బెల్జియంతో అబ్బాయిలు.. అర్జెంటీనాతో అమ్మాయిలు
ప్రొ హాకీ లీగ్ ఐరోపా అంచెలో తలపడటానికి భారత హాకీ జట్లు సిద్ధమయ్యాయి. బుధవారం ఆతిథ్య బెల్జియంతో పురుషుల జట్టు.. అర్జెంటీనాతో మహిళల బృందం ఆడతాయి. ఈ లీగ్లో ప్రస్తుతం భారత్ (8 మ్యాచ్ల్లో 15 పాయింట్లు) మూడో స్థానంలో ఉంది.
ప్రొ హాకీ లీగ్
ఆంట్వెర్ప్ (బెల్జియం): ప్రొ హాకీ లీగ్ ఐరోపా అంచెలో తలపడటానికి భారత హాకీ జట్లు సిద్ధమయ్యాయి. బుధవారం ఆతిథ్య బెల్జియంతో పురుషుల జట్టు.. అర్జెంటీనాతో మహిళల బృందం ఆడతాయి. ఈ లీగ్లో ప్రస్తుతం భారత్ (8 మ్యాచ్ల్లో 15 పాయింట్లు) మూడో స్థానంలో ఉంది. నెదర్లాండ్స్ (12 మ్యాచ్ల్లో 20) అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు అర్జెంటీనాతో తలపడుతున్న మహిళల జట్టుకు కూడా శుభారంభం చేయడం కీలకం. పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించలేకపోయిన భారత్.. కొత్త కెప్టెన్ సలీమా సారథ్యంలో బరిలో దిగుతోంది. భారత్ 8 మ్యాచ్ల్లో 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా.. నెదర్లాండ్ (12 మ్యాచ్ల్లో 36) అగ్రస్థానంలో కొనసాగుతోంది.
అర్జున్ గేమ్ డ్రా
షార్జా: షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరిగేశికి వరుసగా రెండో డ్రా ఎదురైంది. ఏడో రౌండ్లో ఫర్హమ్ (ఇరాన్)తో.. ఎనిమిదో రౌండ్లో సరానా (సెర్బియా)తో అతడు డ్రా చేసుకున్నాడు. అగ్రస్థానంలో ఉన్న అరవింద్ వరుసగా రెండు ఓటములతో టైటిల్ రేసులో వెనుకబడిపోయాడు. ఏడో రౌండ్లో జహంగీర్ (ఉజ్బెకిస్థాన్)తో డ్రా చేసుకున్న రాజా రిత్విక్.. ఎనిమిదో రౌండ్లో సహచర ఆటగాడు ఆదిత్యపై నెగ్గాడు. అర్జున్ (5.5 పాయింట్లు) ఉమ్మడిగా రెండో స్థానంలో ఉండగా.. అరవింద్ (5) మూడు, రిత్విక్ (3.5) ఆరో స్థానంలో నిలిచారు.
ఫ్లెమింగ్ని ఒప్పించడానికి..
ముంబయి: భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్ కోసం బీసీసీఐ అన్వేషణ ఇప్పటికే మొదలైంది. టీ20 ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానంలో మరొకరిని నియమించడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. అయితే కొందరితో బీసీసీఐ నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇందులో స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్కు చాలా ఏళ్ల నుంచి కోచ్గా పని చేస్తున్న ఫ్లెమింగ్ను ప్రధాన కోచ్ పదవి చేపట్టేలా ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అవసరమైతే చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని రంగంలోకి దింపి ఫ్లెమింగ్ను ఒప్పించాలని బోర్డు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 3 ఏళ్ల పాటు కోచ్ పదవిలో ఉండటానికి ఈ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ సుముఖంగా లేడట. అతడు ఐపీఎల్తో పాటు టెక్సాస్ సూపర్కింగ్స్, మేజర్ లీగ్ క్రికెట్, ద హండ్రెడ్ లీగ్స్లో కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఒకవేళ బీసీసీఐ ప్రతిపాదనను ఫ్లెమింగ్ అంగీకరిస్తే ఈ ఫ్రాంఛైజీలకు దూరం కావాల్సి ఉంటుంది. ‘‘భారత కోచ్ పదవిని చేపట్టను అని ఫ్లెమింగ్ చెప్పలేదు. తన టీ20 కాంట్రాక్ట్ల విషయాన్ని తెలిపాడు. ఆరంభంలో రాహుల్ ద్రవిడ్ కూడా ఇలాగే అన్నాడు. ఫ్లెమింగ్ను ఒప్పించాలంటే ధోనిని మించినవాళ్లు ఇంకెవరుంటారు?’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
బెర్తు సాధించిన వాళ్లే ఒలింపిక్స్కు
భారత రెజ్లింగ్ సమాఖ్య నిర్ణయం
దిల్లీ: పారిస్ ఒలింపిక్ కోటా బెర్తులు సంపాదించిన ఆరుగురు క్రీడాకారులకు సెలెక్షన్ ట్రయల్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) నిర్ణయించింది. ఒలింపిక్స్కు వారినే పంపనుంది. అయితే రెజ్లర్ల ఫామ్, ఫిట్నెస్ రానున్న ర్యాంకింగ్ టోర్నీతో పాటు హాంగేరీలో జరిగే శిక్షణ శిబిరంలో అంచనా వేస్తామని స్పష్టంచేసింది. ఒకవేళ రెజ్లర్లు ఫిట్నెస్లో విఫలమైతే జులై 8లోపు సెలక్షన్స్ నిర్వహించి కోటాను భర్తీ చేస్తామని పేర్కొంది. ఒలింపిక్స్కు ముందు ట్రయల్స్ నిర్వహిస్తే గాయాలయ్యే ప్రమాదముందని క్రీడాకారులు ఆందోళన వ్యక్తంజేయడంతో డబ్ల్యూఎఫ్ఐ ఈ నిర్ణయం తీసుకుంది. అమన్ శెరావత్ (57 కేజీలు).. వినేశ్ ఫొగాట్ (50 కేజీలు), అంతిమ్ ఫంగాల్ (53 కేజీలు), అన్షు మలిక్ (57 కేజీలు), నిషా దహియా (68 కేజీలు), రీతిక హుడా (76 కేజీలు)లకు భారత్ తరఫున ఒలింపిక్ కోటా బెర్తులు దక్కాయి.
భారత రిలే జట్లకు రజతాలు
బ్యాంకాక్: ఆసియా అథ్లెటిక్స్ రిలే ఛాంపియన్షిప్లో 4×400 మీటర్ల రేసులో భారత జట్లు రజత పతకాలు సాధించాయి. పూవమ్మ, ప్రాచి చౌదరి, రూపల్ చౌదరి, విత్య రామ్రాజ్లతో కూడిన భారత జట్టు ఫైనల్లో 3 నిమిషాల 33.55 సెకన్లలో రేసు పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. వియత్నాం (3 నిమిషాల 30.81 సె) పసిడి.. జపాన్ (3 నిమిషాల 35.45 సె) కాంస్యం అందుకున్నాయి. పురుషుల 4×400 మీటర్ల రిలేలో మహ్మద్ అనాస్, సంతోష్ కుమార్, మిజో, రాజీవ్ అరోకియాలతో కూడిన బృందం 3 నిమిషాల 5.76 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. శ్రీలంక (3 నిమిషాల 4.48 సె), వియత్నాం (3 నిమిషాల 7.37 సె) వరుసగా స్వర్ణ, కాంస్యాలు గెలిచాయి. 4×400 మీ. రిలేలో ఇప్పటికే భారత జట్లు పారిస్ కోటా స్థానం సాధించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం. -
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
శ్రీలంకతో టీమ్ ఇండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ రెండు ఫార్మాట్లకు శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఎంపికైన విషయం తెలిసిందే. -
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!