WI vs IND: విండీస్తో టెస్టు సిరీస్.. 21 ఏళ్ల జైత్రయాత్రను భారత్ కొనసాగించేనా..?
దాదాపు నెల రోజుల తర్వాత భారత్ ఆటగాళ్లు మైదానంలోకి దిగబోతున్నారు. రోహిత్ - రాహుల్ ద్రవిడ్ కాంబినేషన్లో విండీస్తో టెస్టు సిరీస్ (WI vs IND) ఆడేందుకు సిద్ధమైంది. ఇవాళ తొలి టెస్టు ప్రారంభం కానుంది.
ఇంటర్నెట్ డెస్క్: దాదాపు నాలుగేళ్ల తర్వాత విండీస్ - భారత్ (WI vs IND) జట్ల మధ్య టెస్టు సిరీస్కు రంగం సిద్ధమైంది. చివరిసారిగా 2019లో విండీస్ పర్యటనకు టీమ్ఇండియా వెళ్లింది. గతేడాది భారత్కు విండీస్ వచ్చినా టెస్టు సిరీస్ ఆడలేదు. రోహిత్ శర్మ (Rohit sharma) నాయకత్వంలోని టీమ్ఇండియా (Team India) ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. అయితే, గత 21 ఏళ్ల కాలంలో ఇరు దేశాల మధ్య ఎనిమిది సిరీస్లు జరిగాయి. అన్నింటినీ టీమ్ఇండియానే గెలుచుకోవడం గమనార్హం. చివరిసారిగా భారత్పై వెస్టిండీస్ 2001/2002 సీజన్లో టెస్టు సిరీస్ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఒక్కసారి కూడా విండీస్ గెలవలేకపోయింది.
ఇప్పటి వరకు ఇరు జట్లూ 98 టెస్టుల్లో తలపడగా విజయాల్లో భారత్ (22) కంటే విండీస్ (30) ఆధిపత్యంలో ఉంది. ఇక కరేబియన్ మైదానంలో 51 మ్యాచుల్లో ఆడగా.. విండీస్ 16 విజయాలు, భారత్ 9 విజయాలను నమోదు చేసింది. మరో 26 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. సిరీస్ల గణంకాల ప్రకారం.. విండీస్-భారత్ జట్ల మధ్య 24 టెస్టు సిరీస్లు జరిగాయి. ఇందులో 12 సిరీస్లను వెస్టిండీస్ సొంతం చేసుకోగా.. భారత్ 10 సిరీస్లను గెలుచుకుంది. మరో రెండు డ్రాగా ముగిశాయి. 2000వ సంవత్సరం ముందు వరకు విండీస్ ఆధిపత్యం ప్రపంచానికి తెలిసిందే. ఆ సమయంలో ఆ జట్టుపై విజయం సాధించడమంటే మాటలు కాదు. అయినా భారత్ రెండుసార్లు సిరీస్ను సొంతం చేసుకుంది. కానీ, 2002/2003 సీజన్ నుంచి విండీస్తో ఆడిన అన్ని సిరీస్లను భారత్ గెలుచుకుంది.
గత ఐదు టెస్టు మ్యాచ్ల ఫలితాలు ఇలా..
- ట్రినిడాడ్ అండ్ టుబాగో వేదికలో జరిగిన మ్యాచ్ (2016) డ్రాగా ముగిసింది. అదీ వర్షం కారణంగా మ్యాచ్ ఫలితం డ్రాకు దారితీసింది. నాలుగు టెస్టుల సిరీస్ను భారత్ 2-0 తేడాతో గెలుచుకుంది.
- హైదరాబాద్ వేదికగా 2018లో జరిగిన మ్యాచ్లో విండీస్పై టీమ్ఇండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
- రాజ్కోట్లో (2018) జరిగిన మ్యాచ్లోనూ భారత్దే విజయం. విండీస్పై ఏకంగా ఇన్నింగ్స్ 272 పరుగుల భారీ తేడాతో గెలవడం విశేషం.
- భారత్ - విండీస్ మధ్య (2019) జమైకా వేదికగా జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా 257 పరుగుల తేడాతో విజయం సాధించింది.
- ఇదే ఏడాది (2019) అంటిగ్వా మైదానంలో జరిగిన మ్యాచ్లోనూ విండీస్పై భారత్ 318 పరుగుల భారీ తేడాతో గెలిచింది.
అత్యధిక పరుగుల వీరులు
- విండీస్ - భారత్ జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీసుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కావడం విశేషం. మొత్తం 27 మ్యాచుల్లోని 48 ఇన్నింగ్స్ల్లో 65.45 సగటుతో 2,749 పరుగులు చేశాడు.
- గావస్కర్ తర్వాత క్లైవ్లాయిడ్ 28 టెస్టుల్లో 44 ఇన్నింగ్స్ల్లో 2,344 పరుగులు చేశాడు. అతడి సగటు 58.60.
- శివ్నారాయణ్ చంద్రపాల్ కూడా భారత్పై మంచి ఇన్నింగ్స్లే ఆడాడు. మొత్తం 25 టెస్టుల్లో 44 ఇన్నింగ్స్ల్లో 63.85 సగటుతో 2,171 పరుగులు చేశాడు.
- ప్రస్తుత భారత క్రికెట్ కోచ్ రాహుల్ ద్రవిడ్ గతంలో విండీస్పైనా అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. 23 టెస్టుల్లోని 38 ఇన్నింగ్స్ల్లో 63.80 సగటుతో 1,978 పరుగులు సాధించాడు.
- డేంజరస్ బ్యాటర్ వివియన్ రిచర్డ్స్ కూడా టెస్టుల్లోనూ అదరగొట్టాడు. భారత్పై 28 టెస్టుల్లో 41 ఇన్నింగ్స్ల్లో 50.71 సగటుతో 1,927 పరుగులు చేశాడు.
అత్యధిక వికెట్ల వీరులు
- భారత దిగ్గజం కపిల్ దేవ్ 25 మ్యాచుల్లో 89 వికెట్లు పడగొట్టాడు.
- విండీస్ మాజీ పేసర్ మాల్కమ్ మార్షల్ 17 మ్యాచుల్లోనే 76 వికెట్లు తీసి భారత్ను బెంబేలెత్తించాడు.
- టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే కూడా విండీస్పై భారీగానే వికెట్లు తీశాడు. కేవలం 17 మ్యాచుల్లోనే 74 వికెట్లు పడగొట్టాడు.
- భారత బౌలర్ ఎస్ వెంకట్రాఘవన్ 23 మ్యాచుల్లో 68 వికెట్లు తీశాడు.
- విండీస్ ఆండీ రాబర్ట్స్ 14 మ్యాచుల్లో 67 వికెట్లు పడగొట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన