IND vs PAK: అది పోరాటం కాదు.. చరిత్ర అవుతుంది: పాక్తో మ్యాచ్పై హార్దిక్
పాకిస్థాన్తో మ్యాచ్ అంటే ఎలా ఉంటుందో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య చెప్పాడు. ప్రతిఒక్కరూ ఆస్వాదిస్తారని.. క్రికెటర్గా తనకు ఇంకాస్త స్పెషల్ అని వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: మరో రెండు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ వేదికగా పాకిస్థాన్తో భారత్ (IND vs PAK) తలపడనుంది. ఐర్లాండ్ను ఓడించిన టీమ్ఇండియా సమరోత్సాహంతో ఉండగా.. యూఎస్ఏ చేతిలో అనూహ్య పరాజయం పాలైన పాక్ ఒత్తిడిలో ఉంది. అయితే, దాయాదుల పోరంటే ప్రేక్షకులకే కాదు.. ఇరు జట్ల ప్లేయర్లకూ టెన్షనే. ఇలాంటి గొప్ప మ్యాచుల్లో ఆడటం ఎప్పటికీ స్పెషలేనని భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) వ్యాఖ్యానించాడు. పాక్తో ఆడేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.
‘‘పాకిస్థాన్తో జరగబోయే మ్యాచ్ను ఎప్పుడూ ‘ఫైట్’గా భావించను. ఇలాంటి జట్టుతో ఆడేటప్పుడు ఒత్తిడి ఉండటం సహజమే. పాక్తో మాత్రం నాకు మరింత స్పెషల్గా అనిపిస్తుంది. ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. ప్రతి ఒక్కరూ ఊపిరి బిగపట్టి ఉంచుకోవాలనేది నా అభ్యర్థన. ఈ మ్యాచ్ పోరాటం కాదు.. ఇది చరిత్ర అవుతుంది. దాయాదుల పోరు భావోద్వేగంతో కూడి ఉంటుంది. ఆనందం, ఆందోళన, బాధ.. ఇలా అన్నింటినీ అనుభవిస్తారు. తప్పకుండా మనం విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. జట్టుగా ఆడి ప్రత్యర్థిపై విరుచుకుపడటమే మా ముందున్న లక్ష్యం. ప్రణాళికలు అనుకున్నట్లుగా సాగితే అంతకంటే గొప్ప రోజు మరొకటి ఉండదు’’ అని హార్దిక్ వెల్లడించాడు.
పాకిస్థాన్తో ఇప్పటివరకు హార్దిక్ పాండ్య ఆరు మ్యాచుల్లో తలపడ్డాడు. మొత్తం 84 పరుగులు రాబట్టాడు. గత పొట్టి కప్లో 40 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పేస్ ఆల్రౌండర్ హార్దిక్ ఆరు మ్యాచుల్లో 11 వికెట్లు పడగొట్టాడు. పాక్పై అతడికి మంచి ఎకానమీ ఉంది. కేవలం 7.5 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. అత్యుత్తమ గణాంకాలు 3/8.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?