Ishan Kishan: ధర రూ.10 కోట్లకుపైనే.. అంచనాలు అందుకోలేకపోతున్నారు..!
భారత టీ20 లీగ్లో ఎప్పుడు వేలం జరిగినా కొందరు ఆటగాళ్లు ఊహించని ధర పలికి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తారు. దాంతో వారిపై భారీ అంచనాలు ఏర్పడి ఆసక్తి కలిగిస్తారు...
భారత టీ20 లీగ్లో ఎప్పుడు వేలం జరిగినా కొందరు ఆటగాళ్లు ఊహించని ధర పలికి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తారు. దాంతో వారిపై భారీ అంచనాలు నెలకొంటాయి. అయితే.. వీరిలో కొందరు మైదానంలో ఒత్తిడికి చిత్తవుతున్నారు. తాము తీసుకునే సొమ్ముకు న్యాయం చేయలేక తంటాలు పడుతున్నారు. అలా ఈ సీజన్లో భారీ ధర పలికినా.. సగం సీజన్ పూర్తవడానికి వచ్చినా.. ఇంకా మేటి ప్రదర్శనలు చేయలేక ఇబ్బందులు పడుతున్న ఆటగాళ్లెవరంటే..
(Photo: Ishan Kishan Instagram)
* ఇషాన్ ఒత్తిడికి చిత్తు: ముంబయి ఓపెనర్ ఇషాన్ కిషన్ ఈ సీజన్లో రూ.15.25 కోట్లతో అందరి కన్నా అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. కొంత కాలంగా ఆ జట్టు తరఫున రాణిస్తుండటంతో మెగా వేలంలోనూ ముంబయే మళ్లీ కొనుగోలు చేసింది. అతడిపై నమ్మకం ఉంచి ఎవరూ ఊహించని ధరకు తీసుకుంది. అయితే, ఇప్పుడది ఆ జట్టుకు బెడిసికొట్టినట్లు అనిపిస్తోంది. ఇషాన్ ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో 31.83 సగటుతో 191 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. కానీ, అతడి ఆటలో మునుపటి మెరుపు కనిపించడం లేదు. ఇప్పుడు ఆడుతున్న తీరు మరీ తీసిపారేయాల్సిన విధంగా లేకున్నా తీసుకునే సొమ్ముకు మాత్రం న్యాయం చేయలేకపోతున్నాడు.
(Photo: Shreyas Iyer Instagram)
* శ్రేయస్ ఓకే కానీ: దిల్లీ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్లో భారత్ తరఫున మూడో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. అతడి బ్యాటింగ్, కెప్టెన్సీ తీరు నచ్చిన కోల్కతా మెగా వేలంలో రూ.12.25 కోట్లకు దక్కించుకుంది. దీంతో గతేడాది ఫైనల్లో మిస్సైన మూడో కప్పును ఈసారి తెచ్చిపెడతాడనే ఆశ పెట్టుకుంది. కానీ, శ్రేయస్ బ్యాట్స్మన్గా రాణిస్తున్నా.. కెప్టెన్గా తడబడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో 39.33 సగటుతో 236 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధ శతకాలు నమోదు చేశాడు. అయితే, కెప్టెన్గా మూడు మ్యాచ్ల్లోనే కోల్కతాను విజయతీరాలకు చేర్చాడు. మరో నాలుగింటిలో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో జట్టును ఏడో స్థానంలో కొనసాగిస్తున్నాడు.
(Photo: Harshal Patel Instagram)
* హర్షల్ పసలేదు: గతేడాది 32 వికెట్లు తీసి అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచిన హర్షల్ పటేల్ ఈసారి ఏమాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. అతడిపై భారీ అంచనాలు పెట్టుకున్న బెంగళూరుకు కాస్త నిరాశే కలిగిస్తున్నాడు. మెగా వేలంలో రూ.10.75 కోట్లకు దక్కించుకొని మళ్లీ అవకాశం ఇచ్చినా ఆ జట్టుకు తన నుంచి కావాల్సిన వికెట్లు దక్కడం లేదు. ఇప్పటివరకు అతనాడిన ఆరు మ్యాచ్ల్లో 8 వికెట్లే తీసి ఏదో నెట్టుకొస్తున్నట్లు కనిపిస్తున్నాడు. అత్యుత్తమ బౌలింగ్ 11/2 ఉండగా.. 7.29 ఎకానమీతో పొదుపుగా బౌలింగ్ చేయడం ఒక్కటే ఊరటనిచ్చే విషయం. అయితే, అతడు మరిన్ని వికెట్లు సాధిస్తే బెంగళూరు విజయాలకు మరింత కలిసొచ్చే వీలుంది. దీంతో హర్షల్ బౌలింగ్ ఇప్పుడు అంతంత మాత్రంగానే అనిపిస్తోంది. ఇకపైనా ఇలాగే కొనసాగితే హర్షల్ దక్కించుకున్న మొత్తానికి న్యాయం చేయలేకపోయినట్లే.
(Photo: Shardul Thakur Instagram)
* శార్దూల్ కష్టమే: ఇంతకుముందు చెన్నై ఆల్రౌండర్గా ఆ జట్టు విజయాల్లో కీలక సేవలు అందించిన శార్దూల్ ఠాకూర్ ఈసారి దిల్లీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. బౌలింగ్లో అలా వచ్చి ఇలా వికెట్లు తీసిపెట్టడం, బ్యాటింగ్లో మెరుపులు మెరిపించ గల సత్తా ఉండటంతో మెగా వేలంలో దిల్లీ రూ.10.75 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుంది. అయితే, ఈ సీజన్లో అతడు ఆ జట్టుకు పెద్దగా ఉపయోగపడుతున్నట్లుగా అనిపించడం లేదు. అందుకు శార్దూల్ బౌలింగ్, బ్యాటింగ్ ప్రదర్శనలే కారణం. ఆడిన ఏడు మ్యాచ్ల్లో 30/2 అత్యుత్తమ గణాంకాలు. ఎకానమీ కూడా 9.60గా ఉంది. దీంతో అటు పరుగులు ఆపలేక, వికెట్లు తీయలేక తంటాలు పడుతున్నాడు. మొత్తంగా బంతితో 4 వికెట్లు తీసిన శార్దూల్.. బ్యాట్తో 80 పరుగులే చేశాడు. దీంతో సగం సీజన్ పూర్తయ్యేసరికి ఏమాత్రం ప్రభావం చూపించడం లేదనిపిస్తోంది.
(Photo: Prasidh Krishna Instagram)
* ప్రసిద్ధ్ ఫర్వాలేదు: ఇదివరకు కోల్కతా జట్టులో మంచి పేరు తెచ్చుకున్న ప్రసిద్ధ్ కృష్ణ ఇప్పుడు రాజస్థాన్ జట్టుకు ఆడుతున్నాడు. అతడి బౌలింగ్లోని వైవిధ్యం నచ్చిన ఆ జట్టు మెగా వేలంలో రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్లతో పోలిస్తే ఈసారి ఫర్వాలేదనిపిస్తున్నా అతడు దక్కించుకున్న ధరకు న్యాయం చేయలేకపోతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో 8 వికెట్లు తీసిన అతడు 3/22 అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఎకానమీ కూడా 8.14 మునుపటి సీజన్తో పోలిస్తే బాగుందనె చెప్పాలి. కానీ, అతడు మరిన్ని వికెట్లు తీసిపెడితే రాజస్థాన్కు తిరుగుండదు.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి