IPL 2024: రోహిత్ ఛాంపియన్ లీడర్.. ముంబయి నిర్ణయం అతడికి షాకే: హర్భజన్ సింగ్
ముంబయిని ఐదు సార్లు ఛాంపియన్గా నిలిపిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యకు సారథ్య బాధ్యతలు అప్పగించడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: మరో ఆరు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 17వ సీజన్ ప్రారంభం కానుంది. ముంబయి జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన రోహిత్ శర్మ ఎలా ఆడతాడు? ఐదుసార్లు ఛాంపియన్ అయిన ఆ జట్టును కొత్త సారథి హార్దిక్ పాండ్య ఎలా నడిపిస్తాడు? అనేది ఇప్పుడు అందరిలోనూ చర్చ. ముంబయి తీసుకున్న ఈ నిర్ణయంపై తాజాగా భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. రోహిత్ను తప్పించడం అందరినీ షాక్కు గురి చేసిందని.. అయితే దీని వెనుక జట్టు భవిష్యత్తు ప్రయోజనాలు ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాడు.
‘‘ముంబయి ఇండియన్స్ భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. రోహిత్ శర్మ ఛాంపియన్ ప్లేయర్. గొప్ప లీడర్. ముంబయిని ఐదు సార్లు విజేతగా నిలిపాడు. అంతర్జాతీయ స్థాయిలోనూ భారత్కు అద్భుత విజయాలు సాధించి పెట్టాడు. ఒక్కసారిగా అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించడం దిగ్భ్రాంతికి గురి చేసి ఉంటుంది. అయితే, ముంబయి జట్టు విజయాల్లో తప్పకుండా భాగస్వామ్యం అవుతాడని ఆశిస్తున్నా. రోహిత్ ఓ ప్లేయర్గా జట్టులోకి అడుగు పెట్టి.. నాయకుడిగా ఎదిగాడు. తన సారథ్య విలువ గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే, సడెన్గా ముంబయి ఇండియన్స్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలియదు. కానీ, భవిష్యత్తులో మెరుగైన పనితీరు కోసం మార్పు చేసి ఉండొచ్చని అనుకుంటున్నా. గుజరాత్ టైటాన్స్ను తొలి సీజన్లోనే ఛాంపియన్గా నిలిపిన హార్దిక్ను ముంబయి కెప్టెన్గా ఎంపిక చేసుకుంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టుకు అదనపు బలం చేకూరుస్తాడు. నాయకత్వ లక్షణాలను అందిపుచ్చుకోవడంలో ముందున్నాడు’’ అని హర్భజన్ వ్యాఖ్యానించాడు.
ధోనీ అలా వస్తాడేమో: అంబటి రాయుడు
ధోనీ ఇంపాక్ట్ రూల్ను వినియోగించుకుని.. కెప్టెన్గా వేరొకరికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వ్యాఖ్యానించాడు. ‘‘ఇప్పుడు ఇంపాక్ట్ రూల్ అమల్లో ఉంది. దీంతో కెప్టెన్గా ఎవరో ఒకరిని ముందుంచి.. జట్టును ధోనీ నడిపే అవకాశం లేకపోలేదు. సదరు వ్యక్తి సారథిగా కుదురుకొనే వరకూ అలానే కొనసాగిస్తాడు. నేను మాత్రం వ్యక్తిగతంగా అతడిని కెప్టెన్గా చూడటానికే ఇష్టపడతా’’ అని రాయుడు తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం