ఐఎస్‌ఎల్‌ మ్యాచ్‌ వాయిదా

జంషెడ్‌పూర్‌ ఎఫ్‌సీ, ముంబయి సిటీ మధ్య శుక్రవారం జరగాల్సిన ఐఎస్‌ఎల్‌ మ్యాచ్‌ వాయిదా పడింది. రెండు జట్లలో అనేకమంది ఆటగాళ్లు కరోనా బారినపడడమే అందుకు కారణం. కొవిడ్‌ కారణంగా ఇంతకుముందు కూడా కొన్ని ఐఎస్‌ఎల్‌ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి.

Published : 21 Jan 2022 01:43 IST

బంబోలిం: జంషెడ్‌పూర్‌ ఎఫ్‌సీ, ముంబయి సిటీ మధ్య శుక్రవారం జరగాల్సిన ఐఎస్‌ఎల్‌ మ్యాచ్‌ వాయిదా పడింది. రెండు జట్లలో అనేకమంది ఆటగాళ్లు కరోనా బారినపడడమే అందుకు కారణం. కొవిడ్‌ కారణంగా ఇంతకుముందు కూడా కొన్ని ఐఎస్‌ఎల్‌ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. ‘‘జంషెడ్‌పూర్‌, ముంబయి సిటీ మధ్య మ్యాచ్‌ వాయిదా పడింది. జంషెడ్‌పూర్‌.. జట్టును బరిలోకి దించే స్థితిలో లేదు. లీగ్‌ వైద్య బృందం సలహా మేరకు నిర్ణయం తీసుకున్నాం’’ అని ఐఎస్‌ఎల్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని