జ్యోతి వెలిగింది.. పారిస్ మురిసింది
ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా పండుగ ఒలింపిక్స్కు సమయం దగ్గర పడుతోంది. సరిగ్గా ఇంకో వంద రోజుల్లోనే పారిస్లో ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది.
ఇంకో వంద రోజులో ఒలింపిక్స్
గ్రీస్
ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా పండుగ ఒలింపిక్స్కు సమయం దగ్గర పడుతోంది. సరిగ్గా ఇంకో వంద రోజుల్లోనే పారిస్లో ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ పుట్టిల్లు గ్రీస్లో మంగళవారం ఒలింపిక్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి వచ్చిన వేలమంది క్రీడాభిమానుల సమక్షంలో పురాతన ఒలింపియా ప్రాంతంలో ఈ వేడుక జరిగింది. అయితే జ్యోతి ప్రజ్వలన సంప్రదాయ రీతిలో మాత్రం నిర్వహించడానికి అవకాశం లేకపోయింది. గ్రీకు ప్రజలు దేవుడిగా ఆరాధించే సూర్యుడి నుంచి వచ్చే కిరణాల సాయంతో జ్యోతిని వెలిగించడం ఆనవాయితీ. కిరణాలు ఓ అద్దం మీద పడితే దాని ద్వారా జ్యోతి అంటుకుంటుంది. అయితే మంగళవారం వాతావరణం మబ్బులు కమ్మి ఉండడంతో జ్యోతి ప్రజ్వలన చేయాల్సిన సమయానికి సూర్య కిరణాలు పడలేదు. దీంతో ముందు రోజు రిహార్సల్స్ భాగంగా సూర్య కిరణాల సాయంతోనే వెలిగించిన మరో జ్యోతి సాయంతో ఒలింపిక్ జ్యోతి ప్రజ్వలన జరిగింది. ఫ్రెంచ్ నటి మేరి మిన జ్యోతిని వెలిగించి టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ విజేత అయిన గ్రీస్ రోయర్ స్టెఫనోస్ డౌస్కోస్కు అందించింది. అతను కౌబెర్టిన్ ప్రాంతానికి చేరుకోగా.. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో మూడు పతకాలు సాధించిన స్విమ్మర్ లారి మనౌదౌ జ్యోతిని అందుకుంది. ఆమె తర్వాత యూరోపియన్ యూనియన్ అధికారి మార్గరిటిస్ షినాస్కు జ్యోతిని అందించింది. ఒలింపిక్ జ్యోతి గ్రీస్లో 5 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మంగళవారం మొదలైన ఈ యాత్ర ఈ నెల 26న ఏథెన్స్కు చేరుకుంటుంది. అక్కడ ఒలింపిక్స్ నిర్వాహకులకు జ్యోతిని అందజేస్తారు.
ఈసారి సందడే సందడి
టోక్యో క్రీడలు అభిమానుల కోణంలో అత్యంత నిరాశాజనక ఒలింపిక్స్గా నిలిచాయి. కరోనా కారణంగా 2020లో జరగాల్సిన ఒలింపిక్స్ను ఏడాది వాయిదా వేసి 2021లో నిర్వహించారు. అప్పుడు కూడా అనేక ఆంక్షలు తప్పలేదు. స్టేడియాల్లోకి అభిమానులను అనుమతించలేదు. అథ్లెట్లకు తోడుగా వచ్చే కుటుంబ సభ్యులు, సహాయ సిబ్బంది విషయంలోనూ పరిమితి విధించారు. దీంతో అభిమానులు, సన్నిహితుల ప్రోత్సాహం లేకుండా నిరాశాజనక వాతావరణంలో పోటీ పడ్డ అథ్లెట్లు కూడా పూర్తి స్థాయి ప్రదర్శన చేయలేకపోయారు. గతంతో పోలిస్తే బద్దలైన రికార్డులు తక్కువే. మొత్తంగా కరోనా కారణంగా ఒలింపిక్స్ చాలా స్తబ్దుగా సాగిపోయాయి. ఈసారి ఆ మహమ్మారి ఊసే లేదు. ఎప్పట్లా ఒలింపిక్స్ అభిమానుల కోలాహలం మధ్య సాగబోతున్నాయి. అథ్లెట్లకు ఎలాంటి ఆంక్షలు లేవు కాబట్టి స్వేచ్ఛగా క్రీడల్లో పోటీ పడబోతున్నారు.
ఈ జ్యోతి ప్రత్యేకం
ఈసారి వినియోగిస్తున్న ఒలింపిక్ జ్యోతి చాలా భిన్నమైంది. ఆకృతి సహా అన్ని విషయాల్లోనూ ఇది ప్రత్యేకమే. పారిస్కు తలమానికమైన ఈఫిల్ టవర్ నీటి ప్రతిబింబం ఆకృతిలో దీన్ని తయారు చేయడం విశేషం. సెన్ నదిలో టవర్ ప్రతిబింబం ఎలా కనిపిస్తుందో అదే తరహాలో దీన్ని రూపొందించారు. ఫ్రెంచ్ డిజైనర్ మాథ్యూస్ లెహన్యూర్ దీని సృష్టికర్త. జ్యోతి ఇతివృత్తం.. ప్రపంచ శాంతి. గత జ్యోతులతో పోలిస్తే దీని పరిమాణం తక్కువ. ఆకృతి కూడా భిన్నమే. మామూలుగా జ్యోతి ‘వి’ ఆకృతిలో కింద సన్నగా ఉండి, పైకి వెళ్లే కొద్దీ వెడల్పుగా మారుతుంది. కానీ ఈసారి మాత్రం జ్యోతి మధ్యలో వెడల్పుగా ఉండి.. ఇరు వైపులా వెడల్పు తగ్గుతూ వెళ్తుంది. రెండు విడి ముక్కల్ని అతికించినట్లు దీన్ని రూపొందించారు. జ్యోతి పొడవు 70 సెంటీమీటర్లు, బరువు 1.5 కేజీలు.
డీజే సంగీతానికి బ్రేక్ డ్యాన్స్ చేస్తూ..
ఈసారి ఒలింపిక్స్లో ఓ కొత్త క్రీడను చూడబోతున్నాం. అదే.. బ్రేకింగ్. ఇది బ్రేక్ డ్యాన్స్తో ముడిపడ్డ క్రీడ కావడం విశేషం. డీజే మ్యూజిక్ వినిపిస్తుంటే.. చిత్రమైన నృత్య విన్యాసాలు చేస్తారు క్రీడాకారులు. చేతులు కింద పెట్టి కాళ్లు పైకి లేపి సంగీతానికి తగ్గట్లు ఒంటిని రకరకాలుగా వంచడం.. మధ్య మధ్యలో నిశ్చలంగా ఉండడం లాంటి విన్యాసాలు చేస్తారు ఈ క్రీడలో. బృందాలుగా తలపడే ఈ క్రీడలో పురుషులకు, మహిళలకు ఒక్కో ఈవెంట్ ఉంటుంది. ఇది ఒలింపిక్స్లో తొలిసారి చూడబోయే క్రీడ కాగా.. సర్ఫింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, స్కేట్ బోర్డింగ్ మెగా ఈవెంట్లోకి పునరాగమనం చేస్తున్నాయి. టోక్యోలో పునరాగమనం చేసిన కరాటె క్రీడను ఈసారి ఒలింపిక్స్ నుంచి తప్పించారు. ఇక ఎప్పటికీ ఈ మెగా క్రీడల్లో కరాటె ఉండదు.
3 ఒలింపిక్స్కు మూడు పర్యాయాలు ఆతిథ్యమిస్తున్న రెండో నగరంగా పారిస్ నిలవనుంది. ఇంతకుముందు 1900లో, 1924లో ఇక్కడ ఒలింపిక్స్ జరిగాయి. లండన్ సైతం మూడుసార్లు (1908, 1948, 2012) ఒలింపిక్స్కు ఆతిథ్యమిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
శ్రీలంకతో టీమ్ ఇండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ రెండు ఫార్మాట్లకు శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఎంపికైన విషయం తెలిసిందే. -
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్