ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
ఈనాడు క్రీడావిభాగం
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. కానీ ఎంతో కీలకమైన ఆల్రౌండర్ను ఏ కొలమానం ప్రకారం ఎంపిక చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే టీ20 ప్రపంచకప్ జట్టు రేసులో ఉన్న శివమ్ దూబె ఐపీఎల్లో కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తున్నాడు. సీఎస్కే తరపున ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ధనాధన్ ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. పేస్ ఆల్రౌండర్గానే వెలుగులోకి వచ్చిన దూబె.. ఐపీఎల్లో 2022 వరకు బౌలింగ్ చేశాడు. కానీ గతేడాది నుంచి కేవలం బ్యాటర్గానే ఆడుతున్నాడు. ఈ ఐపీఎల్కు ముందు అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్లో అత్యధిక పరుగులు (124) చేసిన బ్యాటర్గా నిలిచిన దూబె 7 ఓవర్లు వేసి రెండు వికెట్లూ తీసుకున్నాడు. భారత జట్టుకు ఆడితే దూబె రెండు మూడు ఓవర్లయినా వేయాల్సి ఉంటుంది. అఫ్గానిస్థాన్తో చివరి టీ20లో మూడు వికెట్లతో మెరిసిన స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్ బాధితుడే. ఈ సన్రైజర్స్ ఆటగాడు ఈ సీజన్లో ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. అది కూడా ఇంపాక్ట్ ప్లేయర్గానే. ఒకవేళ ఈ నిబంధన లేకుంటే ఆల్రౌండర్గా వాషింగ్టన్ జట్టులో కొనసాగేవాడేమో! రాహుల్ తెవాటియా, రియాన్ పరాగ్ కూడా ఇప్పుడు బ్యాటర్లుగానే మిగిలిపోతున్నారు. 2023 వరకు 88 మ్యాచ్ల్లో బౌలింగ్ చేసిన తెవాటియా 32 వికెట్లు పడగొట్టాడు. స్పెషలిస్ట్ బ్యాటర్గా మారిన పరాగ్ ఈ సారి 7 మ్యాచ్ల్లో 318 పరుగులు చేశాడు. దేశవాళీల్లో వికెట్ల వేటలో సాగుతున్న ఈ స్పిన్నర్ను సానబెడితే ఆల్రౌండర్గా మెరుగవుతాడు. కానీ ఐపీఎల్లో మ్యాచ్లో పరిస్థితులను బట్టి జట్లు ఇంపాక్ట్ ప్లేయర్గా అదనపు బ్యాటర్ లేదా బౌలర్ను ఆడిస్తున్నాయి. బ్యాటింగ్ పెద్దగా రాని బౌలర్ కోటా పూర్తి కాగానే అతని స్థానంలో బ్యాటర్ను తీసుకుంటున్నాయి. బ్యాటింగ్ ముగియగానే ఓ బౌలర్ను రప్పిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఆల్రౌండర్ల కొరత మరింత పెరగడం ఖాయం.
మానసిక రుగ్మత వల్లే వీడ్కోలు: లానింగ్
మెల్బోర్న్: మానసిక రుగ్మత వల్లే త్వరగా రిటైర్మెంట్ ప్రకటించానని ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ తెలిపింది. 31 ఏళ్లకే ఆటకు వీడ్కోలు పలికిన ఈ దిగ్గజ క్రీడాకారిణి అందుకు కారణాన్ని చాలారోజుల తర్వాత వెల్లడించింది. ‘‘రిటైర్మెంట్ ప్రకటించే సమయం ఇంకా రాలేదని చాలామంది అన్నారు. కానీ బరిలో దిగే పరిస్థితుల్లో లేను. యాషెస్ సిరీస్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో ఆడాలంటే ఎంతో అంకితభావం కావాలి. అందుకు మానసికంగా.. శారీరకంగా సిద్ధంగా లేను. శారీరకంగా ఎక్కువ కసరత్తులు చేసినట్లు అనిపించింది. 64 కేజీల నుంచి సుమారు 57 కేజీలకు బరువు తగ్గిపోయా. ఇది ఏకాగ్రతపై దెబ్బ కొడుతుందని ఊహించలేకపోయా. ఎడతెరిపి లేకుండా ఆడడం వల్ల స్నేహితులతో, బంధువులతో సంబంధాలు లేకుండాపోయాయి. ఏదో ఒకరోజు ఆటను ఆపేయాలి కదా అనుకున్నా. అందుకే ముందే ఆపేశాను. టీ20 ప్రపంచకప్, తొలి మహిళల ప్రిమియర్ లీగ్ మధ్య కాలంలో చాలా ఒంటరిగా అనిపించింది. నాపై నాకే నియంత్రణ లేనట్టుగా తోచింది. రాత్రి వేళల్లో కూడా నిద్ర రాదని ముందే అనుకుని ఉదయంలాగే దుస్తులు ధరించేదాన్ని’’ అని లానింగ్ తెలిపింది. 241 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి 8 వేలకు పైగా పరుగులు చేసిన లానింగ్ గతేడాది నవంబర్లో వీడ్కోలు పలికింది.
ఆ రోగులు ప్రత్యేక అతిథులుగా
అహ్మదాబాద్: బీసీసీఐ ఓ గొప్ప పని చేసింది. బుధవారం గుజరాత్ టైటాన్స్, దిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్కు 12 వేల మంది క్యాన్సర్, తలసేమియా రోగులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించి మ్యాచ్ చూసే అవకాశం కల్పించింది. క్యాన్సర్, తలసేమియాపై అవగాహన కోసం ఈ రోగులతో పాటు రక్తదాతలు, రక్తదాన శిబిరాల నిర్వాహకులకు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రత్యేక స్వాగతం పలికాడు. ‘‘ఈ అసామాన్య చర్య ద్వారా క్యాన్సర్, తలసేమియాపై దీర్ఘకాలం పాటు అవగాహన కలిగే అవకాశముంది. ఈ రోగులు ఎదుర్కొంటున్న సవాళ్లు కూడా తెలిసే వీలుంది. వీళ్లకు అత్యవసరమైన ఆనందం కూడా లభించింది. అద్భుత వాతావరణంలో తమ అభిమాన జట్టును ప్రోత్సహించిన వీళ్ల ముఖాల్లో సంతోషం కనిపించింది’’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిసింది. ఈ మ్యాచ్లో గుజరాత్పై దిల్లీ 6 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.
ఒలింపిక్స్కు శ్రీశంకర్ దూరం
దిల్లీ: భారత్కు నిరాశ! పారిస్ ఒలింపిక్స్లో పతకం సాధించగల అథ్లెట్గా పరిగణించిన లాంగ్జంప్ స్టార్ మురళీ శ్రీశంకర్ గాయంతో ఈ మెగా ఈవెంట్కు దూరమయ్యాడు. మోకాలి గాయంతో బాధపడుతున్న శంకర్కు శస్త్ర చికిత్స అవసరం కావడంతో 2024 సీజన్ మొత్తానికే బరిలో దిగే అవకాశం లేకుండాపోయింది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో రజతాలు గెలిచిన శంకర్.. 2023 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 8.37 మీటర్లు దూకి పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించాడు.
కాన్వే స్థానంలో గ్లీసన్
చెన్నై: గాయపడ్డ ఓపెనర్ డెవాన్ కాన్వే స్థానంలో ఇంగ్లాండ్ పేసర్ రిచర్డ్ గ్లీసన్ను చెన్నై జట్టులోకి తీసుకుంది. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్ సందర్భంగా కాన్వే బొటన వేలు విరిగింది. వేలికి శస్త్రచికిత్స కూడా జరిగింది. ఐపీఎల్కు అతడు దూరం కావడం టోర్నీ ఆరంభానికి ముందే స్పష్టమైంది. 2022లో సీఎస్కేతో చేరిన ఈ కివీస్ బ్యాటర్.. ఆ జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. ఇక గ్లీసన్కు ఐపీఎల్లో ఆడడం ఇదే తొలిసారి. రూ.50 లక్షల కనీస ధరకు అతడు చెన్నై జట్టులోకి వచ్చాడు. ఇప్పటివరకు ఇంగ్లాండ్ తరఫున 6 టీ20 మ్యాచ్లు ఆడిన గ్లీసన్.. 8.90 ఎకానమీతో 9 వికెట్లు పడగొట్టాడు.
క్వార్టర్స్లో ఆకాంక్ష
దిల్లీ: ప్రపంచ ఛాంపియన్షిప్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ఆసియా స్క్వాష్ ఈవెంట్లో ఆకాంక్ష సాలుంఖే క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. మలేసియాలో నిర్వహిస్తున్న ఈ టోర్నీ తొలి రౌండ్లో ఆకాంక్ష 11-7, 8-11, 11-3, 11-3, 7-11, 11-5తో తనుసా ఉత్రియన్ (మలేసియా)ను ఓడించింది. క్వార్టర్స్లో సెహ్విత్రా కుమార్ (మలేసియా)తో భారత అమ్మాయి తలపడనుంది. క్వాలిఫయర్స్ టోర్నీలో పురుషులు, మహిళల విభాగాల్లో విజేతలు మేలో ఈజిప్ట్లో జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్కు అర్హత సాధిస్తారు.
రెండో స్థానానికి గుకేశ్
టొరంటో: క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో టాప్ సీడ్ కరువానా (అమెరికా)తో 11వ రౌండ్ను గుకేశ్ డ్రాగా ముగించాడు. కానీ రెండో స్థానానికి పడిపోయాడు. మరో ఇద్దరు భారత ఆటగాళ్లు ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతి తమ గేముల్లో పరాజయం పాలయ్యారు. నకముర (అమెరికా) చేతిలో ప్రజ్ఞానంద, నెపోమ్నియాషి (రష్యా) చేతిలో విదిత్ ఓడారు. నెపోమ్నియాషి ఇప్పుడు ఏడు పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో ఉన్నాడు. కరువానా, నకముర, గుకేశ్ 6.5 పాయింట్లతో ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నారు. టోర్నీలో మరో మూడు రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మహిళల విభాగంలో టాప్ సీడ్ గోర్యాచ్కినా (రష్యా)పై వైశాలి (4.5) విజయం సాధించింది. సలిమోవా (బల్గేరియా)పై హంపి (5.5) నెగ్గింది. చైనా అమ్మాయి జ్యోంగి తాన్ (7.5) తిరిగి ఒంటరిగా ఆధిక్యంలోకి వెళ్లింది. 11వ రౌండ్లో ఆమె కేథరినా లాగ్నో (రష్యా)ను ఓడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
శ్రీలంకతో టీమ్ ఇండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ రెండు ఫార్మాట్లకు శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఎంపికైన విషయం తెలిసిందే. -
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు