Bengaluru X Hyderabad: నేనూ బ్యాటర్ అయితే బాగుండే: కమిన్స్
Bengaluru X Hyderabad: సోమవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరుపై హైదరాబాద్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఐపీఎల్ చరిత్రలో ఆ జట్టు అత్యధిక స్కోరు నమోదు చేసింది.
బెంగళూరు: హైదరాబాద్ జట్టు సోమవారం ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది. చిన్నస్వామి స్టేడియంలో బ్యాటర్ల విధ్వంసానికి బెంగళూరు బౌలర్లు చేతులెత్తేశారు. ట్రావిస్ హెడ్ బంతిపై పగబట్టినట్లుగా విరుచుకుపడటంతో బెంగళూరుకు ఓటమి తప్పలేదు. క్లాసెన్, సమద్ సైతం రాణించడంతో స్టేడియంలో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఈ క్రమంలో తమ ప్లేయర్ల ఆటతీరును చూస్తుంటే తానూ బ్యాటర్ అయితే బాగుండనిపించిందని హైదరాబాద్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్లో అతడు మూడు వికెట్లు తీయడంతో బెంగళూరు కష్టాల్లో పడింది.
‘‘నేనూ బ్యాటర్ అయితే బాగుండనిపించింది. అద్భుతమైన గేమ్.. కళ్లు చెదిరే దృశ్యాలు. వికెట్ను రీడ్ చేయడం వదిలేశా. పిచ్ డ్రైగా అనిపించింది. ఇది నాలుగో విజయం. సంతోషంగా ఉంది. మా బ్యాటర్లు అలవోకగా ఆడేశారు’’ అని మ్యాచ్ అనంతరం కమిన్స్ వ్యాఖ్యానించాడు. ఇలా పరుగుల వరద పారిస్తే బౌలర్లు కనుమరుగవుతారన్న సరదా ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘నాలాంటి బౌలర్లను మరికొన్నేళ్లు ఆడనివ్వండి (నవ్వుతూ).. నా ప్రయత్నం నేను చేశా. ఒక్క ఓవర్లో ఏడెనిమిది పరుగులు మాత్రమే ఇవ్వగలిగితే మ్యాచ్పై ప్రభావం చూపొచ్చు’’ అని బౌలింగ్లో తన పాత్రను వివరించాడు.
సోమవారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (102; 41 బంతుల్లో 9×4, 8×6) విధ్వంసక శతకం సాధిస్తే.. క్లాసెన్ (67; 31 బంతుల్లో 2×4, 7×6), సమద్ (37 నాటౌట్; 10 బంతుల్లో 4×4, 3×6), అభిషేక్ శర్మ (34; 22 బంతుల్లో 2×4, 2×6) మార్క్రమ్ (32 నాటౌట్; 17 బంతుల్లో 2×4, 2×6) కూడా రెచ్చిపోయారు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులు చేసింది. డుప్లెసిస్ (62; 28 బంతుల్లో 7×4, 4×6), కోహ్లి (42; 20 బంతుల్లో 6×4, 2×6) మెరుపు ఆరంభాన్నిచ్చినా.. ఆ తర్వాత ఆ జట్టు గాడి తప్పింది. దినేశ్ కార్తీక్ (83; 35 బంతుల్లో 5×4, 7×6) సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో బెంగళూరు పోటీ ఇచ్చినట్లయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల