IPL 2024 - Impact Rule: భారీ స్కోర్లకు ‘ఇంపాక్ట్’ రూలే కారణం కాదు: అశ్విన్
ప్రస్తుతం ఐపీఎల్లో అన్ని జట్లూ 12 మంది ప్లేయర్లతో ఆడుతున్నాయి. దానికి కారణం ‘ఇంపాక్ట్’ ప్లేయర్ రూల్. అదనంగా ఒక బ్యాటర్ లేదా బౌలర్ను ఎంచుకొనే వెసులుబాటు ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2024 సీజన్లో 250+ స్కోర్లు ఎనిమిదిసార్లు నమోదయ్యాయి. ఇప్పుడు 200 లక్ష్యమున్నా ప్రత్యర్థి జట్టు వెరవని పరిస్థితి. దానికి ‘ఇంపాక్ట్’ ప్లేయర్ (Impact Player) నిబంధన కారణమని.. అదనంగా బ్యాటర్ వస్తాడనే కొందరి వాదన. దీనివల్ల ఆల్రౌండర్లకు సరైన న్యాయం జరగడం లేదని మరికొందరి అభిప్రాయం. భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా ఇలాంటి రూల్పై సమీక్షించాలని సూచించాడు. అయితే, రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) మాత్రం విభిన్నంగా స్పందించడం విశేషం. కేవలం ‘ఇంపాక్ట్’ రూల్ వల్లే భారీ స్కోర్లు నమోదవుతున్నాయని అనుకోవడానికి లేదని వ్యాఖ్యానించాడు. బౌలర్లు కూడా తమ బ్యాటింగ్ నైపుణ్యంపై దృష్టి పెట్టాలని సూచించాడు. ఇదే సీజన్లో హైదరాబాద్ 287 పరుగుల స్కోరు చేసిన సంగతి తెలిసిందే.
‘‘ఒకవేళ ఇంపాక్ట్ రూల్ నిబంధన లేకపోయినా ఇలా భారీ స్కోరు నమోదయ్యేదే. వ్యక్తిగతంగా నేను ఈ సీజన్లో గమనించిన అంశాలనే చెబుతున్నా. బ్యాటర్లు చాలా ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నారు. పిచ్లు ఎక్కడైనా సరే ప్రామాణికంగానే తయారుచేస్తారు. అందుకే, భవిష్యత్తులో బౌలర్లూ బ్యాటింగ్ చేయడానికి సంసిద్ధం కావాల్సిఉంది. బౌలింగ్ ఎలా ఉన్నా సరే.. బ్యాటింగ్ చేసే అవసరం ఉండొచ్చు. అప్పుడే మనం అనుకునే దిశగా మ్యాచ్ సాగుతుంది’’ అని వ్యాఖ్యానించాడు.
పరాగ్కు ఆ సత్తా ఉంది
‘‘జట్టులోకి కొత్తగా వచ్చిన కుర్రాళ్లకు తమ బాధ్యతలపై స్పష్టమైన అవగాహన కల్పించాలి. రియాన్ 17 ఏళ్ల వయసులో జట్టులోకి వచ్చాడు. ప్రతీ సంవత్సరం పరిణితి సాధిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు తన పాత్ర ఏంటనే దానిపై క్లారిటీతో ఉన్నాడు. అతడి సత్తా విషయంలో ఎలాంటి అనుమానం లేదు. బెంగళూరుపై కవర్స్ మీదుగా కొట్టిన సిక్స్ను ఎక్కువమంది బ్యాటర్లు కొట్టలేరు. దేశవాళీలో అదరగొట్టిన అతడి టాలెంట్ను మరోసారి చూస్తున్నాం. తప్పకుండా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరతాడు’’ అని అశ్విన్ తెలిపాడు. ఈ సీజన్లో రియాన్ పరాగ్ (Riyan Parag) 567 పరుగులు సాధించి.. ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గిల్ను వెనక్కి పంపారా..? బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే..
టీమ్ ఇండియా ట్రావెలింగ్ రిజర్వులో ఉన్న గిల్ను ప్రపంచకప్ టోర్నీ నుంచి వెనక్కి పంపడంపై బ్యాటింగ్ కోచ్ వివరణ ఇచ్చారు. -
స్కాట్లాండ్పై ఆస్ట్రేలియా గెలుపు.. సూపర్-8కు ఇంగ్లాండ్
Australia vs Scotland: ఆదివారం జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో స్కాట్లాండ్పై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో సూపర్8లో ఇంగ్లాండ్కు బెర్త్ ఖరారైంది. -
చివరిది వరుణుడికి
అనుకున్నదే జరిగింది. గ్రూప్- ఎ లో భారత్ చివరి మ్యాచ్ను వరుణుడు ఆడనివ్వలేదు. కీలకమైన సూపర్- 8 పోరుకు ముందు అన్ని విభాగాల్లోనూ మరోసారి సత్తాచాటాలని చూసిన టీమ్ఇండియా ఆశ తీరలేదు. -
చిన్నోళ్లు దమ్మున్నోళ్లు
ఎవరైనా ఊహించారా.. టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ను వెనక్కినెట్టి అమెరికా సూపర్- 8కు చేరుతుందని! ఎవరైనా అనుకున్నారా.. ప్రపంచకప్ల్లో అత్యంత నిలకడగా ఆడే న్యూజిలాండ్ గ్రూప్ దశలోనే నిష్క్రమిస్తుందని! కానీ ఇవి జరిగాయి. -
నేపాల్ ఒక్క పరుగు తేడాతో..
టీ20 ప్రపంచకప్లో మరో సంచలనం కొద్దిలో తప్పింది. కూనల చేతిలో షాక్ తిన్న జట్ల జాబితాలో దక్షిణాఫ్రికా కూడా చేరేదే. నేపాల్పై ఆ జట్టు ఒక్క పరుగు తేడాతో అతికష్టంగా గట్టెక్కింది. -
కివీస్ తొలి గెలుపు
ఇప్పటికే టీ20 ప్రపంచకప్ సూపర్-8కు దూరమైన న్యూజిలాండ్ టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. శనివారం గ్రూప్-సి పోరులో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో ఉగాండాను చిత్తు చేసింది. -
జర్మనీ ఘన బోణీ
యూరో కప్ను ఆతిథ్య జర్మనీ విజయంతో మొదలెట్టింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన గ్రూప్- ఎ మ్యాచ్లో ఆ జట్టు 5-1 తేడాతో స్కాట్లాండ్ను చిత్తుచేసింది. -
ఏ జట్టునైనా ఓడించగలం
పూర్తి స్థాయిలో ఆడితే ఏ జట్టునైనా ఓడించగలమని అమెరికా వైస్ కెప్టెన్ అరోన్ జోన్స్ అన్నాడు. ‘‘సూపర్-8 సవాల్కు సిద్ధంగా ఉన్నాం. రెండో రౌండ్ చేరడం మాకో పెద్ద ఘనత. -
గంభీర్ సమర్థుడే కానీ..
టీమ్ఇండియా కోచ్ పదవి రేసులో గౌతమ్ గంభీర్ ముందున్నాడు. మెంటార్గా ఇటీవల కోల్కతా నైట్రైడర్స్ ఐపీఎల్ టైటిల్ గెలవడంలో గంభీర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. -
సంక్షిప్త వార్తలు(5)
జాతీయ జట్టు తరపున ఇదే తనకు చివరి టీ20 ప్రపంచకప్ అని న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ప్రకటించాడు. కానీ కివీస్ జట్టుతో అంతర్జాతీయ మ్యాచ్లు ఆడే విషయంపై మాత్రం అతను స్పష్టత ఇవ్వలేదు. -
మొదట ఆ ఐదుగురిని తప్పించండి! సీనియర్ ఆటగాళ్లపై తీవ్రంగా మండిపడ్డ పాక్ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ 2024లో పాకిస్థాన్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టనుంది. దీంతో పాక్ జట్టుపై సొంత దేశం ఆటగాళ్ల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పవన్ కల్యాణ్కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్.. అదేంటంటే?
-
దర్శన్, పవిత్రా గౌడలకు వివాహమైందా? ఆయన లాయర్ ఏమన్నారంటే..
-
ఆరోగ్యశ్రీలో గత ప్రభుత్వ అక్రమాలపై చర్యలు: మంత్రి సత్యకుమార్
-
మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటా: నారా లోకేశ్
-
రామోజీరావు జీవితం నుంచి చాలా నేర్చుకోవాలి: ఎం. నాగేశ్వరరావు