పొట్టి కప్పుకి నేను రెడీ: దినేశ్ కార్తీక్
ఈ ఐపీఎల్ ఆరంభం ముందు వరకు టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించే వికెట్ కీపర్ బ్యాటర్ ఎవరంటే.. రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, జితేశ్ శర్మల పేర్లు వినిపించేవి.
కోల్కతా: ఈ ఐపీఎల్ ఆరంభం ముందు వరకు టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించే వికెట్ కీపర్ బ్యాటర్ ఎవరంటే.. రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, జితేశ్ శర్మల పేర్లు వినిపించేవి. కానీ ఇప్పుడు వీరితో పాటు దినేశ్ కార్తీక్ పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. పునరాగమనంలో చక్కటి ప్రదర్శనతో పంత్ రేసులో ముందుండగా, అతడితో పాటు కార్తీక్ను ప్రత్యామ్నాయ వికెట్ కీపర్గా ఎంపిక చేయాలన్న డిమాండ్ బలపడుతోంది. ఈ సీజన్లో అంతగా రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తున్నాడీ బెంగళూరు బ్యాటర్. సీజన్ ఆరంభంలో చెన్నై, పంజాబ్లపై వరుసగా 38, 28 పరుగులతో అజేయంగా నిలిచిన కార్తీక్.. ఇటీవల ముంబయిపై 23 బంతుల్లోనే 53, హైదరాబాద్పై 35 బంతుల్లోనే 83 పరుగులతో ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా సన్రైజర్పై మెరుపు ఇన్నింగ్స్ తర్వాత ప్రపంచకప్ జట్టులోకి కార్తీక్ను ఎంపిక చేయాలన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పొట్టి కప్పుకి తాను సిద్ధంగా ఉన్నట్లు 39 ఏళ్ల కార్తీక్ చెప్పాడు. ‘‘నా జీవితంలో ఈ దశలో భారత్కు ప్రాతినిధ్యం వహించడమంటే గొప్పగా అనిపిస్తుంది. అందుకు నేను పూర్తి సంసిద్ధతతో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు ఆడడం కంటే నా జీవితంలో పెద్ద విషయం ఏమీ ఉండదు. ప్రపంచకప్ కోసం జట్టును ఎంపిక చేసే ముగ్గురు.. ద్రవిడ్, రోహిత్, అగార్కర్ ఎంతో నిజాయితీ కలిగిన వ్యక్తులు. ప్రపంచకప్ కోసం అత్యుత్తమ జట్టునే ఎంపిక చేస్తారు. వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా నేను గౌరవిస్తా’’ అని కార్తీక్ అన్నాడు.
నరైన్ దిగ్గజం అవుతాడనుకున్నా: గంభీర్
కోల్కతా: వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ టీ20ల్లో దిగ్గజ ఆటగాడు అవుతాడని ముందే అనుకున్నానని భారత క్రికెట్ మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ అన్నాడు. ‘‘2011 వెస్టిండీస్ సిరీస్లో నరైన్ వేసిన ఏడెనిమిది బంతులను ఎదుర్కొన్నాక అతడు కచ్చితంగా గొప్ప బౌలర్ అవుతాడని ఊహించా. ముఖ్యంగా టీ20ల్లో దిగ్గజంగా మారతాడని అనుకున్నా. ఇన్నాళ్ల తర్వాత చూస్తే ఐపీఎల్ చరిత్రలోనే నరైన్ ఉత్తమ బౌలర్గా నిలిచాడు’’ అని గౌతి గుర్తు చేసుకున్నాడు. 2011లో భారత్పైనే వన్డేల్లో నరైన్ అరంగ్రేటం చేశాడు. ఇండోర్లో జరిగిన నాలుగో వన్డేలో తొలిసారి నరైన్ను గంభీర్ ఎదుర్కొన్నాడు. 2012 ఐపీఎల్లో కోల్కతా తరఫున నరైన్ అడుగుపెట్టాడు. మిస్టరీ స్పిన్నర్గా పేరు పొందిన అతడు ఈ ఏడాది 24 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. 2014లో 21 వికెట్లు పడగొట్టి కోల్కతా టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. నరైన్లోని బ్యాటింగ్ సత్తాను గుర్తించిన కెప్టెన్ గౌతి.. అతడిని ఓపెనర్గా ప్రోత్సహించాడు. ఆ తర్వాత నరైన్ పెద్దగా రాణించపోయినా కేకేఆర్ అతడిని కొనసాగించిందంటే అందుకు గంభీర్ అప్పట్లో ఇచ్చిన మద్దతే కారణం. కోల్కతా నుంచి లఖ్నవూకు వెళ్లిపోయిన గంభీర్.. మళ్లీ ఇప్పుడు మార్గనిర్దేశకుడి పాత్రలో పాత గూటికి చేరడంతో నరైన్కు ఇంకా బలమొచ్చింది. బంతితోనే కాదు బ్యాట్తో అదరగొడుతున్నాడు. 6 మ్యాచ్ల్లో ఓ సెంచరీతో సహా 276 పరుగులు చేసిన అతడు.. 7 వికెట్లు కూడా తీశాడు. ప్రతి మ్యాచ్లో కనీసం ఒక వికెట్ పడగొట్టాడు. మొత్తం మీద ఐపీఎల్ కెరీర్లో 168 మ్యాచ్ల్లో 170 వికెట్లు తీసిన నరైన్.. 1322 పరుగులు సాధించాడు.
అలీ రెజాతో గుకేశ్ ఢీ
టొరంటో: క్యాండిడేట్స్ టోర్నీ టైటిల్ రేసులో ఉన్న గ్రాండ్మాస్టర్ గుకేశ్ కీలక పోరుకు సిద్ధమయ్యాడు. 13వ రౌండ్లో ఫ్రాన్స్కు చెందిన ఫిరౌజా అలీరెజాతో అతడు తలపడతాడు. తెల్లపావులతో ఆడనున్న గుకేశ్.. ఈ గేమ్లో గెలిస్తే తన అవకాశాలను గొప్పగా మెరుగుపర్చుకుంటాడు. అలీరెజా అంతగా ఫామ్లో లేడు. గుకేశ్ ప్రస్తుతం 7.5 పాయింట్లతో నకముర (అమెరికా), నెపోమ్నియాషి (రష్యా)తో కలిసి అగ్రస్థానంలో ఉన్నాడు. మరో గేమ్లో నకముర, నెపోమ్నియాషి తలపడతారు. ఫాబియానో కరువానా (అమెరికా) కూడా టైటిల్ రేసులో ఉన్నాడు. ఏడు పాయింట్లతో ఉన్న అతడు 13వ రౌండ్లో ప్రజ్ఞానంద (6)తో తలపడతాడు. గుకేశ్ ఆఖరిదైన 14వ రౌండ్లో కఠిన ప్రత్యర్థి నకముర (అమెరికా)తో ఆడతాడు. నకమురను విదిత్ గుజరాతి (5) రెండు సార్లు ఓడించడం విశేషం. విదిత్ తన చివరి రెండు రౌండ్లలో నిజత్ అబసోవ్ (అజర్బైజాన్), అలీరెజాలతో ఆడతాడు
డేవిడ్, పొలార్డ్లకు జరిమానా
ముల్లాన్పుర్: పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు ముంబయి ఇండియన్స్ బ్యాటర్ టిమ్ డేవిడ్, బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ జరిమానాకు గురయ్యారు. మ్యాచ్ ఫీజులో వారికి 20 శాతం కోత పెట్టారు. ఐపీఎల్ వివరాలు వెల్లడించలేదు కానీ.. వైడ్ కోసం డీఆర్ఎస్ తీసుకోవాలని వాళ్లు బ్యాటర్లకు సైగలు చేయడమే జరిమానాకు కారణమని సమాచారం. గురువారం జరిగిన మ్యాచ్లో అర్ష్దీప్ వేసిన 15వ ఓవర్ చివరి బంతిని సూర్యకుమార్ కనెక్ట్ చేయలేకపోయాడు. మొదట సూర్య వైడ్ కోసం సమీక్ష కోరలేదు. ఆలస్యంగా అడిగాడు. డేవిడ్, పొలార్డ్లు.. వైడ్ కోసం సమీక్ష కోరాల్సిందిగా సైగలు చేసినట్లు స్పష్టంగా కనిపించింది.
ప్రపంచకప్ జట్టు ప్రకటన ఆ రోజే!
దిల్లీ: టీ20 ప్రపంచకప్ ఇంకో 40 రోజుల్లోనే మొదలు కాబోతోంది. ఆ మెగా టోర్నీకి జట్టును ప్రకటించడానికి ఇంకో పది రోజుల గడువే ఉంది. పొట్టి కప్పు కోసం భారత జట్టును ఈ నెల చివరి వారంలో ప్రకటిస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా జట్టు ప్రకటనకు తేదీ ఖరారైనట్లు సమాచారం. ఈ నెల 27న దిల్లీలో సెలక్షన్ కమిటీ సమావేశం జరగనుందట. ఆ రోజు ముంబయి ఇండియన్స్.. దిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ జరిగే దిల్లీలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సమావేశం కానుండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా అందులో పాల్గొనబోతున్నారట.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం. -
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
శ్రీలంకతో టీమ్ ఇండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ రెండు ఫార్మాట్లకు శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఎంపికైన విషయం తెలిసిందే. -
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐడెంటిటీ మార్చుకోవాల్సి వస్తే: విజయ్ ఆంటోనీ సమాధానమేంటంటే?
-
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
-
డేటింగ్ యాప్లతో విశాఖలో విజృంభిస్తున్న సైబర్ నేరగాళ్లు
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్