ఇవేం పిచ్లు?
క్రికెట్ను విస్తరించాలనే ఉద్దేశంతో.. కొత్త అభిమానులను సంపాదించుకోవాలనే లక్ష్యంతో తొలిసారి అమెరికాలో టీ20 ప్రపంచకప్ మ్యాచ్లను ఐసీసీ నిర్వహిస్తోంది.
న్యూయార్క్
క్రికెట్ను విస్తరించాలనే ఉద్దేశంతో.. కొత్త అభిమానులను సంపాదించుకోవాలనే లక్ష్యంతో తొలిసారి అమెరికాలో టీ20 ప్రపంచకప్ మ్యాచ్లను ఐసీసీ నిర్వహిస్తోంది. అయితే అమెరికా అభిమానుల మాటేమో కానీ న్యూయార్క్లో జరుగుతున్న మ్యాచ్లు ఇతర క్రికెట్ ప్రధాన దేశాల్లోని జనాలకూ నిరాశ కలిగిస్తున్నాయి. భారత్లోని అభిమానులకూ తీవ్ర అసంతృప్తిని మిగిలిస్తున్నాయి. అందుకు కారణం ఈ పొట్టి కప్ మ్యాచ్ల కోసం కొత్తగా నిర్మించిన నాసా కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోని పిచ్లే. ఈ డ్రాప్ ఇన్ పిచ్లపై అస్థిర బౌన్స్, అనూహ్యమైన స్వింగ్ లభిస్తోంది. పగుళ్ల కారణంగా బంతి ఎక్కడ పడి ఎటు వెళ్తుందో, ఎంత ఎత్తులో వస్తుందో ఊహించలేని పరిస్థితి నెలకొంది. ఈ మందకొడి పిచ్లు బౌలర్లకు అనుకూలంగా, బ్యాటర్లకు కఠినంగా మారాయి. బ్యాటర్లు ధనాధన్ ఇన్నింగ్స్లు ఆడితేనే టీ20 మజా దక్కేది. ఇప్పుడు న్యూయార్క్లో జరుగుతున్న మ్యాచ్ల్లో ఆ మెరుపులే లేవు.
బ్యాటర్లకు గాయాలు: అస్థిర బౌన్స్, స్వింగ్ కారణంగా ఈ పిచ్లు బ్యాటర్లకు ప్రమాదకరంగా మారాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఐర్లాండ్తో మ్యాచ్లో అనూహ్యంగా దూసుకొచ్చిన బంతుల వల్ల రోహిత్ శర్మ, పంత్కు గాయాలయ్యాయి. పేసర్ జోష్ లిటిల్ బౌలింగ్లో అస్థిర బౌన్స్ కారణంగా రోహిత్ భుజానికి దిగువన గాయమైంది. దీంతో అతను రిటైర్డ్హర్ట్గా వెనుదిరగాల్సి వచ్చింది. గాయం తీవ్రత మరీ ఎక్కువేమీ కాదు కాబట్టి జట్టుకు ఉపశమనం దక్కింది. మరోవైపు పంత్ మోచేతికీ బంతి బలంగా తాకింది. అంతకంటే ముందు ఐర్లాండ్ బ్యాటర్ టెక్టార్ హెల్మెట్కు బూమ్రా బౌన్సర్ తగిలింది. అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు ఈ ప్రమాదకరమైన పిచ్ సరైందే కాదని జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్ అభిప్రాయపడ్డాడు. బంతిపై నియంత్రణ కష్టంగా మారిందని, ఎక్కువగా స్వింగ్ అయిందని పేసర్ అర్ష్దీప్ అన్నాడు.
ఆలస్యమే కారణమా?: వంద రోజుల్లోనే నిర్మించిన ఈ స్టేడియంలో ఆలస్యంగా పిచ్లను అమర్చడమే ఈ పరిస్థితికి కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. డిసెంబర్లో ఆస్ట్రేలియా నుంచి ఈ డ్రాప్ ఇన్ పిచ్లను తీసుకొచ్చారు. అప్పుడు న్యూయార్క్లో వర్షం, మంచు వల్ల చల్లటి వాతావరణం కారణంగా ఫ్లోరిడాలో ఉంచి సిద్ధం చేశారు. ఫిబ్రవరిలో వీటిలో నాలుగు పిచ్లను మైదానంలో అమర్చారు. ఓ కొత్త పిచ్పై జూనియర్ స్థాయిలో ఓ 10 మ్యాచ్లు, ఆ తర్వాత సీనియర్ దేశవాళీ మ్యాచ్లు, అనంతరం అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ బంగ్లాదేశ్తో భారత్ వార్మప్ మ్యాచ్కు ముందు మాత్రమే ఐసీసీకి అప్పగించిన ఈ మైదానంలోని ఒకటవ పిచ్పై శ్రీలంక, దక్షిణాఫ్రికా మ్యాచే మొదటిది. ఈ మ్యాచ్లో శ్రీలంక 77 పరుగులకే ఆలౌటైంది. ఛేదనలోనూ దక్షిణాఫ్రికా కష్టపడింది. నాలుగో పిచ్పై ఓ వార్మప్తో పాటు భారత్, ఐర్లాండ్ మ్యాచ్ జరిగింది. ఐర్లాండ్ 96కే కుప్పకూలింది. ఇంకా 2వ, 3వ పిచ్లు కొత్తవే. ఇలాంటి పిచ్పైనే క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగబోతోంది. ఈ పరిస్థితుల్లో రెండు జట్లలోని పేసర్లు చెలరేగితే మరోసారి స్వల్ప స్కోర్ల పోరు తప్పదు. పాక్తో పోరులో ఈ పిచ్ నుంచి ఏం ఆశించాలో అర్థం కావడం లేదని రోహిత్ అన్నాడు. ‘‘ఇది పేలవమైన పిచ్. డ్రాప్ ఇన్ పిచ్లు మూడు నెలల ముందుగానే మైదానంలో అమర్చాల్సింది. సాంద్రత ఏర్పడాలంటే దీనిపై ఆడాలి. విభిన్నమైన రోలర్లను వాడాలి. టీ20 క్రికెట్కు నప్పని పిచ్ ఇది’’ అని బీసీసీఐ మాజీ ప్రధాన క్యూరేటర్ దల్జీత్ సింగ్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!