Hardik Pandya: ఏ దశలోనూ క్వాలిటీ క్రికెట్ మాత్రం ఆడలేకపోయాం: హార్దిక్ పాండ్య
జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు ఉన్నా నాణ్యమైన క్రికెట్ను ఆడటంలో విఫలమైనట్లు ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పష్టం చేశాడు. లఖ్నవూ చేతిలో ఓటమి అనంతరం కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐదుసార్లు ఛాంపియన్.. కొత్త సారథి నియామకం.. కానీ, ఐపీఎల్ 17వ సీజన్లో ముంబయి జట్టును ప్లేఆఫ్స్కు ఇవేవీ చేర్చలేకపోయాయి. కనీసం గౌరవప్రదమైన స్థానంతోనైనా ముగింపు దక్కుతుందంటే పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండిపోయింది. తాజాగా లఖ్నవూతో మ్యాచ్లోనూ గెలిచి కాస్త పరువుతో టోర్నీ నుంచి నిష్క్రమిద్దామంటే అదీ సాధ్యపడలేదు. మెగా లీగ్లో తాము ఎక్కడ పొరపాట్లు చేశామనేది ఇప్పుడే చెప్పలేనని.. నాణ్యమైన క్రికెట్ను మాత్ర ఆడలేకపోయినట్లు ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య అంగీకరించాడు. బౌలర్, బ్యాటర్గా వ్యక్తిగత ప్రదర్శన చేయడంలోనూ హార్దిక్ విఫలమయ్యాడు. మొత్తం 14 మ్యాచుల్లో కేవలం నాలుగు విజయాలను మాత్రమే సాధించిన ముంబయి 8 పాయింట్లను నమోదు చేయగలిగింది.
‘‘ఇలాంటి ముగింపును మేం అస్సలు కోరుకోలేదు. జీర్ణించుకోవడం చాలా కష్టం. మేం టోర్నీ ఆసాంతం నాణ్యమైన క్రికెట్ను ఆడలేదనేది కాదనలేని వాస్తవం. ఇదే మమ్మల్ని వెనక్కి వెళ్లేలా చేసింది. ప్రొఫెషనల్ క్రికెట్లో ఇలాంటివన్నీ సహజమే. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే ప్రయత్నించాలి. కానీ, మేం జట్టుగా స్మార్ట్ క్రికెట్ ఆడలేకపోయాం. ఎక్కడ పొరపాట్లు జరిగాయో ఇప్పుడే చెప్పడం కష్టం. తప్పకుండా వాటిని సరిదిద్దుకొని వచ్చేసారి బలంగా ముందుకొస్తాం’’ అని పాండ్య వెల్లడించాడు.
రోహిత్ చెప్పిన సమాధానమదే: మార్క్ బౌచర్
ఐపీఎల్ సీజన్ను ముగించిన తర్వాత రోహిత్ శర్మ ఎదుట ముంబయి ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ ఓ ప్రశ్న ఉంచాడట. దానికి హిట్మ్యాన్ ఇచ్చిన సమాధానం అద్భుతంగా ఉందని బౌచర్ తెలిపాడు. లఖ్నవూతో మ్యాచ్ అనంతరం కోచ్ మాట్లాడుతూ.. ‘‘వ్యక్తిగతంగా నాకు రోహిత్ బాగా నచ్చుతాడు. అతడు ఏం చేయాలనుకుంటే దానినే ఆచరిస్తాడు. ఈ సీజన్లోనూ రోహిత్ అద్భుతమైన ఆటను ప్రదర్శించాడు. చెన్నైపై సెంచరీ చేసి అలరించాడు. ఆరంభంలోనే దూకుడుగా పరుగులు రాబట్టాడు. లఖ్నవూపైనా అతడి ఇన్నింగ్స్ను మనమంతా చూశాం. ఈ సీజన్లో మా జట్టు పరిస్థితిపై రివ్యూ చేసుకున్నాం. అదే సమయంలో రోహిత్తో మాట్లాడా. ఇక తర్వాత ఏంటి? అని అడిగా. మామూలుగా వేరేవాళ్లయితే కాస్త విశ్రాంతి తీసుకోవడమో.. ఇతర వ్యాపకాల గురించి చెబుతారు. కానీ, రోహిత్ మాత్రం ఠక్కున ‘వరల్డ్ కప్’ అనేశాడు. ఆటపట్ల అతడికి ఉన్న కమిట్మెంట్ అత్యున్నత స్థాయిలో ఉంటుంది. వచ్చే సీజన్లో ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహించడం కష్టం. అసలే మెగా ఆక్షన్ జరగనుంది’’’ అని బౌచర్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత