 37; ఎక్స్ట్రాలు 13; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 171; వికెట్ల పతనం: 1-3, 2-7, 3-75, 4-102, 5-102, 6-120; బౌలింగ్: ఖలీల్ 4-1-21-2; ఇషాంత్ 3-0-23-0; నోకియా 4-0-43-0; అక్షర్ 3-0-20-1; రసిక్ 2-0-25-0; మార్ష్ 1-0-14-0; ముకేశ్ 3-0-21-3
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. రెండింటి కోసం నాలుగు పోటీ
ఐపీఎల్లో మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. భారీ స్కోర్లు నమోదవుతూ అభిమానులను అలరిస్తున్నాయి. అయితే, టాప్ -4లో నిలిచి ప్లేఆఫ్స్కు అర్హత సాధించే జట్లేవనేది ఆసక్తికరంగా మారింది. -
ఓడితే ‘నాకౌట్’ కష్టాలు తప్పవు.. ‘ఉప్పల్’లో వరుణుడు ఏం చేసేనో?
హైదరాబాద్ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ మ్యాచ్ వచ్చేస్తోంది. లఖ్నవూతో ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరగనుంది. -
ఈ నిర్ణయం థర్డ్ అంపైర్కూ కష్టమే.. సంజూ ఔట్తోనే ఓడిపోయాం: సంగక్కర
సంజూ శాంసన్ ఇచ్చిన క్యాచ్ను దిల్లీ ఫీల్డర్ షై హోప్ అద్భుతంగా పట్టాడు. కానీ, బౌండరీ లైన్కు అతడి పాదం తాకిందనే ఆరోపణలు వచ్చాయి. థర్డ్ అంపైర్ మాత్రం ఔట్గా ఇవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. -
అందుకే వేగంగా బంతులేస్తా.. ఫెరీరాను తొలి బంతికే ఔట్ చేయడంపై కుల్దీప్
దిల్లీ మళ్లీ విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. రాజస్థాన్ను ఓడించడంలో ఆ జట్టు బౌలర్ కుల్దీప్ కీలక పాత్ర పోషించాడు. -
సంజూ క్యాచ్ ఔట్ వివాదం.. ఫీల్డర్ రెండుసార్లు రోప్ను తాకాడన్న సిద్ధూ!
క్యాచ్ల విషయంలో రిప్లేలో స్పష్టంగా కనిపిస్తున్నా.. నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం అంపైర్లు పొరపాటు చేయడం సరైంది కాదనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. -
క్యాచ్పై అంపైర్తో తీవ్ర వాగ్వాదం.. సంజూకు భారీ జరిమానా
ఔట్పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంపైర్తో వాగ్వాదం చేసిన సంజూ శాంసన్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ చర్యలు తీసుకుంది. ఇలా ప్రవర్తించడం సరైంది కాదంటూ భారీ జరిమానా విధించింది. -
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. రెండింటి కోసం నాలుగు పోటీ
-
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
-
రోజంతా ఒడుదుడుకుల్లో సూచీలు.. చివరికి ఫ్లాట్గా
-
‘ట్రంప్తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం
-
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్
-
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?