Gujarat vs Delhi: గుజరాత్‌ లక్ష్యం 164

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL 2024)లో గుజరాత్‌, దిల్లీ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.

Updated : 03 Mar 2024 21:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL 2024)లో గుజరాత్‌, దిల్లీ మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఓపెనర్‌ మెగ్‌ లానింగ్‌ హాఫ్‌ సెంచరీ సాధించింది. అలిస్ క్యాప్సే 27 పరుగులతో ఫర్వాలేదనిపించింది. ఓపెనర్‌ షెఫాలి వర్మ మూడో ఓవర్లోనే ఔటైనా లానింగ్‌ అలిస్‌ క్యాప్సే, రోడ్రిగ్స్‌తో కలిసి రాణించింది. గుజరాత్‌ బౌలర్లలో మేఘనా సింగ్‌ 4 వికెట్లు పడగొట్టింది. గార్డ్‌నర్‌ 2, తనుజా, కశ్యప్‌ చెరో వికెట్‌ సాధించారు. వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమి పాలైన గుజరాత్‌ ఈసారి గెలవాలంటే 164 పరుగులు సాధించాలి.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని