IPL Highest Paid Players: రేటెక్కువ.. ఆట తక్కువ... ఐపీఎల్లో ఎప్పుడూ ఇదే కథ!
భారీ ధరపెట్టి జట్టులోకి తీసుకున్న స్టార్ ప్లేయర్లు ఐపీఎల్లో నిరాశపరుస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది.
ఐపీఎల్ (IPL) వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు రాణించిన దాఖలాలు దాదాపు కనిపించవు. రేటు ఎక్కువ పలికిన ఆటగాడి మీద అందరి దృష్టీ ఉంటుంది. ఆ జట్టు అభిమానులు కూడా తన నుంచి ఎంతో ఆశిస్తారు. కానీ భారీ అంచనాల కారణంగానో లేక తన స్థాయికి మించి రేటు పలకడంతో ఒత్తిడి వల్లనో .. ఆ ఆటగాడు అందుకు తగ్గ ప్రదర్శన చేయడు!
- ఈ సీజన్లో ఏకంగా రూ.24.75 కోట్లతో రికార్డు రేటు పలికాడు మిచెల్ స్టార్క్. అతణ్ని కోల్కతా నైట్రైడర్స్ కొనుక్కుంది. ఐతే తొలి రెండు మ్యాచ్ల్లో స్టార్క్ ఒక్క వికెట్ కూడా తీయలేదు. పైగా రెండు మ్యాచ్ల్లో కలిపి వంద పరుగులు సమర్పించుకున్నాడు. గత సీజన్లలోనూ అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల పరిస్థితి ఇంతే.
- గత ఏడాది ఐపీఎల్లో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ను ఏకంగా రూ.18.5 కోట్లు పెట్టి కొనుక్కుంది పంజాబ్ కింగ్స్. అప్పటికి అది లీగ్లో రికార్డు ధర. కానీ, అతను 14 మ్యాచ్లాడి 276 పరుగులే చేశాడు. బంతితోనూ పెద్దగా సత్తా చాటలేకపోయాడు. కేవలం 10 వికెట్లకు పరిమితమయ్యాడు.
- 2023 సీజన్లో రూ.17.5 కోట్లతో రెండో అత్యధిక ధర దక్కించుకున్న ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ కూడా ముంబయి తరఫున ఓ మోస్తరు ప్రదర్శనే చేశాడు. 16 మ్యాచ్ల్లో 452 పరుగులు చేసిన అతను.. 6 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
- 2022లో అత్యధికంగా రూ.15.25 కోట్లకు ముంబయి సొంతమైన ఇషాన్ కిషన్.. ఆ సీజన్లో 14 మ్యాచ్లాడి 418 పరుగులు చేశాడు. ఒకట్రెండు మెరుపు ఇన్నింగ్స్లు ఆడినా మొత్తంగా నిరాశపరిచాడు. ఐపీఎల్ కెరీర్లో 135 స్ట్రైక్ రేట్తో పరుగులు చేసిన కిషన్ ఆ సీజన్లో 120 స్ట్రైక్ రేటే నమోదు చేశాడు.
- 2021లో అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడు దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ క్రిస్ మోరిస్. అతడి కోసం రాజస్థాన్ రాయల్స్ ఏకంగా రూ.16.25 కోట్లు పెట్టింది. అతడి స్థాయికి అది చాలా ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తమైంది. అందుకు తగ్గట్లే అతను సాధారణ ప్రదర్శన చేశాడు. ఆల్రౌండర్ పాత్రలో జట్టులోకి వచ్చిన అతను.. 11 మ్యాచ్ల్లో 15 వికెట్లతో బౌలింగ్ వరకు పర్వాలేదనిపించాడు కానీ.. బ్యాటుతో కేవలం 67 పరుగులే చేశాడు. ఆ సీజన్లో 9కి పైగా ఎకానమీ నమోదు చేయడం గమనార్హం.
- 2020లో రికార్డు రేటు దక్కించుకుంది ప్యాట్ కమిన్స్. అతడి కోసం కోల్కతా నైట్రైడర్స్ రూ.15.5 కోట్లు పెట్టింది. పొదుపుగా బౌలింగ్ చేశాడు కానీ.. ఎక్కువ వికెట్లు తీయలేదు. 14 మ్యాచ్ల్లో తీసింది 12 వికెట్లే. బ్యాటింగ్లో పెద్దగా రాణించలేదు. 146 పరుగులే చేశాడు.
- ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా.. అతడి కోసం వేలంలో ఫ్రాంఛైజీలు ఎగబడ్డాయి. ఎప్పుడు వేలంలోకి వచ్చినా భారీ ధర పలికాడు. కానీ, ఒక్కసారీ ఆ రేటుకు న్యాయం చేయలేదు. గత ఏడాది చెన్నై సూపర్కింగ్స్ అతడి కోసం ఏకంగా రూ.16.5 కోట్లు పెట్టింది. కానీ రెండే మ్యాచ్లాడి గాయంతో లీగ్కు దూరమయ్యాడు. 2017లో రూ.12.5 కోట్లకు కొన్న రాజస్థాన్ తరఫున 12 మ్యాచ్లాడి 316 పరుగులు చేసి, 12 వికెట్లు తీశాడు స్టోక్స్. తర్వాతి ఏడాది రైజింగ్ పుణె అతణ్ని రూ.14.5 కోట్లకు సొంతం చేసుకోగా.. 13 మ్యాచ్ల్లో 196 పరుగులు చేసి 8 వికెట్లే తీశాడు.
- 2014 ఐపీఎల్లోనే ఏకంగా రూ.16 కోట్లు పలికి చరిత్ర సృష్టించిన ఆటగాడు యువ్రాజ్ సింగ్. ఆ సీజన్లో దిల్లీ డేర్డెవిల్స్ అతడి కోసం అసాధారణ రేటు పెట్టింది. కానీ, అతను ఆల్రౌండర్ పాత్రకు న్యాయం చేయలేకపోయాడు. 14 మ్యాచ్ల్లో 376 పరుగులే చేసి, 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. తర్వాతి సీజన్లో ఆర్సీబీ అతణ్ని రూ.14 కోట్లకు కొనుక్కుంది. ఆ జట్టు తరఫున అతను 248 పరుగులు చేసి, ఒక్క వికెట్టే తీశాడు.
- ఈనాడు క్రీడావిభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.