క్రీడా పెన్నిధి
అక్షరమే ఆయుధంగా.. ప్రజా సంక్షేమమే పరమావధిగా.. ప్రజల గొంతుకై ‘ఈనాడు’ రూపంలో నినదించిన రామోజీ రావు క్రీడా పెన్నిధిగానూ నిలిచారు. ఎంతో మంది అథ్లెట్ల సత్తాను పత్రిక ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో కొత్త ఒరవడిని సృష్టించారు.
అక్షరమే ఆయుధంగా.. ప్రజా సంక్షేమమే పరమావధిగా.. ప్రజల గొంతుకై ‘ఈనాడు’ రూపంలో నినదించిన రామోజీ రావు క్రీడా పెన్నిధిగానూ నిలిచారు. ఎంతో మంది అథ్లెట్ల సత్తాను పత్రిక ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో కొత్త ఒరవడిని సృష్టించారు. ‘లక్ష్య’ కార్యక్రమం ద్వారా అథ్లెటిక్స్, ఫుట్బాల్లో తెలుగు రాష్ట్రాల్లోని 1200 మందికి శిక్షణ అందుతుందంటే అది ఆయన చొరవే. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో రాణించగలిగే క్రీడాకారులకు ఆర్థికంగా అండగా నిలిచి అద్భుత ఫలితాలు సాధించేలా దారిచూపారు.
ఈనాడు - హైదరాబాద్
ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చి.. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన రామోజీ రావు క్రీడా ప్రేమికుడు కూడా. క్రీడలకు ప్రత్యేక పేజీ ఉండాలనే లక్ష్యంతో ‘ఛాంపియన్’ను తీసుకొచ్చారు. తెలుగు పత్రికా రంగంలో ఇలాంటి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది ఆయనే. ఈ పేజీ ద్వారా ఎంతోమంది అథ్లెట్ల విజయ గాథలను వెలుగులోకి తెచ్చి, మరెంతో మంది ఆటల వైపు నడిచేలా స్ఫూర్తి నింపారు. క్రీడాకారుల కష్టాలను ప్రపంచానికి తెలియజేసి అండ దొరికేలా చూశారు. చాలా మంది ప్లేయర్ల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేశారు. 2002లో ఫిడే నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్కు ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ ఆతిథ్యం ఇవ్వడం ఆయనకు ఆటలపై ఉన్న మక్కువను చాటుతోంది. ఆ టోర్నీలో వాసిలీ ఇవాంచుక్ (ఉక్రెయిన్), అలెగ్జాండర్ మొరోజెవిచ్ (రష్యా), రుస్తమ్ ఖాసీమ్జనోవ్ (ఉజ్బెకిస్థాన్) లాంటి స్టార్లతో తలపడి దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ విజేతగా నిలిచాడు.
ఆ లక్ష్యంతో: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభావంతులను వెలికి తీయాలనే లక్ష్యంతో.. మట్టిలోని మాణిక్యాలను సానబెట్టాలనే ఉద్దేశంతో 2019లో ‘ఈనాడు’ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ‘లక్ష్య’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 20 కేంద్రాలతో మొదలైన ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రధాన, ఉప కేంద్రాలు కలిపి 50కి చేరుకుంది. అథ్లెటిక్స్, ఫుట్బాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు ‘లక్ష్య’ కార్యక్రమంలో భాగంగా శిక్షణ అందిస్తున్నారు. ఇందు కోసం 50 మంది కోచ్లను నియమించారు. దీని ద్వారా ప్రతిభావంతులైన వర్థమాన అథ్లెట్లకు అన్ని రకాలుగా అండగా నిలవాలన్నదే రామోజీ ఆకాంక్ష. క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు కోచింగ్, వసతి తదితర సౌకర్యాలూ కల్పిస్తున్నారు. మారుమూల గ్రామాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను సానబెట్టి ప్రపంచ స్థాయి అథ్లెట్లుగా తీర్చిదిద్దుతున్నారు. మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల వారీగా అథ్లెట్లకు ప్రత్యేకంగా శిక్షణ సౌకర్యాలు కల్పిస్తున్నారు. 46 మంది ఉత్తమ అథ్లెట్లకు ప్రతి నెల స్కాలర్షిప్ ఇస్తున్నారు. పుల్లెల గోపీచంద్ అకాడమీతో ఒప్పందం కుదుర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో మెరిసే అథ్లెట్లకు శిక్షణతో పాటు వసతి కూడా కల్పిస్తున్నారు. పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన దండి జ్యోతికశ్రీ, ప్రపంచ పారా ఛాంపియన్గా నిలిచి చరిత్ర సృష్టించడంతో పాటు పారిస్ పారాలింపిక్స్ బెర్తు దక్కించుకున్న జీవాంజి దీప్తి ‘లక్ష్య’ అథ్లెట్లే. నిరుడు ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన అగసర నందిని, నిలకడగా రాణిస్తున్న మల్లాల అనూష, షణ్ముగ శ్రీనివాస్, రజిత కుంజ, ఇంజమూరి శ్యామ్ కూడా ‘లక్ష్య’ గొడుగు కింద ఉన్నవాళ్లే. అంతే కాకుండా చినజీయర్ అంధుల పాఠశాల, హీల్ ఫౌండేషన్ (విజయవాడ)తోనూ కలిసి అక్కడివాళ్లకు శిక్షణ ఇస్తున్నారు. వీల్చెయిర్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పడాల రూపకు అండగా నిలిచారు. మరోవైపు టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా, చెస్ అగ్రశ్రేణి ఆటగాడు పెంటేల హరికృష్ణ ఎదుగుతున్న దశలోనూ రామోజీ సాయం చేశారు.
రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న కోచ్లు గోపీచంద్, రమేశ్, అథ్లెట్లు దీప్తి, నందిని
‘‘దేశ ప్రజలకు ముఖ్యంగా తెలుగు జనాలకు రామోజీ మరణం తీరని లోటు. ఆయన లాంటి స్ఫూర్తి ప్రదాతలు మరొకరు ఉండరు. సమాజ సేవలో ఎవరూ ఆయనకు సరిరారు. వ్యక్తిగతంగా అకాడమీ ద్వారా ఎలాంటి హడావుడి లేకుండా రామోజీ రావు ఎంతోమంది అథ్లెట్లకు అండగా నిలిచారు. క్రీడల్లో అలాంటి దూరదృష్టి కలిగిన వ్యక్తిని చూడలేదు’’
బ్యాడ్మింటన్ జాతీయ ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్
‘‘రామోజీ రావు మరణ వార్త విని తీవ్రమైన బాధకు గురయ్యా. నా జీవితాన్ని ఆయన ఎంతలా ప్రభావితం చేశారో చెప్పాలనుకుంటున్నా. ఆయన అద్భుతమైన కృషి, నాయకత్వం చూస్తూ పెరిగా. ఆయన నా ఆరాధ్య వ్యక్తుల్లో ఒకరిగా మారారు. ఆయన నిబద్ధత, ముందు చూపు, సేవ నాపై గొప్ప ప్రభావాన్ని చూపాయి. ఆయన కలిగించిన ప్రేరణ పట్ల ఎప్పుడూ కృతజ్ఞుడినై ఉంటా’’
మాజీ క్రికెటర్, బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి