Ishan Kishan: ధర రూ.10 కోట్లకుపైనే.. అంచనాలు అందుకోలేకపోతున్నారు..!
భారత టీ20 లీగ్లో ఎప్పుడు వేలం జరిగినా కొందరు ఆటగాళ్లు ఊహించని ధర పలికి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తారు. దాంతో వారిపై భారీ అంచనాలు ఏర్పడి ఆసక్తి కలిగిస్తారు...
భారత టీ20 లీగ్లో ఎప్పుడు వేలం జరిగినా కొందరు ఆటగాళ్లు ఊహించని ధర పలికి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తారు. దాంతో వారిపై భారీ అంచనాలు నెలకొంటాయి. అయితే.. వీరిలో కొందరు మైదానంలో ఒత్తిడికి చిత్తవుతున్నారు. తాము తీసుకునే సొమ్ముకు న్యాయం చేయలేక తంటాలు పడుతున్నారు. అలా ఈ సీజన్లో భారీ ధర పలికినా.. సగం సీజన్ పూర్తవడానికి వచ్చినా.. ఇంకా మేటి ప్రదర్శనలు చేయలేక ఇబ్బందులు పడుతున్న ఆటగాళ్లెవరంటే..
(Photo: Ishan Kishan Instagram)
* ఇషాన్ ఒత్తిడికి చిత్తు: ముంబయి ఓపెనర్ ఇషాన్ కిషన్ ఈ సీజన్లో రూ.15.25 కోట్లతో అందరి కన్నా అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. కొంత కాలంగా ఆ జట్టు తరఫున రాణిస్తుండటంతో మెగా వేలంలోనూ ముంబయే మళ్లీ కొనుగోలు చేసింది. అతడిపై నమ్మకం ఉంచి ఎవరూ ఊహించని ధరకు తీసుకుంది. అయితే, ఇప్పుడది ఆ జట్టుకు బెడిసికొట్టినట్లు అనిపిస్తోంది. ఇషాన్ ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో 31.83 సగటుతో 191 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. కానీ, అతడి ఆటలో మునుపటి మెరుపు కనిపించడం లేదు. ఇప్పుడు ఆడుతున్న తీరు మరీ తీసిపారేయాల్సిన విధంగా లేకున్నా తీసుకునే సొమ్ముకు మాత్రం న్యాయం చేయలేకపోతున్నాడు.
(Photo: Shreyas Iyer Instagram)
* శ్రేయస్ ఓకే కానీ: దిల్లీ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్లో భారత్ తరఫున మూడో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. అతడి బ్యాటింగ్, కెప్టెన్సీ తీరు నచ్చిన కోల్కతా మెగా వేలంలో రూ.12.25 కోట్లకు దక్కించుకుంది. దీంతో గతేడాది ఫైనల్లో మిస్సైన మూడో కప్పును ఈసారి తెచ్చిపెడతాడనే ఆశ పెట్టుకుంది. కానీ, శ్రేయస్ బ్యాట్స్మన్గా రాణిస్తున్నా.. కెప్టెన్గా తడబడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో 39.33 సగటుతో 236 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధ శతకాలు నమోదు చేశాడు. అయితే, కెప్టెన్గా మూడు మ్యాచ్ల్లోనే కోల్కతాను విజయతీరాలకు చేర్చాడు. మరో నాలుగింటిలో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో జట్టును ఏడో స్థానంలో కొనసాగిస్తున్నాడు.
(Photo: Harshal Patel Instagram)
* హర్షల్ పసలేదు: గతేడాది 32 వికెట్లు తీసి అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచిన హర్షల్ పటేల్ ఈసారి ఏమాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. అతడిపై భారీ అంచనాలు పెట్టుకున్న బెంగళూరుకు కాస్త నిరాశే కలిగిస్తున్నాడు. మెగా వేలంలో రూ.10.75 కోట్లకు దక్కించుకొని మళ్లీ అవకాశం ఇచ్చినా ఆ జట్టుకు తన నుంచి కావాల్సిన వికెట్లు దక్కడం లేదు. ఇప్పటివరకు అతనాడిన ఆరు మ్యాచ్ల్లో 8 వికెట్లే తీసి ఏదో నెట్టుకొస్తున్నట్లు కనిపిస్తున్నాడు. అత్యుత్తమ బౌలింగ్ 11/2 ఉండగా.. 7.29 ఎకానమీతో పొదుపుగా బౌలింగ్ చేయడం ఒక్కటే ఊరటనిచ్చే విషయం. అయితే, అతడు మరిన్ని వికెట్లు సాధిస్తే బెంగళూరు విజయాలకు మరింత కలిసొచ్చే వీలుంది. దీంతో హర్షల్ బౌలింగ్ ఇప్పుడు అంతంత మాత్రంగానే అనిపిస్తోంది. ఇకపైనా ఇలాగే కొనసాగితే హర్షల్ దక్కించుకున్న మొత్తానికి న్యాయం చేయలేకపోయినట్లే.
(Photo: Shardul Thakur Instagram)
* శార్దూల్ కష్టమే: ఇంతకుముందు చెన్నై ఆల్రౌండర్గా ఆ జట్టు విజయాల్లో కీలక సేవలు అందించిన శార్దూల్ ఠాకూర్ ఈసారి దిల్లీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. బౌలింగ్లో అలా వచ్చి ఇలా వికెట్లు తీసిపెట్టడం, బ్యాటింగ్లో మెరుపులు మెరిపించ గల సత్తా ఉండటంతో మెగా వేలంలో దిల్లీ రూ.10.75 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుంది. అయితే, ఈ సీజన్లో అతడు ఆ జట్టుకు పెద్దగా ఉపయోగపడుతున్నట్లుగా అనిపించడం లేదు. అందుకు శార్దూల్ బౌలింగ్, బ్యాటింగ్ ప్రదర్శనలే కారణం. ఆడిన ఏడు మ్యాచ్ల్లో 30/2 అత్యుత్తమ గణాంకాలు. ఎకానమీ కూడా 9.60గా ఉంది. దీంతో అటు పరుగులు ఆపలేక, వికెట్లు తీయలేక తంటాలు పడుతున్నాడు. మొత్తంగా బంతితో 4 వికెట్లు తీసిన శార్దూల్.. బ్యాట్తో 80 పరుగులే చేశాడు. దీంతో సగం సీజన్ పూర్తయ్యేసరికి ఏమాత్రం ప్రభావం చూపించడం లేదనిపిస్తోంది.
(Photo: Prasidh Krishna Instagram)
* ప్రసిద్ధ్ ఫర్వాలేదు: ఇదివరకు కోల్కతా జట్టులో మంచి పేరు తెచ్చుకున్న ప్రసిద్ధ్ కృష్ణ ఇప్పుడు రాజస్థాన్ జట్టుకు ఆడుతున్నాడు. అతడి బౌలింగ్లోని వైవిధ్యం నచ్చిన ఆ జట్టు మెగా వేలంలో రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్లతో పోలిస్తే ఈసారి ఫర్వాలేదనిపిస్తున్నా అతడు దక్కించుకున్న ధరకు న్యాయం చేయలేకపోతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో 8 వికెట్లు తీసిన అతడు 3/22 అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఎకానమీ కూడా 8.14 మునుపటి సీజన్తో పోలిస్తే బాగుందనె చెప్పాలి. కానీ, అతడు మరిన్ని వికెట్లు తీసిపెడితే రాజస్థాన్కు తిరుగుండదు.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
ముల్లాన్పుర్ వేదికగా పంజాబ్తో తలపడేందుకు ముంబయి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆ జట్టు విజయం సాధించాలంటే కెప్టెన్ రాణించాలని మాజీ క్రికెటర్ ఫించ్ వ్యాఖ్యానించాడు. -
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
ఐపీఎల్లో ఎలాంటి అనైతిక కార్యకలాపాలు జరగకుండా చూసేందుకు ఏర్పాటైన యాంటీ కరప్షన్ యూనిట్ తన పనిని మొదలు పెట్టింది. -
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డేవన్ కాన్వే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఆటడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. -
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
-
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..
-
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
-
తెదేపా అభ్యర్థులకు ఈనెల 21న బీఫామ్లు ఇవ్వనున్న చంద్రబాబు