Hardik Pandya: ఏ దశలోనూ క్వాలిటీ క్రికెట్ మాత్రం ఆడలేకపోయాం: హార్దిక్ పాండ్య
జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు ఉన్నా నాణ్యమైన క్రికెట్ను ఆడటంలో విఫలమైనట్లు ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పష్టం చేశాడు. లఖ్నవూ చేతిలో ఓటమి అనంతరం కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐదుసార్లు ఛాంపియన్.. కొత్త సారథి నియామకం.. కానీ, ఐపీఎల్ 17వ సీజన్లో ముంబయి జట్టును ప్లేఆఫ్స్కు ఇవేవీ చేర్చలేకపోయాయి. కనీసం గౌరవప్రదమైన స్థానంతోనైనా ముగింపు దక్కుతుందంటే పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండిపోయింది. తాజాగా లఖ్నవూతో మ్యాచ్లోనూ గెలిచి కాస్త పరువుతో టోర్నీ నుంచి నిష్క్రమిద్దామంటే అదీ సాధ్యపడలేదు. మెగా లీగ్లో తాము ఎక్కడ పొరపాట్లు చేశామనేది ఇప్పుడే చెప్పలేనని.. నాణ్యమైన క్రికెట్ను మాత్ర ఆడలేకపోయినట్లు ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య అంగీకరించాడు. బౌలర్, బ్యాటర్గా వ్యక్తిగత ప్రదర్శన చేయడంలోనూ హార్దిక్ విఫలమయ్యాడు. మొత్తం 14 మ్యాచుల్లో కేవలం నాలుగు విజయాలను మాత్రమే సాధించిన ముంబయి 8 పాయింట్లను నమోదు చేయగలిగింది.
‘‘ఇలాంటి ముగింపును మేం అస్సలు కోరుకోలేదు. జీర్ణించుకోవడం చాలా కష్టం. మేం టోర్నీ ఆసాంతం నాణ్యమైన క్రికెట్ను ఆడలేదనేది కాదనలేని వాస్తవం. ఇదే మమ్మల్ని వెనక్కి వెళ్లేలా చేసింది. ప్రొఫెషనల్ క్రికెట్లో ఇలాంటివన్నీ సహజమే. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే ప్రయత్నించాలి. కానీ, మేం జట్టుగా స్మార్ట్ క్రికెట్ ఆడలేకపోయాం. ఎక్కడ పొరపాట్లు జరిగాయో ఇప్పుడే చెప్పడం కష్టం. తప్పకుండా వాటిని సరిదిద్దుకొని వచ్చేసారి బలంగా ముందుకొస్తాం’’ అని పాండ్య వెల్లడించాడు.
రోహిత్ చెప్పిన సమాధానమదే: మార్క్ బౌచర్
ఐపీఎల్ సీజన్ను ముగించిన తర్వాత రోహిత్ శర్మ ఎదుట ముంబయి ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ ఓ ప్రశ్న ఉంచాడట. దానికి హిట్మ్యాన్ ఇచ్చిన సమాధానం అద్భుతంగా ఉందని బౌచర్ తెలిపాడు. లఖ్నవూతో మ్యాచ్ అనంతరం కోచ్ మాట్లాడుతూ.. ‘‘వ్యక్తిగతంగా నాకు రోహిత్ బాగా నచ్చుతాడు. అతడు ఏం చేయాలనుకుంటే దానినే ఆచరిస్తాడు. ఈ సీజన్లోనూ రోహిత్ అద్భుతమైన ఆటను ప్రదర్శించాడు. చెన్నైపై సెంచరీ చేసి అలరించాడు. ఆరంభంలోనే దూకుడుగా పరుగులు రాబట్టాడు. లఖ్నవూపైనా అతడి ఇన్నింగ్స్ను మనమంతా చూశాం. ఈ సీజన్లో మా జట్టు పరిస్థితిపై రివ్యూ చేసుకున్నాం. అదే సమయంలో రోహిత్తో మాట్లాడా. ఇక తర్వాత ఏంటి? అని అడిగా. మామూలుగా వేరేవాళ్లయితే కాస్త విశ్రాంతి తీసుకోవడమో.. ఇతర వ్యాపకాల గురించి చెబుతారు. కానీ, రోహిత్ మాత్రం ఠక్కున ‘వరల్డ్ కప్’ అనేశాడు. ఆటపట్ల అతడికి ఉన్న కమిట్మెంట్ అత్యున్నత స్థాయిలో ఉంటుంది. వచ్చే సీజన్లో ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహించడం కష్టం. అసలే మెగా ఆక్షన్ జరగనుంది’’’ అని బౌచర్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రికెట్లో ‘కష్టమైన బంతి’ అంటూ ఏమీ ఉండదు..: గంభీర్
భారీ మొత్తం వెచ్చించి దక్కించుకున్న క్రికెటర్ ఆరంభంలో ఇబ్బందిపడినా.. జట్టుకు అవసరమైన సమయంలో తమ సత్తా చాటితేనే ‘స్టార్’గా మారతాడు. -
ఏ విషయమైనా.. ఎవరికీ అతిగా చెప్పేందుకు ప్రయత్నించను: జస్ప్రీత్ బుమ్రా
ప్రాక్టికల్గా ఉండేందుకు ఇష్టపడే జస్ప్రీత్ బుమ్రా తన జూనియర్లకు అవసరమైన సమాచారం మాత్రమే ఇస్తాడు. అయితే, ఎలాంటి ప్రశ్న అడిగినా స్పందిస్తానని.. అతిగా మాత్రం బదులివ్వనని బుమ్రా వ్యాఖ్యానించాడు. -
గంభీర్ మంచి ఛాయిసే.. స్టార్లను డీల్ చేయగలడు: గంగూలీ
భారత ప్రధాన కోచ్గా ఎవరు వస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జులై 1 నుంచి ఈ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. -
శుభ్మన్ గిల్తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నటి
Shubman Gill: క్రికెటర్ శుభ్మన్ గిల్ను తాను పెళ్లి చేసుకోనున్నట్లు వస్తున్న వార్తలపై టీవీ నటి రిధిమా పండిత్ స్పష్టనిచ్చింది. -
మూడేళ్లు ఆడగలిగే ఫిట్నెస్ ఉన్నా.. ఐపీఎల్కు వీడ్కోలు పలికేందుకు డీకే కారణమిదే!
టీమ్ఇండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ ఐపీఎల్కు వీడ్కోలు పలికి సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, దానికి కారణమేంటనేది తాజాగా వెల్లడించాడు. -
ధోనీ స్క్వాడ్ అలా.. రోహిత్ సేన ఇలా..
రెండోసారి టీ20 ప్రపంచకప్ విజేతగా నిలవాలనే లక్ష్యంతో టీమ్ఇండియా బరిలోకి దిగింది. అయితే, తొలిసారి ఛాంపియన్గా నిలిచిన ఆ జట్టుకు.. ఇప్పుడు రోహిత్ సేనకు మధ్య ఉన్న పోలికలు ఏంటో ఓ లుక్కేద్దాం.. -
పాండ్య ‘బ్యాకప్’ పేసర్.. బౌలింగ్ కాంబినేషన్ అలా ఉంటే తిరుగుండదు: గావస్కర్
రెండోసారి ఛాంపియన్గా నిలిచేందుకు భారత బరిలోకి దిగింది. మరో నాలుగు రోజుల్లో తొలి మ్యాచ్ ఆడనుంది. జూన్ 9న పాకిస్థాన్తో కీలక పోరు జరగనుంది. -
అప్పుడు వర్కౌట్ కాలేదు.. ఈసారైనా సీనియర్లు ముందుండాలి: మంజ్రేకర్
సీనియర్లపై ఉంచిన నమ్మకాన్ని ఈసారి వమ్ము కానివ్వకుండా కప్ను అందించాలని భారత మాజీ క్రికెటర్ సూచించాడు. అలాగే పాక్తో ఇద్దరిని అడ్డుకోగలిగితే మరోసారి ఆధిపత్యం ప్రదర్శించవచ్చని పేర్కొన్నాడు. -
కిక్ అంతా ఇక్కడే..
ప్రపంచకప్ ఏదైనా ఆ రెండు జట్ల మధ్య పోరు గురించే చర్చంతా! ఆ చిరకాల ప్రత్యర్థులు తలపడితే క్రికెట్ ప్రపంచమే ఊగిపోతుంది! ఇప్పుడు టీ20 ప్రపంచకప్లోనూ అందరూ ఎదురుచూస్తోంది ఆ దాయాది దేశాల మధ్య సమరం గురించే! ఆ జట్లే.. భారత్, పాకిస్థాన్. -
భారత అభిమానుల కోసం
ఐసీసీ టోర్నీలైనా, ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచ్లైనా అత్యధిక ఆదాయం, ఆదరణ దక్కేది భారత్ నుంచే. -
సెమీస్లో గాయత్రి జోడీ
సింగపూర్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో భారత అగ్రశ్రేణి జోడీ గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ జోరు కొనసాగుతుంది. -
భారత్ బంగ్లాదేశ్.. ప్రాక్టీస్ మ్యాచ్ నేడు
ఐపీఎల్లో భారత ఆటగాళ్లు వేర్వేరు ఫ్రాంఛైజీలకు ఆడారు. ఆయా జట్ల తరపున రాణించారు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్కు ముందు ఈ ఆటగాళ్లంతా జట్టుగా కలిసేందుకు, సమష్టిగా సత్తాచాటేందుకు చివరి అవకాశం. -
ప్రిక్వార్టర్స్లో గాఫ్
ఫ్రెంచ్ ఓపెన్లో అమెరికా తార కొకోగాఫ్ దూసుకెళ్తోంది. ఆమె ఎక్కువగా కష్టపడకుండానే ప్రిక్వార్టర్స్ చేరింది. -
పతాకధారిని అంటే నమ్మలేకపోయా
పారిస్ ఒలింపిక్స్లో పతాకధారిని తానేనని తెలియగానే నమ్మలేకపోయానని భారత టేబుల్టెన్నిస్ స్టార్ ఆచంట శరత్కమల్ అన్నాడు. -
నిశాంత్కు పారిస్ కోటా
భారత యువ బాక్సర్ నిశాంత్ దేవ్ పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాన్ని దక్కించుకున్నాడు. -
రిషితకు ఐటీఎఫ్ టైటిల్
ఐటీఎఫ్ జూనియర్ టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి రిషితరెడ్డి విజేతగా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
‘మా అమ్మే నాపై దాడి చేయించింది’: రూ.11వేల కోట్ల సామ్రాజ్యంలో వారసత్వ పోరు
-
దిల్లీ రికార్డు ఉష్ణోగ్రత.. సెన్సర్ ఎర్రర్ కారణం: కేంద్రం
-
సీఎం రేవంత్రెడ్డికి భారాస అధినేత కేసీఆర్ 22 పేజీల సుదీర్ఘ లేఖ
-
అందుకే నేను ఇంటర్వ్యూలు ఇవ్వను: ఫహాద్ ఫాజిల్
-
పీవోకే విదేశీ భూభాగమే.. అంగీకరించిన పాకిస్థాన్!
-
నయనతారతో టూర్.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన విఘ్నేశ్ శివన్