లక్ష్యం 275.. భారత్‌-ఎ 119/4

Eenadu icon
By Sports News Desk Published : 02 Nov 2025 01:36 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

బెంగళూరు: దక్షిణాఫ్రికా-ఎతో నాలుగు రోజుల మ్యాచ్‌లో భారత్‌-ఎ ముందు 275 పరుగుల లక్ష్యం నిలిచింది. ఛేదనలో మూడో రోజు, శనివారం ఆట చివరికి భారత్‌ 4 వికెట్లకు 119 పరుగులు చేసింది. కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ (64 బ్యాటింగ్‌) సత్తా చాటాడు. గెలవాలంటే ఇంకో 156 పరుగులు చేయాలి. 32 పరుగులకే 3 వికెట్లు పడినా.. రజత్‌ పాటీదార్‌ (28) తోడుగా పంత్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. పాటీదార్‌ ఆట చివర్లో ఔటయ్యాడు. పంత్‌కు తోడు ఆయుష్‌ బదోని (0) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా 199 పరుగులకే ఆలౌటైంది. తనుష్‌ (4/36), కాంబోజ్‌ (3/39), గుర్నూర్‌ బ్రార్‌ (2/40) ప్రత్యర్థికి కళ్లెం వేశారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 309.. భారత్‌ 234 పరుగులు చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు