Gujarat vs Hyderabad: మెరిసిన మిల్లర్, సుదర్శన్.. హైదరాబాద్పై గుజరాత్ విజయం
అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో హైదరాబాద్పై గుజరాత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
అహ్మదాబాద్: ఐపీఎల్ 17 సీజన్లో గుజరాత్ రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 163 పరుగుల లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్ (36), వృద్ధిమాన్ సాహా (25) శుభారంభాన్నిచ్చారు. సాయి సుదర్శన్ (45), డేవిడ్ మిల్లర్ (44*; 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. హైదరాబాద్ బౌలర్లలో మయాంక్ మార్కండే, కమిన్స్, షాబాజ్ అహ్మద్ తలో వికెట్ తీశారు.
మిల్లర్, సాయి సుదర్శన్ దూకుడు
లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ ప్రారంభం నుంచి పక్కా ప్రణాళికతో ఆడింది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభ్మన్ గిల్ శుభారంభాన్నిచ్చారు. క్రీజులో నిలదొక్కుకుంటున్న ఈ జోడీని షాబాజ్ అహ్మద్ విడగొట్టాడు. ఐదో ఓవర్ తొలి బంతికి భారీ షాట్కు ప్రయత్నించిన వృద్ధిమాన్... కమిన్స్ చేతికి చిక్కిపోయాడు. ఫస్ట్డౌన్లో వచ్చిన సాయి సుదర్శన్తో కలిసి కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ నిర్మించాడు. అయితే పదో ఓవర్లో కమిన్స్ మార్కండే బౌలింగ్లో అబ్దుల్ సమద్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్తో కలిసి సుదర్శన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇద్దరూ పోటా పోటీగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని కమిన్స్ విడగొట్టాడు. 16.1వ బంతికి సాయి సుదర్శన్ భారీ షాట్కు ప్రయత్నించి అభిషేక్ శర్మ చేతికి చిక్కిపోయాడు. అప్పటికి జట్టు స్కోరు 138 పరుగులు. అప్పటికే గుజరాత్ లక్ష్యానికి చేరువ కావడంతో హైదరాబాద్పై ఒత్తిడి పెరిగిపోయింది. చివర్లో వచ్చిన విజయ్ శంకర్ (14*) సాయంతో మిల్లర్ లక్ష్యాన్ని పూర్తి చేశాడు.
ఒక్క ఓవర్లోనే తారుమారు..
15 ఓవర్ల వరకు హైదరాబాద్ పోటీలోనే ఉంది. అప్పటికి గుజరాత్ స్కోరు 114/2. 30 బంతుల్లో 49 పరుగులు అవసరమైన దశలో మయాంక్ మర్కండే వేసిన 16 ఓవర్లో మిల్లర్ రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు. సాయి సుదర్శన్ కూడా ఓ సిక్స్ కొట్టాడు. ఈ ఓవర్లో మొత్తం 24 పరుగుల రావడంతో మ్యాచ్ గుజరాత్ వైపు మళ్లింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (29), అబ్దుల్ సమద్ (29) టాప్ స్కోరర్లుగా నిలిచారు. క్లాసెన్ (24; 13 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లు) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. షాబాజ్ అహ్మద్ (22), ట్రావిస్ హెడ్ (19), మయాంక్ అగర్వాల్ (16), మార్క్రమ్ (17) తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 3, ఒమర్జాయ్, ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు దూరం.. కారణమిదే
పొట్టి ప్రపంచకప్లో ఆడే ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఐపీఎల్-17 సీజన్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు అందుబాటులో ఉండరు. ఈమేరకు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనను విడుదల చేసింది. -
T20 World Cup 2024: న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ భవనంపై టీమ్ఇండియా పేర్లు
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. కెప్టెన్గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్య వ్యవహరిస్తారు. న్యూయార్క్లోని ఎంపైర్ స్టేట్ భవనంపై టీమ్ఇండియా సభ్యుల పేర్లను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను మీరూ చూడండి.
-
టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఇవే..
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇంగ్లాండ్, సౌతాఫ్రికా తమ జట్లను ప్రకటించాయి. -
టీ20 ప్రపంచకప్.. భారత జట్టు ఇదే
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. -
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
భారత క్రికెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని కెప్టెన్గా ఎదిగిన రోహిత్ శర్మ (Rohit Sharma) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా హిట్మ్యాన్కు ప్రముఖులు, ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. -
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
లఖ్నవూకు శుభవార్త. గాయం కారణంగా పలు మ్యాచ్లకు దూరమైన మయాంక్ యాదవ్ (mayank yadav) ఫిట్నెస్ సాధించాడు. -
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్ మీటింగ్ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు. -
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ విషయం జెఫ్ బెజోస్ నుంచే నేర్చుకున్నా
-
డీల్ కుదిరినా.. కుదరకపోయినా రఫాపై దండయాత్రే: నెతన్యాహు
-
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
-
ఎన్నికల ముందే కేజ్రీవాల్ అరెస్టు ఎందుకు? ఈడీకి ‘సుప్రీం’ ప్రశ్న
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు దూరం.. కారణమిదే
-
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత