Royal Challengers Bengaluru: సెకండాఫ్లో బెంగళూరు దూకుడుకు ఈ 5 అంశాలే కారణమా?
ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ను ఢీకొట్టేందుకు బెంగళూరు సిద్ధమైంది. ఆ జట్టు ప్లేఆఫ్స్కు చేరుకోవడం వెనుక ఎంతో పట్టుదల ఉంది.
దెబ్బ తిన్న పులి రియాక్షన్ చూసుంటారు.. కానీ, దెబ్బ తిన్న సింహాల గుంపు రియాక్షన్ చూడకపోతే ఐపీఎల్లో బెంగళూరు ఆటను చూడండి అంటున్నారు ఆ జట్టు ఫ్యాన్స్. వాళ్లు అంటున్నారు అని కాదు కానీ.. పరాజయాల నుంచి ఆర్సీబీ బౌన్స్ బ్యాక్ ఏ రేంజిలో అయిందో మీరూ చూసే ఉంటారు. నాకౌట్లో పోరుకు ఆ జట్టు సిద్ధమవుతున్న సమయంలో డుప్లెసిస్ (కోహ్లీ) సేనకు సంబంధించి ఐదు అంశాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి.
ఆ నెలలో ఒక్కటే: ఈ ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీకి తొలి గెలుపు మార్చి 25న వచ్చింది. ఆ తర్వాత నెల రోజులకు గానీ రెండో విక్టరీని నమోదు చేయలేకపోయింది. ఇక మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. రెండో విజయానికి ముందు జట్టు రన్రేట్ 9.73. ఆరు వరుస విజయాల తర్వాత అంటే ఇప్పుడు రన్రేట్ 11.03. సీజన్లో బెస్ట్ ఇదే.
మిడిల్ ఓవర్లు : తొలి అర్ధ భాగంలో విరాట్ కోహ్లీ, ఫాప్ డుప్లెసిస్ జోడీపైనే అధిక భారం ఉండేది. మిడిలార్డర్ సరైన ప్రదర్శన చేయలేదు. అయితే, ఏప్రిల్ 25 నుంచి ఇప్పటి వరకు ఆ జట్టు మిడిల్ ఓవర్లలో చేసిన పరుగుల రన్రేట్ 8.72 నుంచి 10.18కి పెరిగింది. ఈ సీజన్లో ఇది రెండో అత్యుత్తమ రన్రేట్. రజత్ పాటిదార్, విల్ జాక్స్, గ్రీన్ ఫామ్ను అందుకోవడమే దానికి కారణం.
పవర్ ప్లేలో బెస్ట్ : ఈ సీజన్ మొదట్లో బెంగళూరు బౌలింగ్ను చూసి ‘ఎవరైనా బ్యాటర్ ఫామ్లోకి రావాలంటే ఆర్సీబీతో ఆడితే చాలు’ అనే జోక్లు వినిపించాయి. టోర్నీ ఆరంభమైన నెల తర్వాత.. ఒకప్పటి ఆర్సీబీ బౌలింగ్ ఇదేనా? అనే స్థాయికి మెరుగైంది. సీజన్ తొలి అర్ధభాగంలో పవర్ ప్లే ఓవర్లలో కేవలం 7 వికెట్లను మాత్రమే పడగొట్టిన ఆర్సీబీ.. ఆ తర్వాత ఆరు మ్యాచుల్లో 16 వికెట్లు కూల్చడం విశేషం. మరోవైపు ఎకానమీ రేటును 10.79 నుంచి 8.72కే పరిమితం చేసింది.
పేసర్ల దూకుడు: తొలి అర్ధ భాగంలో సిరాజ్, అల్జారీ జోసెఫ్, రీస్ టాప్లీ, లాకీ ఫెర్గూసన్ బౌలింగ్ను బాదని బ్యాటర్ లేడు. ఎంత వేగంగా బంతి వేస్తే.. అంతకు రెట్టింపు స్పీడ్తో అది బౌండరీ దాటేది. తొలి ఎనిమిది మ్యాచుల్లో 34 వికెట్లను పడగొట్టిన పేసర్లు.. చివరి ఆరింట్లో 28 వికెట్లు తీశారు. ఎకానమీ రేటులోనూ బౌలర్లు అదరగొట్టేశారు. 10.66 నుంచి 8.79కి వచ్చింది.
అత్యుత్తమ బ్యాటింగ్: హైదరాబాద్, కోల్కతా తర్వాత ఆ స్థాయిలో భారీ ఇన్నింగ్స్లు ఆడింది ఆర్సీబీనే. లీగ్ స్టేజ్లో మొత్తంగా 2,758 పరుగులు చేసింది. హైదరాబాద్ (2,764) కంటే కేవలం ఆరు పరుగులే తక్కువ. బౌండరీల రూపంలో అత్యధికంగా రన్స్ చేసిన జట్టు ఆర్సీబీనే. మొత్తం 1,806 పరుగులు ఈ రకంగా వచ్చినవే. సన్రైజర్స్ (1,768) ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి