కుల్దీప్ మాయ.. కుర్రాడి మెరుపులు
మొదట 160కి పైగా పరుగులు చేస్తే చాలు.. ఐపీఎల్లో ఓడిపోని చరిత్ర లఖ్నవూ సూపర్ జెయింట్స్ది. దిల్లీతో పోరులో ఆయుష్ బదోని అద్భుత పోరాటంతో ఆ జట్టు 167 పరుగులు చేసింది.
దిల్లీకి రెండో విజయం
సొంతగడ్డపై లఖ్నవూకు చెక్
బదోని పోరాటం వృథా
మొదట 160కి పైగా పరుగులు చేస్తే చాలు.. ఐపీఎల్లో ఓడిపోని చరిత్ర లఖ్నవూ సూపర్ జెయింట్స్ది. దిల్లీతో పోరులో ఆయుష్ బదోని అద్భుత పోరాటంతో ఆ జట్టు 167 పరుగులు చేసింది. ఇంకేముంది.. బలమైన బౌలింగ్ దళంతో మరోసారి ప్రత్యర్థిని చుట్టేస్తుందనే అంచనా కలిగింది. కానీ దిల్లీ అదరగొట్టింది. లఖ్నవూ జోరుకు కళ్లెం వేసింది. అరంగేట్ర ఆటగాడు జేక్ ఫ్రేజర్తో పాటు కెప్టెన్ పంత్ కూడా చెలరేగడంతో లఖ్నవూను ఓడించిన డీసీ.. రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
లఖ్నవూ
ఐపీఎల్- 17లో వరుస ఓటముల నుంచి దిల్లీ క్యాపిటల్స్ బయటపడింది. శుక్రవారం ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో లఖ్నవూ సూపర్ జెయింట్స్ను ఓడించింది. మొదట లఖ్నవూ 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ (3/20) స్పిన్ వలలో చిక్కుకున్న ఆ జట్టును ఆయుష్ బదోని (55 నాటౌట్; 35 బంతుల్లో 5×4, 1×6) ఆదుకున్నాడు. కేఎల్ రాహుల్ (39; 22 బంతుల్లో 5×4, 1×6) కూడా రాణించాడు. తన తొలి ఐపీఎల్ మ్యాచ్లోనే ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ (55; 35 బంతుల్లో 2×4, 5×6), పంత్ (41; 24 బంతుల్లో 4×4, 2×6) చెలరేగడంతో దిల్లీ 4 వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. లఖ్నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్ (2/25) ఆకట్టుకున్నాడు.
కొత్త కుర్రాడి మెరుపులు: ఛేదనలో దిల్లీకి కావాల్సిన ఆరంభం దొరికింది. వార్నర్ (8) బంతిని వికెట్ల మీదకు ఆడి నిష్క్రమించినా.. ఫ్రేజర్తో కలిసి పృథ్వీ (32) జట్టును నడిపించాడు. ఫ్రేజర్ సిక్సర్లతో చెలరేగగా.. పృథ్వీ చూడముచ్చటైన షాట్లతో ఫోర్లు రాబట్టాడు. దీంతో ఆరు ఓవర్లకు 62/1తో దిల్లీ మెరుగ్గా కనిపించింది. కానీ తర్వాతి ఓవర్లోనే బంతి అందుకున్న బిష్ణోయ్.. పృథ్వీని బోల్తా కొట్టించాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని పృథ్వీ స్లాగ్స్వీప్ ఆడగా డీప్ మిడ్వికెట్లో ముందుకు డైవ్ చేస్తూ పూరన్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. దీని తర్వాత పరుగుల వేగం పడిపోయింది. బౌండరీల సంగతి పక్కనపెడితే సింగిల్సూ కష్టంగా వచ్చాయి. టైమింగ్ కుదరక పంత్ ఇబ్బంది పడ్డాడు. ఒత్తిడి పెరగడంతో ఫ్రేజర్ కూడా బంతులను వృథా చేశాడు. 29 బంతుల పాటు ఒక్క బౌండరీ రాలేదు. ఇలా అయితే లాభం లేదనుకుని పంత్ గేరు మార్చాడు. బిష్ణోయ్ బౌలింగ్లో వరుసగా 6, 4తో ఇన్నింగ్స్కు తిరిగి ఊపు తెచ్చాడు. స్టాయినిస్ బౌలింగ్లో రివర్స్ స్కూప్తో పంత్ కొట్టిన ఫోర్ ఆకట్టుకుంది. 12 ఓవర్లకు స్కోరు 100కు చేరింది. తానేం తక్కువ కాదన్నట్లు కృనాల్కు వరుసగా మూడు సిక్సర్లతో ఫ్రేజర్ చుక్కలు చూపించడంతో మ్యాచ్ దిల్లీ వైపు మొగ్గింది. 21 పరుగుల ఈ ఓవరే కీలక మలుపు. దీంతో సాధించాల్సిన రన్రేట్ అందుబాటులోకి వచ్చింది. ఫ్రేజర్ అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. పంత్ తనదైన శైలిలో సిక్సర్లతో సాగిపోయాడు. ఈ జోడీ మూడో వికెట్కు 77 పరుగులు జతచేసింది. కానీ వరుస ఓవర్లలో ఫ్రేజర్, పంత్ ఔట్ కావడంతో ఆఖర్లో ఉత్కంఠ తప్పదేమో అనిపించింది. కానీ ఎలాంటి నాటకీయతకు తావులేకుండా స్టబ్స్ (15 నాటౌట్), హోప్ (11 నాటౌట్) పని పూర్తిచేశారు. స్టబ్స్ సిక్సర్తో మ్యాచ్ ముగించాడు.
ఆదుకున్న ఆయుష్: 57/2.. పవర్ప్లేలో లఖ్నవూ స్కోరిది. ఆ జట్టు అలవోకగా 180కి పైగా పరుగులు చేస్తుందనిపించింది. కానీ కుల్దీప్ దెబ్బకు 13 ఓవర్లలో 94/7తో కష్టాల్లో జట్టు. అప్పుడు 120 చేసినా గొప్పే అనిపించింది. కానీ చివరకు 160కి పైగా పరుగులతో ముగించింది. అందుకు కారణం ఆయుష్ పోరాటం. మొదట కేఎల్ రాహుల్ దూకుడు ప్రదర్శించాడు. సాధారణంగా నెమ్మదిగా బ్యాటింగ్ ప్రారంభించి, క్రమంగా జోరందుకునే అతను.. ఈ మ్యాచ్లో మాత్రం మొదటి నుంచే ఎదురుదాడికి దిగాడు. ఖలీల్ (2/41) తన వరుస ఓవర్లలో డికాక్ (19), దేవ్దత్ (3)ను వెనక్కిపంపినా.. కేఎల్ మెరుపులతో లఖ్నవూ సాగిపోయింది. కానీ ఎప్పుడైతే కుల్దీప్ బంతి అందుకున్నాడో అప్పుడే లఖ్నవూ పరిస్థితి తలకిందులైంది. గాయంతో గత రెండు మ్యాచ్లకు దూరమైన ఈ మణికట్టు మాంత్రికుడు తిరిగి వస్తూనే ప్రత్యర్థికి దిమ్మతిరిగే షాకిచ్చాడు. ప్రమాదకర స్టాయినిస్ (8), పూరన్ (0)ను వరుస బంతుల్లో ఔట్ చేసి లఖ్నవూ నడ్డివిరిచాడు. మిడిల్ స్టంప్పై పడ్డ బంతి అవతలకు తిరుగుతుందేమో అనుకుని పూరన్ బయటకు ఆడాడు. కానీ అది నేరుగా వెళ్లి స్టంప్స్ను ఎగరేసింది. తన తర్వాతి ఓవర్లో రాహుల్నూ కుల్దీప్ బుట్టలో వేసుకున్నాడు. వికెట్ల పతనం కొనసాగడంతో లఖ్నవూకు కష్టమే అనిపించింది. కానీ ఆయుష్ అనూహ్యంగా చెలరేగాడు. వరుసగా విఫలమవుతున్నా అవకాశాలిస్తూ జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ గొప్పగా పోరాడాడు. ఈ దశలో బౌలింగ్లో, ఫీల్డింగ్లో వైఫల్యంతో దిల్లీ పట్టు విడవడమూ ఆయుష్కు కలిసొచ్చింది. ఈ కుర్రాడు క్రీజులో సౌకర్యంగా కదులుతూ షాట్లు కొట్టాడు. పుల్ షాట్ను ఉత్తమంగా ఆడాడు. పేసర్లు ఖలీల్, ముకేశ్ (1/41)ను సమర్థంగా ఎదుర్కొన్నాడు. 31 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు. పేసర్ అర్షద్ ఖాన్ (20 నాటౌట్) కూడా క్రీజులో పట్టుదలతో నిలిచాడు. ఈ జోడీ అబేధ్యమైన ఎనిమిదో వికెట్కు 42 బంతుల్లోనే 73 పరుగులు జతచేసింది. చివరి 3 ఓవర్లలో లఖ్నవూ 39 పరుగులు పిండుకోవడంతో స్కోరు 170కి చేరువైంది.
లఖ్నవూ ఇన్నింగ్స్: డికాక్ ఎల్బీ (బి) ఖలీల్ 19; కేఎల్ రాహుల్ (సి) పంత్ (బి) కుల్దీప్ 39; పడిక్కల్ ఎల్బీ (బి) ఖలీల్ 3; స్టాయినిస్ (సి) ఇషాంత్ (బి) కుల్దీప్ 8; పూరన్ (బి) కుల్దీప్ 0; దీపక్ హుడా (సి) వార్నర్ (బి) ఇషాంత్ 10; బదోని నాటౌట్ 55; కృనాల్ (సి) పంత్ (బి) ముకేశ్ 3; అర్షద్ నాటౌట్ 20; ఎక్స్ట్రాలు 10; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 167
వికెట్ల పతనం: 1-28, 2-41, 3-66, 4-66, 5-77, 6-89, 7-94; బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4-0-41-2; ఇషాంత్ 4-0-36-1; ముకేశ్ కుమార్ 4-0-41-1; అక్షర్ 4-0-26-0; కుల్దీప్ 4-0-20-3
దిల్లీ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) పూరన్ (బి) బిష్ణోయ్ 32; వార్నర్ (బి) యశ్ ఠాకూర్ 8; జేక్ ఫ్రేజర్ (సి) అర్షద్ (బి) నవీనుల్ 55; పంత్ (స్టంప్డ్) రాహుల్ (బి) బిష్ణోయ్ 41; స్టబ్స్ నాటౌట్ 15; హోప్ నాటౌట్ 11; ఎక్స్ట్రాలు 8; మొత్తం: (18.1 ఓవర్లలో 4 వికెట్లకు) 170
వికెట్ల పతనం: 1-24, 2-63, 3-140, 4-146; బౌలింగ్: అర్షద్ ఖాన్ 3.1-0-34-0; నవీనుల్ హక్ 3-0-24-1; యశ్ ఠాకూర్ 4-0-31-1; కృనాల్ 3-0-45-0; రవి బిష్ణోయ్ 4-0-25-2; స్టాయినిస్ 1-0-10-0
73
ఈ మ్యాచ్లో బదోని, అర్షద్ జతచేసిన పరుగులు. ఐపీఎల్ చరిత్రలో ఎనిమిదో వికెట్కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. గత రికార్డు (2014లో రాజస్థాన్ తరపున బ్రాడ్హాడ్జ్, ఫాల్క్నర్ కలిసి 69) బద్దలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
శ్రీలంకతో టీమ్ ఇండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ రెండు ఫార్మాట్లకు శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఎంపికైన విషయం తెలిసిందే. -
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు