బాలికల శక్తి ఒకరి నుంచి ఒకరికి పాకుతోంది: సచిన్
అమ్మాయిలను ఆటల్లో ప్రోత్సహించాలని తల్లిదండ్రులను క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ కోరాడు.
రాంచి: అమ్మాయిలను ఆటల్లో ప్రోత్సహించాలని తల్లిదండ్రులను క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ కోరాడు. అమ్మానాన్న ముఖాలపై ఈ అమ్మాయిలు చిరునవ్వులు తీసుకొస్తారని అతను తెలిపాడు. ఫుట్బాల్లో అమ్మాయిలకు చేయూతగా నిలిచేందుకు యువ సంస్థతో కలిసి సచిన్ తెందుల్కర్ ఫౌండేషన్ పనిచేస్తోంది. ఈ అమ్మాయిలను ప్రోత్సహించేందుకు భార్య అంజలితో కలిసి సచిన్ శనివారం రాంచీకి వచ్చాడు. యువ ఫాండేషన్కు చెందిన ఫుట్బాల్ అమ్మాయిలతో ఈ దంపతులు ముచ్చటించారు.
‘‘ఈ బాలికల శక్తి ఒకరి నుంచి ఒకరికి పాకుతోంది. వీళ్లు ఎంతో కష్టపడటంతో పాటు ఆస్వాదించడం చూశా. నా బాల్యాన్ని గుర్తుచేసుకున్నా. ఎంతో మంది చిన్నారుల నుంచి స్ఫూర్తి పొందా. ఎందుకంటే వాళ్ల ప్రయాణం అంత సులువుగా ఉండదు. ఫుట్బాల్ ఆడతానంటే వద్దనే తల్లిదండ్రులుంటారు. అలాంటివాళ్లకు చెప్తున్నా.. అమ్మాయిలను ప్రోత్సహించాలి. మీ ముఖాలపై వీళ్లు చిరునవ్వులు తీసుకొస్తారు. ఈ అమ్మాయిల నైపుణ్యాలను యువ ఫౌండేషన్ సానబెడుతోంది. వాళ్ల జీవితాలను మారుస్తోంది. వీళ్లు కచ్చితంగా మెరుస్తారు. ఈ చిన్నారుల కారణంగానే ఇక్కడికి వచ్చా. వీళ్ల వల్ల నవ్వే అవకాశం వచ్చిందంటే అంతకుమించి ఇంకేం ఉండదు’’ అని సచిన్ తెలిపాడు. విద్య, క్రీడలు, ఆరోగ్యం రంగాల్లో సచిన్ తెందుల్కర్ ఫౌండేషన్ ద్వారా తమ వంతు కృషి చేస్తున్నామని సచిన్ వెల్లడించాడు. ‘‘మా నాన్న ప్రొఫెసర్ కాబట్టి విద్య, నా భార్య వైద్యురాలు కావడంతో ఆరోగ్యం, నేను క్రీడాకారుణ్ని కాబట్టి క్రీడలు ఎంచుకున్నాం. ఈ మూడు రంగాలు కలిస్తే దేశం భవిష్యత్ను మార్చొచ్చు’’ అని సచిన్ పేర్కొన్నాడు. ఓటింగ్ అవగాహన జాతీయ ఐకాన్గా ఉన్న సచిన్.. ఈ లోక్సభ ఎన్నికల్లో అందరూ ఓటుహక్కుని వినియోగించుకోవాలని పిలుపునిచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం