Pat Cummins: ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబయిని చిత్తు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉప్పల్ స్టేడియం సిక్సర్లతో తడిసిపోయింది. ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు స్థాయి పరుగుల సునామీ సన్రైజర్స్ సృష్టించింది. ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించి బోణీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 277/3 స్కోరు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబయి 246/5కే పరిమితమైంది. ఒక దశలో విజయం సాధించేలా ముంబయి కనిపించినా.. హైదరాబాద్ బౌలర్లు సరైన సమయంలో అడ్డుకట్ట వేయగలిగారు. బ్యాటింగ్కు పూర్తిగా అనుకూలించిన ఉప్పల్ పిచ్పై భారీ స్కోరును ముంబయి ఛేదించే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
‘‘ఇది క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్. రెండు జట్లూ విజయం కోసం పోరాడాయి. ముంబయి ఛేజ్ చేస్తుందా? అంటే మాత్రం అంగీకరించను. మేం మెరుగైన బౌలింగ్ చేశాం. కొన్ని బౌండరీలను ప్రత్యర్థి బ్యాటర్లు బాదినా మా ప్రణాళికల్లో మార్పులు లేకుండా అమలు చేశాం. ఆఫ్ కట్టర్స్ సంధించడం వర్కౌట్ అయింది. యువ ఆటగాడు అభిషేక్ శర్మ స్వేచ్ఛగా ఆడేస్తాడు. ఐపీఎల్లో బ్యాటింగ్ చేయడమంటే తీవ్ర ఒత్తిడి ఉంటుంది. కానీ, అతడిలో అదేమీ కనిపించదు. మేం 270+ కొట్టాలనే లక్ష్యంతో ఈ మ్యాచ్ బరిలోకి దిగలేదు. సానుకూల దృక్పథంతో ఆడి మెరుగైన లక్ష్యం నిర్దేశించాలని భావించాం. ఇంపాక్ట్ రూల్ వల్ల అదనంగా మరొక బ్యాటర్ను ఆడించాం. పిచ్ కూడా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది’’ అని కమిన్స్ వ్యాఖ్యానించాడు.
హెడ్ నాకిష్టమైన ఆటగాడు: అభిషేక్ శర్మ
‘‘దేశవాళీ క్రికెట్లో ఆడటం వల్ల నా ప్రదర్శనపై మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. మా జట్టులో చాలా మంది పంజాబీ కుర్రాళ్లం ఉన్నాం. మేనేజ్మెంట్ నుంచి బ్యాటర్లకు అందిన సూచనలు కూడా కీలకంగా పనిచేశాయి. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా మా ఆటతీరును ప్రదర్శించాం. ట్రావిస్ హెడ్ నాకిష్టమైన క్రికెటర్లలో ఒకరు. అతడి బ్యాటింగ్ను చూస్తుంటే అద్భుతమనిపించింది. హెడ్తో కలిసి ఆడటాన్ని ఆస్వాదించా. మ్యాచ్కు ముందు రోజు బ్రియాన్ లారాతో మాట్లాడే అవకాశం దక్కింది. బ్యాటింగ్ విషయంలో అతడి సూచనలు సాయంగా నిలిచాయి. నేను బ్యాటింగ్ కంటే బౌలింగ్ చేయడాన్ని మరింతగా ఆస్వాదిస్తా. బంతితోనూ రాణించగలననే నమ్మకం నాకుంది’’ అని అభిషేక్ శర్మ తెలిపాడు. కేవలం 23 బంతుల్లోనే 63 పరుగులు చేసిన అభిషేక్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 16 బంతుల్లోనే అతడు హాఫ్ సెంచరీ పూర్తి చేయడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్