Rohit Sharma: కెప్టెన్సీ లేని రోహిత్.. కోహ్లీలా రెచ్చిపోతాడా?
రోహిత్ శర్మ (Rohit Sharma) ఈ ఐపీఎల్ (IPL 2024) సీజన్లో కొత్త పాత్రలో కనిపించబోతున్నాడు. కెప్టెన్సీ బాధ్యతలు లేని అతడు.. తిరిగి బ్యాటింగ్లో ఒకప్పటి దూకుడును ప్రదర్శించాలని అభిమానులు కోరుతున్నారు.
ఇంటర్నెట్డెస్క్ : ఐపీఎల్ మెగా సమరం.. క్రికెట్ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్న 17వ సీజన్ (IPL 2024)లో అందరి దృష్టి ముంబయి ఇండియన్స్ (Mumbai Indians)పైనే ఉంది. ఆ జట్టును ఐదుసార్లు ఛాంపియన్గా నిలబెట్టిన రోహిత్ శర్మ (Rohit Sharma) ఈసారి హార్దిక్ పాండ్య (Hardik Pandya) కెప్టెన్సీలో ఆడనుండటమే కారణం. మరి కెప్టెన్సీ లేని రోహిత్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడు? మునుపటి కంటే మెరుగైన ప్రదర్శన అతడి బ్యాటింగ్లో చూస్తామా?
కొత్త పాత్రలో రోహిత్..
గుజరాత్ నుంచి ముంబయికి హార్దిక్ పాండ్య తిరిగి రావడం.. ఆ తర్వాత జట్టు పగ్గాలు రోహిత్ నుంచి అతడికి అప్పగించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఐపీఎల్లో ముంబయిని తిరుగులేని జట్టుగా నిలబెట్టిన రోహిత్ను ఇలా తప్పించడంపై అప్పట్లో అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో రోహిత్ కొత్త పాత్రలో ఎలా మెప్పిస్తాడో చూడాలి. ప్రస్తుత సీజన్లో పాండ్య కెప్టెన్సీలో అతడు ఆడాలి. గత కొంతకాలంగా లీగ్లో బ్యాటింగ్లో పెద్దగా రాణించని హిట్మ్యాన్.. తనదైన దూకుడును ప్రదర్శించాలని అభిమానులు కోరుతున్నారు. భారీ సిక్సర్లతో శర్మ విరుచుకుపడి శతకాల మోత మోగించాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
తగ్గిన ప్రదర్శన..
ముంబయి ఇండియన్స్ 2020వ సీజన్లో చివరిసారిగా టైటిల్ నెగ్గింది. ఆ తర్వాత ఆ జట్టు ప్రదర్శన ఆశించిన విధంగా లేదు. 2021 సీజన్లో ఆ జట్టు ప్లేఆఫ్స్కు చేరలేదు. ఆ తర్వాత ఏడాదైతే.. ఘోర ప్రదర్శనతో అట్టడుగు స్థానంలో నిచిలింది. గత సీజన్లో ప్లేఆఫ్స్నకు చేరినా రాణించలేదు. రోహిత్.. బ్యాట్తో ఆకట్టుకుందీ లేదు. గత సీజన్లో.. 16 మ్యాచ్లు ఆడి మొత్తం 332 పరుగులే చేసి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో 28వ స్థానంలో నిలవడం గమనార్హం. 2022 సీజన్లో మొత్తం పరుగులు 268. కెప్టెన్సీ బాధ్యతలు, ఇతర ఆటగాళ్లు రాణించకపోవడం లాంటి సమస్యల వల్ల బ్యాటింగ్పై కూడా ప్రభావం పడిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
వేలంలో బ్లాక్బస్టర్ కొట్టారు... మరి ఆటలో?
కోహ్లీలా దూకుడు ప్రదర్శిస్తాడా..
కోహ్లీ గతంలో ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతలు వదిలేశాడు. 2022 నుంచి ఆ జట్టుకు ఫాఫ్ డు ప్లెసిస్ కొత్త సారథిగా వచ్చాడు. అప్పటి నుంచి బ్యాటింగ్లో స్వేచ్ఛగా ఆడుతూ పరుగులు రాబడుతున్నాడు. వన్డేలు, టీ20ల్లో మునుపటి ఫామ్ అందిపుచ్చుకున్న విరాట్.. అదే జోరులో గత ఐపీఎల్లో చెలరేగి ఆడాడు. 14 మ్యాచ్లు ఆడి మొత్తం 639 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు.. ఆరు అర్ధ శతకాలు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ రేసులో నాలుగో స్థానంలో నిలిచాడు. ఆ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవనప్పటికీ.. భారీ అభిమానగణం ఉన్న టీమ్గా నిలిచిందంటే దానికి కారణం కోహ్లీనే.
ప్రస్తుతం రోహిత్కూ కెప్టెన్సీ బాధ్యతలు లేవు. దీంతో బ్యాటింగ్లో ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఈ నేపథ్యంలో రోహిత్ను కోహ్లీతో పోల్చుతూ బ్యాటింగ్లో ఒకప్పటి దూకుడు చూపించాలని అభిమానులు కోరుతున్నారు. మరోసారి జట్టుకు టైటిల్ అందించడంలో రోహిత్ కీలకపాత్ర పోషించి తన సత్తా ఏంటో చూపించాలని ఆశిస్తున్నారు. టీ20 ప్రపంచ కప్నకు రోహితే కెప్టెన్ అని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో సత్తా చాటితే మరింత ఆత్మవిశ్వాసంతో పొట్టి కప్లో రాణించేందుకు అవకాశం ఉంటుంది. మరోవైపు పాండ్యకు బ్యాటింగ్ పరంగా, మైదానంలో ప్రోత్సాహం పరంగా.. సపోర్టు చేస్తూ ముంబయికి మరో మంచి కెప్టెన్ను అందించేవాడిలా రోహిత్ నిలవాలని ముంబయి ఇండియన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్