Pat Cummins: నా చరమాంకంలోనూ ‘కోహ్లీ వికెట్టే’ గుర్తొస్తుంది: కమిన్స్
ప్రపంచకప్ ఫైనల్ (ODI Worldcup 2023 Final)లో కోహ్లీ (Virat Kohli) వికెట్ తీయడం తనకు అద్భుతమైన క్షణమని ఆసీస్ కెప్టెన్ కమిన్స్ (Pat Cummins) అన్నాడు. తన చివరి క్షణాల్లోనూ ఆ వికెట్టే గుర్తొస్తుందన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్ టోర్నీ (ODI World cup 2023) ముగిసి వారం దాటినా.. ఫైనల్ (IND vs AUS Final Match)లో టీమ్ఇండియా (Team India) ఓటమి నుంచి క్రికెట్ అభిమానులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) వికెట్ పడిన క్షణాలను జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే, ఆ వికెట్టే ఈ టోర్నీలో తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) మరోసారి చెప్పాడు. అంతేకాదు.. జీవిత చరమాంకంలో ఉన్నప్పుడు కూడా తనకు ఆ వికెట్ గుర్తొస్తుందని అన్నాడు.
మెల్బోర్న్లో ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమిన్స్ ఈ విషయాన్ని చెప్పాడు. ‘‘70ఏళ్లు దాటిన తర్వాత మీరు జీవిత చరమాంకంలో ఉన్నప్పుడు.. ఈ ఫైనల్ మ్యాచ్లో ఏ క్షణాల గురించి ఆలోచిస్తారు?’’ అని కమిన్స్ను యాంకర్ ప్రశ్నించగా.. ‘‘విరాట్ కోహ్లీ వికెట్ గురించి ఆలోచిస్తా’’ అని సమాధానమిచ్చాడు. తన జీవితంలో అత్యంత అద్భుతమైన, కీలకమైన క్షణం అదేనన్నాడు.
ఆస్ట్రేలియాకు ప్రపంచకప్ను అందించిన ఆ ఒక్క మీటింగ్..!
‘‘ఆ సమయంలో నాకు చాలా ఆనందంగా అనిపించింది. వికెట్ తీసిన తర్వాత మేమంతా ఒకచోటుకి చేరుకున్నప్పుడు స్టీవ్ స్మిత్ ఓ మాట చెప్పాడు. ‘ఒక్కసారి మైదానాన్ని చూడండి’ అన్నాడు. ఆ క్షణం స్టేడియంలో దాదాపు లక్ష మంది భారత అభిమానులున్నారు. వారంతా మౌనంగా ఉండిపోయారు. అప్పుడు మైదానం లైబ్రరీ అంత నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ క్షణాలను నేను చాలా కాలం పాటు ఆస్వాదిస్తాను’’ అని కమిన్స్ (Pat Cummins) చెప్పాడు.
ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా తడబడింది. స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోవడంతో క్రీజులోకి వచ్చిన కోహ్లీ, రాహుల్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 28.2 ఓవర్లలో 148/3తో భారత్ కుదురుకుంటున్న సమయంలో.. టీమ్ఇండియాను కమిన్స్ గట్టి దెబ్బ కొట్టాడు. ఆ ఓవర్లో అతడు వేసిన షార్ట్ లెంగ్త్ డెలివరీని కోహ్లీ ఆడేందుకు ప్రయత్నించగా.. బంతి బ్యాట్ను ముద్దాడి స్టంప్స్ను తాకింది. కోహ్లీ ఔట్ అయిన తర్వాత మైదానం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది.
ఇదిలా ఉండగా.. ప్రపంచకప్లో ఆరోసారి విశ్వవిజేతగా నిలిచిన ఆసీస్ జట్టు ఆ ట్రోఫీని నేడు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో మీడియాకు ప్రదర్శించింది. ఆ ఫొటోలను ఐసీసీ తమ ఎక్స్ ఖాతాలో పంచుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు