Sourav Ganguly: వెస్టిండీస్ టూర్కు ఆ ఇద్దరిని ఎంపిక చేయకపోవడంతో ఆశ్చర్యపోయా: గంగూలీ
ఫస్ట్-క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్లను టీమ్ఇండియాకు ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించిందని భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) అన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా త్వరలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో విండీస్తో భారత్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. టెస్టులు, వన్డేలకు ఇటీవల సెలెక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. నిలకడగా రాణించలేకపోతున్న ఛెతేశ్వర్పై వేటు వేసిన సెలెక్టర్లు ఐపీఎల్లో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్లకు టెస్టు జట్టులో చోటు కల్పించారు. 30 ఏళ్ల బెంగాల్ పేసర్ ముఖేశ్కుమార్ను వన్డేలు, టెస్టులకు ఎంపిక చేశారు. ఫస్ట్- క్లాస్ క్రికెటర్లయిన సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్, ప్రియాంక్ పాంచల్లకు అవకాశం కల్పిస్తారని భావించినా సెలెక్టర్లు వారికి మొండిచేయి చూపారు. దీంతో, సెలెక్షన్ కమిటీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) కూడా సెలెక్షన్ కమిటీ తీరును తప్పుబట్టాడు. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగానే టీమ్ఇండియాకు ఎంపిక చేయకూడదని, దేశవాళీ క్రికెట్లో రాణించిన వారికి కూడా అవకాశం కల్పించాలని సెలెక్టర్లకు సూచించాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్లను టీమ్ఇండియాకు ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నాడు.
‘‘రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీలలో యశస్వి జైస్వాల్ టన్నుల కొద్దీ పరుగులు చేశాడని అనుకుంటున్నాను. అందుకే అతను భారత జట్టుకు ఎంపికయ్యాడు. గత మూడేళ్లుగా దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న సర్ఫరాజ్ఖాన్కు కూడా అవకాశం ఇవ్వాలి. అభిమన్యు ఈశ్వరన్ గత ఐదారేళ్లుగా టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తున్నాడు. వీరిద్దరినీ ఎంపిక చేయకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యా. భవిష్యత్లో వారికి అవకాశం ఇవ్వాలి. సర్ఫరాజ్ ఖాన్ ఆటలో లోపాలు ఉంటే అతను దేశవాళీ క్రికెట్లో అన్ని పరుగులు చేసి ఉండేవాడు కాదు. ఫాస్ట్ బౌలింగ్ ఎదుర్కొవడంలో అతనికి ఎటువంటి సమస్యలు లేవని నేను భావిస్తున్నా’’అని దాదా పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
SisGrass Hybrid Pitch: ధర్మశాల వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచుల్లో హైబ్రిడ్ పిచ్లను వాడనున్నారు. ఏంటా పిచ్లు, ఎందుకు వాడుతున్నారు? -
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
-
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!