IPL Highest Paid Players: రేటెక్కువ.. ఆట తక్కువ... ఐపీఎల్లో ఎప్పుడూ ఇదే కథ!
భారీ ధరపెట్టి జట్టులోకి తీసుకున్న స్టార్ ప్లేయర్లు ఐపీఎల్లో నిరాశపరుస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది.
ఐపీఎల్ (IPL) వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు రాణించిన దాఖలాలు దాదాపు కనిపించవు. రేటు ఎక్కువ పలికిన ఆటగాడి మీద అందరి దృష్టీ ఉంటుంది. ఆ జట్టు అభిమానులు కూడా తన నుంచి ఎంతో ఆశిస్తారు. కానీ భారీ అంచనాల కారణంగానో లేక తన స్థాయికి మించి రేటు పలకడంతో ఒత్తిడి వల్లనో .. ఆ ఆటగాడు అందుకు తగ్గ ప్రదర్శన చేయడు!
- ఈ సీజన్లో ఏకంగా రూ.24.75 కోట్లతో రికార్డు రేటు పలికాడు మిచెల్ స్టార్క్. అతణ్ని కోల్కతా నైట్రైడర్స్ కొనుక్కుంది. ఐతే తొలి రెండు మ్యాచ్ల్లో స్టార్క్ ఒక్క వికెట్ కూడా తీయలేదు. పైగా రెండు మ్యాచ్ల్లో కలిపి వంద పరుగులు సమర్పించుకున్నాడు. గత సీజన్లలోనూ అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల పరిస్థితి ఇంతే.
- గత ఏడాది ఐపీఎల్లో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ను ఏకంగా రూ.18.5 కోట్లు పెట్టి కొనుక్కుంది పంజాబ్ కింగ్స్. అప్పటికి అది లీగ్లో రికార్డు ధర. కానీ, అతను 14 మ్యాచ్లాడి 276 పరుగులే చేశాడు. బంతితోనూ పెద్దగా సత్తా చాటలేకపోయాడు. కేవలం 10 వికెట్లకు పరిమితమయ్యాడు.
- 2023 సీజన్లో రూ.17.5 కోట్లతో రెండో అత్యధిక ధర దక్కించుకున్న ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ కూడా ముంబయి తరఫున ఓ మోస్తరు ప్రదర్శనే చేశాడు. 16 మ్యాచ్ల్లో 452 పరుగులు చేసిన అతను.. 6 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
- 2022లో అత్యధికంగా రూ.15.25 కోట్లకు ముంబయి సొంతమైన ఇషాన్ కిషన్.. ఆ సీజన్లో 14 మ్యాచ్లాడి 418 పరుగులు చేశాడు. ఒకట్రెండు మెరుపు ఇన్నింగ్స్లు ఆడినా మొత్తంగా నిరాశపరిచాడు. ఐపీఎల్ కెరీర్లో 135 స్ట్రైక్ రేట్తో పరుగులు చేసిన కిషన్ ఆ సీజన్లో 120 స్ట్రైక్ రేటే నమోదు చేశాడు.
- 2021లో అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడు దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ క్రిస్ మోరిస్. అతడి కోసం రాజస్థాన్ రాయల్స్ ఏకంగా రూ.16.25 కోట్లు పెట్టింది. అతడి స్థాయికి అది చాలా ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తమైంది. అందుకు తగ్గట్లే అతను సాధారణ ప్రదర్శన చేశాడు. ఆల్రౌండర్ పాత్రలో జట్టులోకి వచ్చిన అతను.. 11 మ్యాచ్ల్లో 15 వికెట్లతో బౌలింగ్ వరకు పర్వాలేదనిపించాడు కానీ.. బ్యాటుతో కేవలం 67 పరుగులే చేశాడు. ఆ సీజన్లో 9కి పైగా ఎకానమీ నమోదు చేయడం గమనార్హం.
- 2020లో రికార్డు రేటు దక్కించుకుంది ప్యాట్ కమిన్స్. అతడి కోసం కోల్కతా నైట్రైడర్స్ రూ.15.5 కోట్లు పెట్టింది. పొదుపుగా బౌలింగ్ చేశాడు కానీ.. ఎక్కువ వికెట్లు తీయలేదు. 14 మ్యాచ్ల్లో తీసింది 12 వికెట్లే. బ్యాటింగ్లో పెద్దగా రాణించలేదు. 146 పరుగులే చేశాడు.
- ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా.. అతడి కోసం వేలంలో ఫ్రాంఛైజీలు ఎగబడ్డాయి. ఎప్పుడు వేలంలోకి వచ్చినా భారీ ధర పలికాడు. కానీ, ఒక్కసారీ ఆ రేటుకు న్యాయం చేయలేదు. గత ఏడాది చెన్నై సూపర్కింగ్స్ అతడి కోసం ఏకంగా రూ.16.5 కోట్లు పెట్టింది. కానీ రెండే మ్యాచ్లాడి గాయంతో లీగ్కు దూరమయ్యాడు. 2017లో రూ.12.5 కోట్లకు కొన్న రాజస్థాన్ తరఫున 12 మ్యాచ్లాడి 316 పరుగులు చేసి, 12 వికెట్లు తీశాడు స్టోక్స్. తర్వాతి ఏడాది రైజింగ్ పుణె అతణ్ని రూ.14.5 కోట్లకు సొంతం చేసుకోగా.. 13 మ్యాచ్ల్లో 196 పరుగులు చేసి 8 వికెట్లే తీశాడు.
- 2014 ఐపీఎల్లోనే ఏకంగా రూ.16 కోట్లు పలికి చరిత్ర సృష్టించిన ఆటగాడు యువ్రాజ్ సింగ్. ఆ సీజన్లో దిల్లీ డేర్డెవిల్స్ అతడి కోసం అసాధారణ రేటు పెట్టింది. కానీ, అతను ఆల్రౌండర్ పాత్రకు న్యాయం చేయలేకపోయాడు. 14 మ్యాచ్ల్లో 376 పరుగులే చేసి, 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. తర్వాతి సీజన్లో ఆర్సీబీ అతణ్ని రూ.14 కోట్లకు కొనుక్కుంది. ఆ జట్టు తరఫున అతను 248 పరుగులు చేసి, ఒక్క వికెట్టే తీశాడు.
- ఈనాడు క్రీడావిభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం