Hyderabad: ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.
సన్రైజర్స్ హైదరాబాద్.. గత రెండేళ్ల ప్రదర్శన చూసిన తర్వాత ఈ జట్టుపై పెద్దగా అంచనాల్లేవు. కానీ, అనూహ్యంగా ఐపీఎల్లోనే అత్యధిక స్కోరు రికార్డు రెండుసార్లు బద్ధలు కొట్టింది. పాయింట్ల పట్టికలో టాప్ - 4లో కొనసాగుతోంది. అయితే, వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో తమ జట్టు ఛేజింగ్కి వస్తే హైదరా‘బాధ’ తప్పదా అని ఫ్యాన్స్ నిట్టూరుస్తున్నారు.
ఐపీఎల్ 17వ ఎడిషన్లో (IPL 2024) హైదరాబాద్ 200+ స్కోర్లు నాలుగు సార్లు చేసింది. మెగా లీగ్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన జట్టూ ఇదే. బెంగళూరుపై ఏకంగా 287 పరుగులు చేసేసి రికార్డులు బద్ధలుకొట్టింది. ఇవి ఆ టీమ్ బ్యాటర్ల ఫామ్ను తెలియజేస్తున్నారు. అలాంటి టీమ్ 207.. 213 పరుగుల లక్ష్యాలను ఛేదించలేకపోయింది అంటే ఎవరైనా నమ్ముతారా? తమ తొలి మ్యాచ్లో కోల్కతాతో ఆడినప్పుడు 209 పరుగుల టార్గెట్ను ఛేదించేందుకు చివరి వరకూ పోరాడింది. కేవలం నాలుగు రన్స్ తేడాతో ఓడింది. గత రెండు మ్యాచుల్లో అయితే విజయానికి చేరువగా కూడా రాలేదు. ఈ మూడు మ్యాచుల్లోనూ టాప్ ఆర్డర్లోని ముగ్గురు బ్యాటర్లు సరైన ప్రదర్శన ఇవ్వకపోవడం గమనార్హం.
బ్యాటింగ్ త్రయం విఫలం..
హైదరాబాద్ (Sunrisers Hyderabad) భారీ స్కోర్లు చేయడంలో ముగ్గురు బ్యాటర్లు ప్రధాన పాత్ర పోషించారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ దూకుడు ఆడి ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించారు. తొలి బంతి నుంచే వీరబాదుడుతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆ తర్వాత క్లాసెన్ పతాక స్థాయికి తీసుకెళ్లేవాడు. ఈ మెరుపులన్నీ మొదట బ్యాటింగ్ చేసినప్పుడే అనే విషయం ఇక్కడ గుర్తుచేసుకోవాలి. ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయమంటే ఎగిరెగిరి షాట్లు కొట్టిన బ్యాటింగ్ త్రయం.. ఛేజింగ్ అనేసరికి చిత్తవుతున్నారు. నితీశ్ రెడ్డి, ఐదెన్ మార్క్రమ్, అబ్దుల్ సమద్ పరిస్థితీ ఇంతే.
కుర్రాళ్లు సంగతేంటి?
ఆల్రౌండర్గా ఎదుగుతున్న తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి కొన్ని మ్యాచుల్లో ఆకట్టుకున్నాడు. టాప్ బ్యాటర్లు ఇచ్చిన అద్భుత ఆరంభాలను ముందుకు తీసుకెళ్లాడు. అబ్దుల్ సమద్ కూడా తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు ధనాధన్ షాట్లతో అలరించాడు. వీరిద్దరూ లక్ష్య ఛేదనలో మాత్రం ప్రత్యర్థి బౌలర్ల ఉచ్చులో పడిపోతున్నారు. షహబాజ్ ఫర్వాలేదనిపిస్తున్నా.. సరిపోవడం లేదు. సీనియర్ ఆటగాడు ఐదెన్ మార్క్రమ్ (7, 32) జట్టును గెలిపించడంలో విఫలమవుతున్నాడు. టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు మిడిలార్డర్ బాధ్యతగా టీమ్ను విజయతీరాలకు చేర్చాలి. కానీ, ఇదే ఇక్కడ మిస్ అవుతోంది. మిగిలిన ఐదు మ్యాచుల్లోనూ గెలిస్తేనే హైదరాబాద్కు ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగ్గా ఉంటాయి.
బౌలర్లూ సహకరించాలి..
తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు హైదరాబాద్ భారీ స్కోర్లు చేస్తుండటంతో బౌలర్లపై పెద్దగా ఒత్తిడి ఉండటం లేదు. 287 కొట్టినప్పుడు ప్రత్యర్థి జట్టు 265 పరుగులు చేసింది. ఇక 277 స్కోరు చేసినా గెలుస్తామనే నమ్మకం చివరి బంతి వరకూ లేదు. ఎట్టకేలకు విజయాలు సాధించినా బౌలర్లు విఫలం కావడం ఇబ్బందికి గురి చేస్తోంది. ఈ సీజన్లో భారీగా పరుగులు సమర్పిస్తున్న బౌలర్ల జాబితాలో హైదరాబాద్ ప్లేయర్లూ ఉన్నారు. ఫస్ట్ బౌలింగ్ చేసినప్పుడు పెద్దగా మంచు ప్రభావం ఉండదు. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసేందుకు అవకాశాలు ఉంటాయి. కానీ, హైదరాబాద్ బౌలర్లు మాత్రం గత రెండు మ్యాచుల్లో ధారాళంగా పరుగులు ఇచ్చేశారు.స్పీడ్ ఎంత ముఖ్యమో.. బ్యాటర్, పిచ్ను బట్టి స్లో డెలివరీలు, ఆఫ్ కట్టర్లను సంధించాల్సిన అవసరం ఉంది.
డేనియల్ మాట్లాడలేదా?
బెంగళూరు మ్యాచు ఓడిపోయాక... హైదరాబాద్ టీమ్ ఎలాంటి హోం వర్క్ చేయలేదని చెన్నైతో మ్యాచ్ చూశాక అర్థమవుతోంది. 25న ఆర్సీబీతో మ్యాచ్ అనంతరం కమిన్స్ మాట్లాడుతూ ‘గెలిస్తే నేను మాట్లాడతా... ఓడిపోతే కోచ్ డేనియల్ వెటోరీ మాట్లాడతాడు’ అని అన్నాడు. దీంతో వెటోరీ ఏమీ మాట్లాడలేదా? లేక డ్రెస్సింగ్ రూమ్లో అదో సాధారణ ఓటమి అనుకున్నారా? అనేది తెలియడం లేదు. ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారుతున్న ఈ సమయంలో ఈ వరుస ఓటములను పట్టించుకోకపోతే వెనుకబడిపోయే ప్రమాదం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?