Kohli - Shreyanka Patil: కోహ్లీ వల్లే క్రికెట్ చూడటం మొదలుపెట్టా: శ్రేయాంకా పాటిల్‌

విరాట్‌ కోహ్లీ వల్లే తాను క్రికెట్‌ చూడటం మొదలెట్టానని ఆర్సీబీ మహిళ జట్టు క్రికెటర్‌ శ్రేయాంకా పాటిల్‌ (Shreyanka Patil) పేర్కొంది.  

Published : 21 Mar 2024 00:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: శ్రేయాంకా పాటిల్‌ (Shreyanka Patil).. ప్రస్తుతం నెట్టింట ఎక్కడ చూసినా ఈ అమ్మాయి గురించే చర్చ జరుగుతోంది. ఇటీవల ముగిసిన డబ్ల్యూపీఎల్‌ (WPL) ఫైనల్‌లో ఈ క్రికెటర్‌ సంచలన ప్రదర్శన చేయడమే ఇందుకు కారణం. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) ఛాంపియన్‌గా నిలవడంలో శ్రేయాంకా కీలకపాత్ర పోషించింది. 3.3 ఓవర్లు వేసి నాలుగు వికెట్లు పడగొట్టింది. కప్పు కల నెరవేర్చిన ఈ 21 ఏళ్ల అమ్మాయిని ఫ్యాన్స్‌ ‘ఆర్సీబీ క్వీన్‌’ అని పిలుస్తున్నారు. ఈ కర్ణాటక ప్లేయర్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి పెద్ద ఫ్యాన్‌. అప్పట్లో ఆర్సీబీకి కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో అతడిని కలిసింది. అనంతరం క్రికెట్‌పై మక్కువ పెంచుకుని స్టార్ ప్లేయర్‌గా ఎదగడమే కాకుండా ఆర్సీబీకి ఆడి ఆ జట్టు కప్‌ గెలవడంలో కీ రోల్‌ ప్లే చేసింది.  

ఐపీఎల్‌ 2024 సీజన్‌ కోసం మంగళవారం జరిగిన ఆర్సీబీ అన్‌బాక్స్‌ ఈవెంట్‌కు శ్రేయాంకా హాజరైంది. అక్కడ మరోసారి తన ఆరాధ్య క్రికెటర్‌ కోహ్లీని కలిసి తెగ సంబరపడిపోయింది. ‘‘అతని కారణంగా క్రికెట్ చూడటం మొదలెట్టాను. అతనిలా ఉండాలని కలలు కంటూ పెరిగాను. గత రాత్రి నా జీవితంలో మరిచిపోలేని క్షణం’’ అనే క్యాప్షన్‌ జోడించి కోహ్లీతో దిగిన ఫొటోను ఎక్స్‌(X)లో పంచుకుంది. ‘‘విరాట్‌కు నిజంగా నా పేరు తెలుసు. నాతో మాట్లాడి బాగా బౌలింగ్‌ చేశావని అభినందించాడు.#స్టిల్‌ఫ్యాన్‌గర్ల్ #రోల్‌మోడల్‌’’ అని అదే పోస్టులో శ్రేయాంకా పాటిల్ రాసుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని