వరుస ఓటములతో డీలా.. బెంగళూరుకు ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా..?
ఈ సీజన్లో బెంగళూరు పేలవమైన ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఆడిన ఎనిమిదింట్లో ఏడు ఓడి.. ప్లేఆఫ్స్ అవకాశాలకు దాదాపు దూరమైంది .
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఐపీఎల్ సీజన్లో అభిమానులను తీవ్రంగా నిరాశపర్చడం బెంగళూరుకు అలవాటుగా మారింది. ఈ సారైతే.. జట్టు పరిస్థితి దారుణంగా తయారైంది. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిదింట్లో ఏడు మ్యాచ్లు ఓడింది. ఆదివారం కోల్కతాతో చివరి బంతి వరకూ పోరాడినా.. ఒక్క పరుగు తేడాతో పరాజయం తప్పలేదు. దీంతో ఈ సీజన్లో ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగే తొలి జట్టుగా నిలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక టాప్-4లో బెంగళూరు నిలవాలంటే అద్భుతాలే జరగాలి.
సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..
బెంగళూరు ఇప్పటి వరకూ ఆడిన 8 మ్యాచ్ల్లో.. కేవలం పంజాబ్పై మాత్రమే గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున మిగిలింది. సాధారణంగా లీగ్లో 16 పాయింట్లు (8 విజయాలు) సాధించిన జట్లకు ప్లేఆఫ్స్ చేరేందుకు అవకాశముంటుంది. బెంగళూరు ఇంకా ఆడాల్సింది ఆరు మ్యాచ్లే. ఇందులో గెలిచినా 14 పాయింట్లే ఆ జట్టు ఖాతాలో చేరతాయి. అయితే.. రేసులో ఉన్న మిగిలిన జట్లు ఏవైనా చివరికి ఇదే పాయింట్లతో ఉంటే.. అప్పుడు బెంగళూరు ముందంజ వేసే అవకాశం ఉంటుంది. కానీ.. ఈ విషయంలో నెట్ రన్రేట్ కీలకమవుతుంది. అంటే.. తర్వాత మ్యాచ్ల్లో ఆర్సీబీ గెలవడమే కాదు.. భారీ తేడాతో ప్రత్యర్థులను చిత్తు చేయాల్సిందే. ప్రస్తుతం ఆ జట్టు రన్రేట్ మైనస్లో (-1.046) ఉండటం ప్రతికూలాంశం. ఇదే సమయంలో ఇతర జట్ల ఫలితాలూ తనకు అనుకూలంగా కలిసిరావాలి. అప్పుడే టాప్ 4లో నిలిచిందుకు డుప్లెసిస్ సేనకు అవకాశం ఉంటుంది.
ఆ జట్లతో సవాలే..
ఆర్సీబీ తన తదుపరి మ్యాచ్ల్లో హైదరాబాద్, గుజరాత్, పంజాబ్, దిల్లీ, చెన్నైలతో తలపడనుంది. ఇందులో హైదరాబాద్ ఇప్పటికే రికార్డు స్థాయి స్కోరు నమోదు చేసి బెంగళూరుకు చుక్కలు చూపించింది. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న చెన్నైను ఎదుర్కోవడమూ సవాలే. మిగతా జట్లను కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయా జట్లను బెంగళూరు ఎలా ఎదుర్కొంటుందో చూడాలి మరి.
అన్నీ సమస్యలే..
గతంలో ఎప్పుడూ ఎదుర్కోని పరిస్థితుల్లో బెంగళూరు చిక్కుకుంది. జట్టు నిండా స్టార్ బ్యాటర్లే ఉన్నప్పటికీ.. నిలకడలేమీతో ఇబ్బందిపడుతోంది. ఇక ఈ జట్టుకు అతిపెద్ద సమస్య బౌలింగ్. బంతితో ప్రత్యర్థిని నియంత్రించలేక ఆ జట్టు బౌలర్లు అత్యంత సాధారణంగా కనిపిస్తున్నారు. దీంతో ఆర్సీబీతో మ్యాచ్ అంటే చాలు.. ప్రత్యర్థి బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బెంగళూరు విజయాల బాట పట్టి ఎలా పుంజుకుంటుందో చూడాలి. సిరాజ్ నాయకత్వంలోని బౌలింగ్ దళం రాణించాలి. తమ జట్టుకు అదృష్టమూ కలిసి రావాలని బెంగళూరు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
-
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
-
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
-
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి