ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
కోల్కతా: భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్.. కోల్కతా నైట్రైడర్స్తో పోరులో నొప్పిని భరిస్తూనే అద్భుతంగా పోరాడి రికార్డు లక్ష్య ఛేదనతో అదరగొట్టాడు. ‘‘నమ్మకంతో ఉండాలి. ప్రస్తుత క్రికెట్లో అదే అత్యంత కీలకం. లయ కోసం కొంచెం ఇబ్బందిపడ్డా. అలాంటి సమయంలో నిరాశకు గురవుతాం. మనల్ని మనమే ప్రశ్నించుకుంటాం. ఏం ఫర్వాలేదు.. ప్రశాంతంగా ఉంటే లయను అందుకోవచ్చని నాకు నేను చెప్పుకుంటా. ఐపీఎల్లో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ధోని, కోహ్లి లాంటి ఆటగాళ్లు ఎంతో నమ్మకంతో చివరి వరకు క్రీజులో ఉంటారు. వారినే అనుకరించేందుకు ప్రయత్నించా. ఇప్పటి వరకు నేను ఆడిన ఇన్నింగ్స్లలో ఇదే అత్యుత్తమం’’ అని బట్లర్ తెలిపాడు.
ఒలింపిక్స్ దిశగా సిద్ధమవుతోన్న భారత అథ్లెట్లు
దిల్లీ: మరో వంద రోజుల్లో ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్ ఆరంభం కానున్నాయి. ఈ మెగా క్రీడల్లో మెరుగైన ప్రదర్శనపై కన్నేసిన భారత్ ఆ దిశగా సన్నద్ధమవుతోంది. టోక్యో ఒలింపిక్స్లో ఓ స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో అత్యుత్తమ ప్రదర్శన చేసిన మన అథ్లెట్లు.. ఈ సారి ఆ రికార్డును తిరగరాయాలనే లక్ష్యంతో ఉన్నారు. గత ఒలింపిక్స్లో 18 క్రీడాంశాల్లో 126 మంది భారత అథ్లెట్లు పోటీపడ్డారు. ఈ సారి ఇప్పటికే 10 క్రీడాంశాల్లో 42 మంది భారత అథ్లెట్లు ఒలింపిక్ బెర్తులు సాధించారు. కోటా స్థానాలు ఇంకా ఎక్కువే. అత్యధికంగా షూటింగ్లో 20 కోటా స్థానాలు గెలిచారు. అథ్లెటిక్స్లో 9, టేబుల్ టెన్నిస్లో 6, బ్యాడ్మింటన్లో 4, బాక్సింగ్లో 4 చొప్పున సొంతం చేసుకున్నారు. ఇప్పుడు చాలా విభాగాల్లో ఒలింపిక్ అర్హత ప్రక్రియ చివరి దశలో ఉండటంతో రాబోయే కొన్ని వారాల్లో మరింత మంది భారత అథ్లెట్లు ఆ మెగా క్రీడల పోటీపడే అవకాశం పట్టేయనున్నారు.
అందుకు బట్లర్ సెంచరీ సంకేతం
కోల్కతా: ప్రొఫెషనల్ క్రికెటర్లకు అత్యుత్తమ ఫిట్నెస్ అవసరమనడానికి జోస్ బట్లర్ శతకం సంకేతమని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్ మూడీ అన్నాడు. ‘‘బట్లర్ అత్యుత్తమ ఫిట్నెస్ కలిగిన ఆటగాడు కాబట్టి ఇన్నింగ్స్ కొనసాగించగలిగాడు. ప్రస్తుత టీ20 క్రికెట్ ప్రపంచం లేదా మరో ఫార్మాట్ అయినా అత్యుత్తమ ఫిట్నెస్ చాలా ముఖ్యం. ఆటగాళ్లకు కేవలం నైఫుణ్యముంటే సరిపోదు. ఆ కాలం ఎప్పుడో పోయింది. బట్లర్ అగ్రశ్రేణి అథ్లెట్. అందుకే చివరి బంతి వరకు క్రీజులో ఉండి జట్టుకు విజయం అందించాడు. శారీరకంగా మెరుగైన స్థితిలో ఉండబట్టే గాయం నుంచి తిరిగొచ్చాక కూడా బట్లర్ బలంగా నిలిచాడు. మానసికంగానూ అతను దృఢంగా ఉన్నాడు’’ అని మూడీ తెలిపాడు.
నాదల్ పరాజయం
బార్సిలోనా: బార్సిలోనా ఓపెన్తో పునరాగమనం చేసిన టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్.. రెండో రౌండ్ దాటలేకపోయాడు. బుధవారం జరిగిన మ్యాచ్లో అతడు 5-7, 1-6తో డిమాన్వర్ చేతిలో ఓడిపోయాడు. గాయంతో మూడు నెలల ఆటకు దూరమయ్యాక నాదల్ ఆడిన తొలి టోర్నీ ఇదే. బార్సిలోనా ఓపెన్లో మొత్తంగా నాదల్కు ఇది అయిదో ఓటమి. ఇక్కడ అతడు 12 సార్లు విజేతగా నిలిచాడు. వచ్చే వారం మాడ్రిడ్ ఓపెన్లో ఆడడానికి ప్రయత్నిస్తానని 37 ఏళ్ల నాదల్ చెప్పాడు. వచ్చే నెలలో ఫ్రెంచ్ ఓపెన్ ఆరంభం కానుంది.
కరువానాతో గుకేశ్ ఢీ
టొరంటో: క్యాండిడేట్స్ టోర్నీలో అంచనాలకు మించి రాణిస్తోన్న గుకేశ్ కీలక పోరుకు సిద్ధమయ్యాడు. ఆరు పాయింట్లతో నెపోమ్నియాషి (రష్యా)తో కలిసి అగ్రస్థానంలో ఉన్న అతడు.. 11వ రౌండ్లో టాప్ సీడ్ కరువానాతో తలపడనున్నాడు. ఈ గేమ్లో గుకేశ్ తెల్లపావులతో ఆడతాడు. స్ఫూర్తిదాయక ప్రదర్శనను కొనసాగిస్తూ 14వ రౌండ్ల టోర్నీలో అతడు టైటిల్ కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. ప్రజ్ఞానంద కూడా మరీ వెనుకబడేమీ లేడు. 5.5 పాయింట్లతో రేసులో ఉన్న అతడు.. 11వ రౌండ్లో హికరు నకముర (అమెరికా)ను ఢీకొంటాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
శ్రీలంకతో టీమ్ ఇండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ రెండు ఫార్మాట్లకు శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఎంపికైన విషయం తెలిసిందే. -
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత