Royal Challengers Bengaluru: సెకండాఫ్లో బెంగళూరు దూకుడుకు ఈ 5 అంశాలే కారణమా?
ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ను ఢీకొట్టేందుకు బెంగళూరు సిద్ధమైంది. ఆ జట్టు ప్లేఆఫ్స్కు చేరుకోవడం వెనుక ఎంతో పట్టుదల ఉంది.
దెబ్బ తిన్న పులి రియాక్షన్ చూసుంటారు.. కానీ, దెబ్బ తిన్న సింహాల గుంపు రియాక్షన్ చూడకపోతే ఐపీఎల్లో బెంగళూరు ఆటను చూడండి అంటున్నారు ఆ జట్టు ఫ్యాన్స్. వాళ్లు అంటున్నారు అని కాదు కానీ.. పరాజయాల నుంచి ఆర్సీబీ బౌన్స్ బ్యాక్ ఏ రేంజిలో అయిందో మీరూ చూసే ఉంటారు. నాకౌట్లో పోరుకు ఆ జట్టు సిద్ధమవుతున్న సమయంలో డుప్లెసిస్ (కోహ్లీ) సేనకు సంబంధించి ఐదు అంశాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి.
ఆ నెలలో ఒక్కటే: ఈ ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీకి తొలి గెలుపు మార్చి 25న వచ్చింది. ఆ తర్వాత నెల రోజులకు గానీ రెండో విక్టరీని నమోదు చేయలేకపోయింది. ఇక మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. రెండో విజయానికి ముందు జట్టు రన్రేట్ 9.73. ఆరు వరుస విజయాల తర్వాత అంటే ఇప్పుడు రన్రేట్ 11.03. సీజన్లో బెస్ట్ ఇదే.
మిడిల్ ఓవర్లు : తొలి అర్ధ భాగంలో విరాట్ కోహ్లీ, ఫాప్ డుప్లెసిస్ జోడీపైనే అధిక భారం ఉండేది. మిడిలార్డర్ సరైన ప్రదర్శన చేయలేదు. అయితే, ఏప్రిల్ 25 నుంచి ఇప్పటి వరకు ఆ జట్టు మిడిల్ ఓవర్లలో చేసిన పరుగుల రన్రేట్ 8.72 నుంచి 10.18కి పెరిగింది. ఈ సీజన్లో ఇది రెండో అత్యుత్తమ రన్రేట్. రజత్ పాటిదార్, విల్ జాక్స్, గ్రీన్ ఫామ్ను అందుకోవడమే దానికి కారణం.
పవర్ ప్లేలో బెస్ట్ : ఈ సీజన్ మొదట్లో బెంగళూరు బౌలింగ్ను చూసి ‘ఎవరైనా బ్యాటర్ ఫామ్లోకి రావాలంటే ఆర్సీబీతో ఆడితే చాలు’ అనే జోక్లు వినిపించాయి. టోర్నీ ఆరంభమైన నెల తర్వాత.. ఒకప్పటి ఆర్సీబీ బౌలింగ్ ఇదేనా? అనే స్థాయికి మెరుగైంది. సీజన్ తొలి అర్ధభాగంలో పవర్ ప్లే ఓవర్లలో కేవలం 7 వికెట్లను మాత్రమే పడగొట్టిన ఆర్సీబీ.. ఆ తర్వాత ఆరు మ్యాచుల్లో 16 వికెట్లు కూల్చడం విశేషం. మరోవైపు ఎకానమీ రేటును 10.79 నుంచి 8.72కే పరిమితం చేసింది.
పేసర్ల దూకుడు: తొలి అర్ధ భాగంలో సిరాజ్, అల్జారీ జోసెఫ్, రీస్ టాప్లీ, లాకీ ఫెర్గూసన్ బౌలింగ్ను బాదని బ్యాటర్ లేడు. ఎంత వేగంగా బంతి వేస్తే.. అంతకు రెట్టింపు స్పీడ్తో అది బౌండరీ దాటేది. తొలి ఎనిమిది మ్యాచుల్లో 34 వికెట్లను పడగొట్టిన పేసర్లు.. చివరి ఆరింట్లో 28 వికెట్లు తీశారు. ఎకానమీ రేటులోనూ బౌలర్లు అదరగొట్టేశారు. 10.66 నుంచి 8.79కి వచ్చింది.
అత్యుత్తమ బ్యాటింగ్: హైదరాబాద్, కోల్కతా తర్వాత ఆ స్థాయిలో భారీ ఇన్నింగ్స్లు ఆడింది ఆర్సీబీనే. లీగ్ స్టేజ్లో మొత్తంగా 2,758 పరుగులు చేసింది. హైదరాబాద్ (2,764) కంటే కేవలం ఆరు పరుగులే తక్కువ. బౌండరీల రూపంలో అత్యధికంగా రన్స్ చేసిన జట్టు ఆర్సీబీనే. మొత్తం 1,806 పరుగులు ఈ రకంగా వచ్చినవే. సన్రైజర్స్ (1,768) ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మొదట ఆ ఐదుగురిని తప్పించండి! సీనియర్ ఆటగాళ్లపై తీవ్రంగా మండిపడ్డ పాక్ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ 2024లో పాకిస్థాన్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టనుంది. దీంతో పాక్ జట్టుపై సొంత దేశం ఆటగాళ్ల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘కోహ్లీ అలా చేస్తే రిషభ్ పంత్ సంతోషిస్తాడు’
టీ20 ప్రపంచ కప్ 2024లో ఓపెనర్గా దిగి విఫలమవుతున్న విరాట్ కోహ్లీ తిరిగి మూడో స్థానంలో ఆడి పరుగులు రాబడితే రిషభ్ పంత్ సంతోషిస్తాడని భారత మాజీ పేసర్ శ్రీశాంత్ పేర్కొన్నాడు. -
ఒక్క పరుగుతో ఓటమి.. నేపాల్ ఆశలను కూల్చేసిన సఫారీలు
T20 Worldcup 2024: టీ20 ప్రపంచకప్ నుంచి నేపాల్ నిష్క్రమించింది. నరాలు తెగే ఉత్కంఠ పోరులో కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఆ జట్టు ఓటమిపాలైంది. -
కోహ్లి జోరు అందుకునేనా..
ఐర్లాండ్ను చిత్తుచేసి.. పాకిస్థాన్ ముప్పును దాటి.. అమెరికాపై ఆధిపత్యంతో టీ20 ప్రపంచకప్లో సూపర్-8 చేరిన టీమ్ఇండియా.. మరో మ్యాచ్కు సిద్ధమైంది. తన చివరి గ్రూప్ మ్యాచ్లో శనివారం కెనడాతో తలపడనుంది. -
పాకిస్థాన్, న్యూజిలాండ్ ఔట్
ఆరంభం నుంచి సంచలనాలకు వేదికగా మారిన 2024 టీ20 ప్రపంచకప్లో 24 గంటల వ్యవధిలో రెండు పెద్ద జట్లకు పెద్ద షాక్ తగిలింది. పాకిస్థాన్, న్యూజిలాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. -
అఫ్గాన్ అదరహో..
ఐసీసీ టోర్నీల్లో స్థిరంగా రాణిస్తూ నాకౌట్ చేరే రికార్డున్న న్యూజిలాండ్కు షాక్. టీ20 ప్రపంచకప్లో ఆ జట్టు తొలి రౌండ్ కూడా దాటకుండానే ఇంటిముఖం పట్టింది. -
ఇంగ్లాండ్ చేతిలో ఒమన్ చిత్తు
టీ20 ప్రపంచకప్లో ఇంగ్లాండ్ ఎట్టకేలకు గెలుపు రుచిచూసింది. గ్రూపు-బి పోరులో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో ఒమన్ను చిత్తుచేసింది. -
మ్యాచ్ పూర్తవగానే సాఫ్ట్వేర్ పని..
భారత సంతతికి చెందిన సౌరభ్ నేత్రావల్కర్ ఇప్పుడు అమెరికా జట్టులో ప్రధాన పేసర్. పాకిస్థాన్పై సూపర్ ఓవర్లో యుఎస్ సంచలన విజయం సాధించడంలో అతనే కీలకం. -
ప్రణయ్ పరాజయం
ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత ఆటగాళ్లు హెచ్.ఎస్.ప్రణయ్, సమీర్వర్మల పోరాటం ముగిసింది. -
సెమీస్లో నగాల్
భారత స్టార్ ఆటగాడు సుమిత్ నగాల్ పెరుగియా టెన్నిస్ ఛాలెంజర్ టోర్నీలో సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. -
మేం అలా ఎప్పటికీ చేయం
టీ20 ప్రపంచకప్ నుంచి ఇంగ్లాండ్ను బయటకు పంపేలా తాము నెట్రన్రేట్ను తారుమారు చేయాలనుకుంటే క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని ఆస్ట్రేలియా పేసర్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. -
సూపర్-8కు అమెరికా.. వర్షంతో పాకిస్థాన్ ఆశలు గల్లంతు
ఇంకో మ్యాచ్ మిగిలిఉండగానే టీ20 ప్రపంచకప్ సూపర్-8 రేసు నుంచి పాకిస్థాన్ నిష్క్రమించింది.
తాజా వార్తలు (Latest News)
-
పుణె కారు ప్రమాదం.. మైనర్కు బెయిల్ మంజూరులో లోపాలు!
-
తెలంగాణ వైద్యారోగ్యశాఖలో వివిధ పోస్టుల భర్తీకి నిర్ణయం
-
మొదట ఆ ఐదుగురిని తప్పించండి! సీనియర్ ఆటగాళ్లపై తీవ్రంగా మండిపడ్డ పాక్ క్రికెటర్
-
స్టైలిష్ తాప్సీ.. హాట్ దక్ష.. క్యూట్ అదితి
-
వాణిజ్య రహస్యాలు బయటపెట్టారని ఆరోపణ ... టీసీఎస్కు ₹1,600 కోట్లు జరిమానా
-
కళ్లల్లో కారం కొట్టి.. కర్రలతో దాడి చేసి.. ప్రొఫెసర్పై విద్యార్థుల దుశ్చర్య