Gujarat vs Hyderabad: మెరిసిన మిల్లర్, సుదర్శన్.. హైదరాబాద్పై గుజరాత్ విజయం
అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో హైదరాబాద్పై గుజరాత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
అహ్మదాబాద్: ఐపీఎల్ 17 సీజన్లో గుజరాత్ రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 163 పరుగుల లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్ (36), వృద్ధిమాన్ సాహా (25) శుభారంభాన్నిచ్చారు. సాయి సుదర్శన్ (45), డేవిడ్ మిల్లర్ (44*; 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. హైదరాబాద్ బౌలర్లలో మయాంక్ మార్కండే, కమిన్స్, షాబాజ్ అహ్మద్ తలో వికెట్ తీశారు.
మిల్లర్, సాయి సుదర్శన్ దూకుడు
లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ ప్రారంభం నుంచి పక్కా ప్రణాళికతో ఆడింది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభ్మన్ గిల్ శుభారంభాన్నిచ్చారు. క్రీజులో నిలదొక్కుకుంటున్న ఈ జోడీని షాబాజ్ అహ్మద్ విడగొట్టాడు. ఐదో ఓవర్ తొలి బంతికి భారీ షాట్కు ప్రయత్నించిన వృద్ధిమాన్... కమిన్స్ చేతికి చిక్కిపోయాడు. ఫస్ట్డౌన్లో వచ్చిన సాయి సుదర్శన్తో కలిసి కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ నిర్మించాడు. అయితే పదో ఓవర్లో కమిన్స్ మార్కండే బౌలింగ్లో అబ్దుల్ సమద్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్తో కలిసి సుదర్శన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇద్దరూ పోటా పోటీగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని కమిన్స్ విడగొట్టాడు. 16.1వ బంతికి సాయి సుదర్శన్ భారీ షాట్కు ప్రయత్నించి అభిషేక్ శర్మ చేతికి చిక్కిపోయాడు. అప్పటికి జట్టు స్కోరు 138 పరుగులు. అప్పటికే గుజరాత్ లక్ష్యానికి చేరువ కావడంతో హైదరాబాద్పై ఒత్తిడి పెరిగిపోయింది. చివర్లో వచ్చిన విజయ్ శంకర్ (14*) సాయంతో మిల్లర్ లక్ష్యాన్ని పూర్తి చేశాడు.
ఒక్క ఓవర్లోనే తారుమారు..
15 ఓవర్ల వరకు హైదరాబాద్ పోటీలోనే ఉంది. అప్పటికి గుజరాత్ స్కోరు 114/2. 30 బంతుల్లో 49 పరుగులు అవసరమైన దశలో మయాంక్ మర్కండే వేసిన 16 ఓవర్లో మిల్లర్ రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు. సాయి సుదర్శన్ కూడా ఓ సిక్స్ కొట్టాడు. ఈ ఓవర్లో మొత్తం 24 పరుగుల రావడంతో మ్యాచ్ గుజరాత్ వైపు మళ్లింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (29), అబ్దుల్ సమద్ (29) టాప్ స్కోరర్లుగా నిలిచారు. క్లాసెన్ (24; 13 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లు) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. షాబాజ్ అహ్మద్ (22), ట్రావిస్ హెడ్ (19), మయాంక్ అగర్వాల్ (16), మార్క్రమ్ (17) తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 3, ఒమర్జాయ్, ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత