Cricket News: హార్దిక్ చాలా స్ట్రాంగ్.. గడ్డు పరిస్థితిని తట్టుకోగలిగాడు: మాజీ క్రికెటర్
ఐపీఎల్ సమయంలో హార్దిక్ను చూస్తే.. అతడు మళ్లీ జాతీయ జట్టులోకి వస్తాడని ఎవరూ అనుకోలేదు. కానీ, వచ్చాడు. వార్మప్ మ్యాచ్లోనూ ప్రత్యర్థిని హడలెత్తించే ప్రదర్శన చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్లో అందరి దృష్టి హార్దిక్ పాండ్య (Hardik Pandya) మీదనే. ఐపీఎల్లో అత్యంత వివాదాస్పదమై జాతీయజట్టులోకి వచ్చాడు. కెప్టెన్సీ వివాదం, ఆల్రౌండర్గా ఆకట్టుకోలేకపోవడంతో విమర్శలు, విడాకులు తీసుకున్నాడనే రూమర్లతో వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు వైస్ కెప్టెన్గా పాండ్య వరల్డ్ కప్ కోసం అమెరికాలో అడుగుపెట్టాడు. వార్మప్ మ్యాచ్లో అదరగొట్టేశాడు. దీంతో పాండ్యపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో హార్దిక్ మానసిక స్థితిపై విండీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ బిషప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘మానసికంగా హార్దిక్ అత్యంత దృఢమైన వ్యక్తి. ఇప్పుడు జట్టులోని ఆటగాళ్లంతా అతడికి మద్దతుగా ఉంటారు. ఐపీఎల్ సమయంలో పాండ్య చాలా భరించాడు. కొన్నింట్లో అతడి పాత్ర లేకపోయినా ఎదుర్కొన్నాడు. ఐపీఎల్లో ఏం జరిగిందో అదంతా ముగిసిపోయింది. ఇప్పుడు దానినుంచి పాండ్య బయటకు వచ్చాడని అనుకుంటున్నా. తప్పకుండా భారత్ తరఫున కీలక పాత్ర పోషిస్తాడు’’ అని వెల్లడించాడు.
ఫిట్నెస్ అత్యంత కీలకం: రహానె
ఐపీఎల్ ముగిసిన కొన్ని రోజులకే భారత వెటరన్ క్రికెటర్ అజింక్య రహానె (Ajikya Rahane) తన దేశవాళీ సీజన్ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. ముంబయి క్రికెట్ అసోసియేషన్ తరఫున నిర్వహించే ఆఫ్-సీజన్ ట్రైనింగ్ క్యాంప్ ప్రారంభం సందర్భంగా రహానె మాట్లాడాడు. ‘‘ముంబయి జట్టు గౌరవాన్ని కొనసాగించేందుకు యువకులకు ఇదొక మంచి అవకాశం. గేమ్ ప్లాన్తోపాటు ఫిట్నెస్పై తీవ్ర సాధన చేయాలి. ఫిట్గా ఉంటేనే ఆటపై దృష్టిసారించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. సీజన్ ప్రారంభమయ్యాక.. జట్టు ఏం కోరుకుంటుందనేది కీలకం. అందుకు తగ్గట్టుగా మనం సిద్ధంగా ఉండాలి. నైపుణ్యపరంగా, ఫిట్నెస్లో ఈ రెండు నెలలను సద్వినియోగం చేసుకోవాలి. బౌలింగ్ మెంటార్గా ధవళ్ కులకర్ణిని నియమించడం అభినందనీయం. దేశవాళీ క్రికెట్లో అతడికి అనుభవం ఎక్కువ’’ అని రహానె తెలిపాడు.
క్రికెట్కు వీడ్కోలు పలికిన కేదార్ జాదవ్
భారత ఆల్రౌండర్ కేదార్ జాదవ్ (Kedar Jadhav) క్రికెట్కు వీడ్కోలు పలికాడు. గతంలో ఎంఎస్ ధోనీ ఎలా అయితే విభిన్నంగా రిటైర్మెంట్ను ప్రకటించాడో.. ఇప్పుడు కేదార్ కూడా అలానే సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. కిశోర్ కుమార్ పాడిన బాలీవుడ్ సాంగ్ను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా పెట్టి మరీ 39 ఏళ్ల జాదవ్ వీడ్కోలు సందేశం పెట్టడం విశేషం. ‘‘నా క్రికెట్ కెరీర్లో మద్దతుగా నిలిచిన ప్రతీఒక్కరికీ ధన్యవాదాలు. ఇవాళ మూడు గంటల నుంచి నన్ను మాజీ క్రికెటర్గా పరిగణనలోకి తీసుకోండి. అన్నిరకాల క్రికెట్కు వీడ్కోలు చెబుతున్నా’’ అని పోస్టు పెట్టాడు. కేదార్ భారత్ తరఫున 73 వన్డేలు, 9 టీ20లు ఆడాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు