Glenn Maxwell: నొప్పితోనే మ్యాక్సీ ఆట.. ‘బై రన్నర్’పై చర్చ.. ఐసీసీ రూల్స్ ఏంటంటే..?
కండరాలుపట్టేడయంతో ఓవైపు కాళ్ల నొప్పితో బాధపడినా.. మరొక స్పెషలిస్ట్ బ్యాటర్ లేకపోవడంతో మ్యాక్స్వెల్ (Maxwell) క్రీజ్ను వదిలి రాకుండా అఫ్గాన్పై కీలక ఇన్నింగ్స్తో ఆస్ట్రేలియాను గెలిపించాడు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్లో అఫ్గాన్పై వీరోచిత డబుల్ సెంచరీతో గ్లెన్ మ్యాక్స్వెల్ (201*) ఆస్ట్రేలియాను సెమీస్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. సెంచరీ చేసిన తర్వాత నుంచి కాలు కండరాలుపట్టేయడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతూ వచ్చాడు. ఇక తన వ్యక్తిగత స్కోరు 150 పరుగుల మైలురాయిని చేరుకున్న తర్వాత మ్యాక్స్వెల్ (Maxwell) ఒకానొక దశలో నొప్పితో విలవిల్లాడిపోయాడు. అప్పటి నుంచి సింగిల్స్పై కాకుండా బౌండరీలు బాదేస్తూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఫిజయోతో చికిత్స చేయించుకుని మరీ చివరి వరకూ క్రీజ్లో పాతుకుపోయి జట్టును గెలిపించాడు. ఇలాంటి సమయంలో ఆ మ్యాచ్ను చూసిన పలువురికి వచ్చే అనుమానం.. బైరన్నర్ను పెట్టుకోవచ్చు కదా అని. అయితే దీనిపై ఐసీసీ నిబంధనలు ఎలా ఉన్నాయంటే..
జోడీ ఇలా కూడా ఉంటుందా.. మ్యాక్స్ బాదేశాడు.. కమిన్స్ అడ్డేశాడు..!
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల్లో గాయపడిన బ్యాటర్.. బైరన్నర్ను సాయంగా తీసుకొనే అవకాశం లేకుండా ఐసీసీ (ICC) ఎగ్జిక్యూటివ్ కమిటీ 2011లోనే నిర్ణయం తీసుకుంది. మ్యాచ్లో ఫీల్డింగ్కు ఇబ్బందిగా మారుతుందనే విజ్ఞప్తుల మేరకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ వెల్లడించింది. ఇదే విషయంపై మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (MCC) కూడా స్పష్టత ఇచ్చింది. బ్యాటింగ్ విభాగంలోని చట్టంలో ఎలాంటి మార్పులు చేయలేదని.. అంతర్జాతీయ మ్యాచుల్లో పరిస్థితులకు అనుగుణంగానే ఈ సవరణ చేసినట్లు ఎంసీసీ వెల్లడించింది. అయితే దేశవాళీ, ఇతర క్రికెట్ గేముల్లో మాత్రం యథావిధిగా బై-రన్నర్స్ను పెట్టుకొనే వెసులుబాటును కల్పించింది. దీంతో మ్యాక్స్వెల్ నొప్పితో బాధపడినా బైరన్నర్ సాయం లేకుండానే ఆడాల్సి వచ్చింది.
గావస్కర్ అప్పుడేమన్నాడంటే?
బ్యాటర్లకు రన్నర్లను అనుమతించకపోవడంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) గతంలోనే విమర్శలు గుప్పించాడు. ఇది సరైన నిర్ణయం కాదంటూనే.. బౌలర్లకూ ఓ విషయంలో ఉన్న వెసులుబాటును అడ్డుకోవాలని సూచించాడు. ‘‘గాయపడిన బ్యాటర్లకు రన్నర్లకు అనుమతించకపోవడం సరైన నిర్ణయం కాదు. ఇలాంటి సమయంలో నేను కూడా ఓ విజ్ఞప్తి చేస్తున్నా. బౌలర్లకు బౌండరీ లైన్ వద్ద డ్రింకింగ్ వాటర్ అందుబాటులో ఉంచకూడదు. ఎందుకంటే వారు ఒక ఓవర్ వేసిన తర్వాత బౌండరీ లైన్ వద్దకు వచ్చేటప్పటికి వారి కోసం ఎనర్జీ డ్రింకులు సిద్ధంగా ఉంటున్నాయి. అలాగే నిర్ణీత డ్రింక్స్ బ్రేక్ల తర్వాత మళ్లీ మళ్లీ అలాంటివి గంట వరకు ఇవ్వకూడదు. ఫీల్డింగ్ చేస్తూ ఆటగాడు గాయపడటం లేదా కండరాలు పట్టేసి ఇబ్బంది పడితే వెంటనే సబ్స్టిట్యూట్ను అనుమతించకూడదు. అతడు మైదానంలోనే ఉండాలి లేదా వెలుపలికి వెళ్లిపోవాలి. అప్పుడు బ్యాటింగ్, ఫీల్డింగ్ వైపు సమతూకంగా నిర్ణయాలు ఉన్నట్లు అవుతుంది’’ అని గావస్కర్ వ్యాఖ్యానించాడు.
మ్యాక్స్వెల్ ఇన్నింగ్స్ నేపథ్యంలో బైరన్నర్ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. గావస్కర్ అప్పట్లో చేసిన కామెంట్లపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?