IPL 2024: గుజరాత్ టైటాన్స్కు మరో షాక్ తప్పదా! షమి ఫ్రాంఛైజీ మారతాడా?
గుజరాత్ టైటాన్స్కు మరో షాక్ తగిలే అవకాశముంది. ఆ జట్టు ప్రధాన పేసర్ మహ్మద్ షమి (Mohammed Shami) ఫ్రాంఛైజీ మారే ఛాన్స్ ఉందని వార్తలొస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్-2024 సీజన్కు ముందు గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)కు మరో షాక్ తగిలేలా ఉంది. మొదటి రెండు సీజన్లలో జట్టుకు సారథ్యం వహించిన హార్దిక్ పాండ్య ఇప్పటికే ముంబయి ఇండియన్స్కు ట్రేడ్ కాగా.. ఇప్పుడు మరో కీలక ఆటగాడు ఫ్రాంఛైజీ మారే అవకాశముందని తెలుస్తోంది. గుజరాత్ జట్టులో ప్రధాన పేసర్గా ఉన్న మహ్మద్ షమి (Mohammed Shami)ని ట్రేడింగ్ కోసం ఓ ఫ్రాంఛైజీ సంప్రదించిందట. ఈ విషయాన్ని స్వయంగా గుజరాత్ టైటాన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కల్నల్ అర్విందర్ సింగ్ ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘‘ప్రతి ఫ్రాంఛైజీకి అగ్రశ్రేణి ఆటగాళ్లను ఎంచుకునే హక్కు ఉంది. ఒకవేళ ఏదైనా ఫ్రాంఛైజీ ట్రేడింగ్ కోసం నేరుగా ఆటగాడిని సంప్రదించినట్లయితే అది తప్పు. ఈ విధానం పట్ల గుజరాత్ టైటాన్స్ టీమ్ మేనేజ్మెంట్ సంతోషంగా లేదు. ఆటగాళ్ల ట్రేడింగ్కు సంబంధించిన బీసీసీఐ కొన్ని నియమాలు రూపొందించింది. ఏ ఆటగాడైనా కావాలనుకుంటే ఫ్రాంఛైజీలు బీసీసీఐని సంప్రదించాలి. ఆపై ఆ విషయాన్ని బీసీసీఐ మాకు తెలియజేస్తుంది. అనంతరం ఫ్రాంఛైజీ ఏదో ఇక నిర్ణయం తీసుకుంటుంది. ఈ ఐపీఎల్ టీమ్ నేరుగా మా కోచింగ్ స్టాఫ్ని సంప్రదించడం తప్పు. బదిలీ కావాలంటే మాతో ముందే మాట్లాడి ఉండేవారు. కానీ, మేము దాని గురించి తర్వాత తెలుసుకున్నాం’’ అని గుజరాత్ టైటాన్స్ సీవోవో కల్నల్ అర్విందర్ సింగ్ వివరించాడు. అయితే, ఆ ఫ్రాంఛైజీ ఏది అనే విషయాన్ని అతడు వెల్లడించలేదు.
మరోవైపు, ఆటగాళ్ల రిటెన్షన్ చేసుకునే గడువు ముగిసింది. కానీ, ప్లేయర్స్ని ట్రేడ్ చేసుకునేందుకు డిసెంబరు 12 వరకు అవకాశం ఇచ్చారు. షమి ఫ్రాంఛైజీ మారతాడా? గుజరాత్ జట్టులోనే కొనసాగతాడా? అనేది మరో నాలుగైదు రోజుల్లో తేలనుంది. అప్పటిలోగా మరికొంతమంది ఆటగాళ్ల ట్రేడింగ్ జరిగే ఛాన్స్ ఉంది. డిసెంబరు 19న దుబాయ్లో మినీ వేలం నిర్వహించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో.. బిల్ గేట్స్ అల్లుడి పోటీ
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో ఈక్వెస్ట్రియన్ విభాగంలో బిల్గేట్స్ అల్లుడు నాయెల్ నాజర్ పోటీ పడుతున్నాడు. -
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్లో.. బిల్ గేట్స్ అల్లుడి పోటీ
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు