Hardik Pandya: మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది: హ్యాట్రిక్ ఓటములపై హార్దిక్
హ్యాట్రిక్ ఓటముల వేళ ముంబయి ఇండియన్స్ ఫ్యాన్స్కు కెప్టెన్ హార్దిక్ పాండ్య ఓ సందేశం ఇచ్చాడు. మరోవైపు మ్యాచ్ అనంతరం కెప్టెన్ ఒక్కడే ఎంఐ డగౌట్లో ఒంటరిగా కూర్చుండిపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఇంటర్నెట్డెస్క్: ఐపీఎల్లో హ్యాట్రిక్ ఓటములతో కుంగిపోయిన ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) ఫ్యాన్స్లో జోష్ నింపేందుకు ఆ జట్టు సారథి హార్దిక్ పాండ్య (Hardik Pandya) ప్రయత్నిస్తున్నాడు. దీనిలో భాగంగా అతడు సామాజిక మాధ్యమం ఎక్స్లో మంగళవారం ఓ పోస్టు చేశాడు. ‘‘జట్టు గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏదైనా ఉందంటే.. ఎప్పటికీ ఓటమి అంగీకరించం.. మేం పోరాడుతూనే ఉంటాం.. ముందుకు సాగుతూనే ఉంటాం’’ అని పేర్కొన్నాడు. జట్టు మైదానంలో వ్యూహరచన చేస్తున్న చిత్రాన్ని దీనికి జత చేశాడు. దీనికి ఎంఐ ఫ్యాన్స్ కూడా సానుకూలంగానే స్పందిస్తూ.. ‘‘ధైర్యంగా ఉండు. మేం మిమ్మల్ని విశ్వసిస్తున్నాం’’ ‘‘బలం పుంజుకోండి’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మైదానంలో ఒంటరి పాండ్య..
హార్దిక్ ముంబయి పగ్గాలు చేపట్టాక జట్టును నడిపించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్లో వరుసగా మూడు మ్యాచ్లను ఆ జట్టు ఓడిపోయింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది. ముఖ్యంగా నిన్న రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో మాత్రం బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా చేతులెత్తేసింది. ముంబయి జట్టు హోం గ్రౌండ్ వాంఖడేలో సోమవారం రాత్రి మ్యాచ్ ముగిసిన తర్వాత పూర్తి నిరాశతో అతడు ఒంటరిగా ఎంఐ (MI) డగౌట్లో కూర్చుండిపోయాడు. ఆ సమయంలో ముంబయి ఆటగాళ్లు మైదానం వీడి వెళ్లిపోతుండటం గమనార్హం. ఒక్కరు కూడా పాండ్యతో లేరు.
హ్యాట్రిక్.. వాళ్లకు విజయాల్లో.. వీళ్లకు ఓటముల్లో
మరోవైపు వాంఖడేలో ప్రేక్షకులు కూడా హార్దిక్ను తీవ్ర స్థాయిలో హేళన చేశారు. ఒక దశలో రోహిత్ శర్మ కూడా అభిమానులపై అసహనం వ్యక్తంచేసి.. ఆపమని కోరాల్సి వచ్చింది. హార్దిక్ గత రెండు మ్యాచ్ల్లో ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. సొంత రాష్ట్రమైన గుజరాత్లో కూడా అతడిని ప్రేక్షకులు వెక్కిరించడం ఆపలేదు.
అతడిది విభిన్నమైన శైలి: ఆకాశ్ మధ్వాల్
పాండ్యా కెప్టెన్సీపై ముంబయి బౌలర్ ఆకాశ్ మధ్వాల్ తొలిసారి స్పందించాడు. జట్టులో ప్రస్తుతం నెలకొన్న వాతావరణంపై అతడు మాట్లాడుతూ ‘‘జట్టులో వాతావరణం చాలా బాగుంది. మీరంతా అతడు కొత్త కెప్టెన్ అని అంటున్నారు. మాకు అలా ఏమీ అనిపించడం లేదు. గతంలో రోహిత్ తనదైన శైలిలో నడిపించాడు. ఇప్పుడు పాండ్య సొంత బాటలో నడుస్తున్నాడు. వారిద్దరి నాయకత్వంలో ఆడటం సరదాగానే ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్ల్లో వారిద్దరితో మాట్లాడతాను. జట్టులో ఏదో జరుగుతోందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. రానున్న ఆటల్లో మరింత మెరుగ్గా ఆడతామని భావిస్తున్నాను’’ అని పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్