Hardik Pandya: మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ నిర్దేశించిన 278 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబయి కూడా దూకుడు ప్రదర్శించింది. చివరికి 246 స్కోరుకే పరిమితమైనప్పటికీ హైదరాబాద్ జట్టుకు వణుకు పుట్టించింది. తొలుత బౌలింగ్లో ధారాళంగా పరుగులు ఇవ్వడంపై ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) స్పందించాడు. పిచ్ బ్యాటర్లకు పూర్తి అనుకూలంగా ఉందని.. తమ బౌలర్ల విషయంలో ఆందోళనేమీ లేదని స్పష్టం చేశాడు.
‘‘టాస్ గెలిచి హైదరాబాద్కు బ్యాటింగ్ అప్పగించినప్పుడు ఇంత భారీ స్కోరు చేస్తుందని ఊహించలేదు. పిచ్ చాలా బాగుంది. 277 పరుగులు ఇక్కడ పెద్ద కష్టమేం కాదనిపించింది. హైదరాబాద్ బ్యాటర్లు బాగా ఆడారు. మా బౌలర్లు కూడా బాగానే బౌలింగ్ వేశారు. ఈ పిచ్పై 500+ పరుగులు రావడమంటే బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నట్లే. మేం కొన్ని అంశాల్లో మెరుగు పడాల్సిన అవసరం ఉంది. మా వద్ద యువ బౌలర్లు ఉన్నారు. వారు నేర్చుకొనేందుకు కాస్త సమయం అవసరం. ప్రతిసారి ఇలా బంతి స్టాండ్స్లోకి వెళ్లినప్పుడు ఓవర్ పూర్తి చేయడానికి టైమ్ పడుతుంది. మా జట్టులోని ప్రతి బ్యాటర్ మంచి ఫామ్లోనే ఉన్నాడు. మపాకా అద్భుతమైన బౌలర్. ఐపీఎల్లో తొలి మ్యాచ్ కావడంతో అతడిపై ఒత్తిడి ఉంటుంది. తప్పకుండా పుంజుకొంటాడనే నమ్మకం ఉంది’’ అని హార్దిక్ వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్లో మపాకా (0/66), పాండ్య (1/46), కోయిట్జీ (1/57) భారీగా పరుగులు సమర్పించారు.
గత రెండు మ్యాచుల్లో అదరగొట్టేశాం: ట్రావిస్ హెడ్
‘‘కోల్కతాతో జరిగిన మ్యాచ్లో విజయానికి చేరువగా వచ్చాం. ముంబయితో మా బ్యాటర్లు అదరగొట్టేశారు. అందులో నా భాగస్వామ్యం ఉండటం కూడా ఆనందంగా ఉంది. మొదట్నుంచి దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నాం. ఆఫ్సైడ్, లెగ్సైడ్లో పరుగులు రాబట్టడం బాగుంది. దాదాపు 280 పరుగులు చేశాం కాబట్టి విజయంపై నమ్మకంతోనే ఉన్నాం’’ అని హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్ తెలిపాడు. ఈ మ్యాచ్లో హెడ్ 24 బంతుల్లో 62 పరుగులు చేశాడు. అతడితోపాటు అభిషేక్ శర్మ (63), క్లాసెన్ (80*) హాఫ్ సెంచరీలు సాధించగా.. ఐదెన్ మార్క్రమ్ (42*) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్