Virat Kohli: విరాట్కు రెండో వైపు.. అప్పుడు స్మిత్కు అండ.. ఇప్పుడు నవీనుల్కు బాసట
విరాట్ కోహ్లి (Virat Kohli) అంటే దూకుడుకు మారుపేరు. ప్రత్యర్థి ఆటగాళ్లెవరైనా అతడితో పెట్టుకుంటే అంతే సంగతులు. అవతలి ఆటగాడు ఒక మాట అంటే అతను రెండు మాటలు అంటాడు. బౌలర్లు కవ్విస్తే బ్యాటుతో వారికి సమాధానం చెబుతాడు. సై అంటే సై అన్నట్లే ఉంటుంది అతడి వ్యవహారం.
విరాట్ కోహ్లి అంటే దూకుడుకు మారుపేరు. ప్రత్యర్థి ఆటగాళ్లెవరైనా అతడితో పెట్టుకుంటే అంతే సంగతులు. అవతలి ఆటగాడు ఒక మాట అంటే అతను రెండు మాటలు అంటాడు. బౌలర్లెవరైనా కవ్విస్తే బ్యాటుతో వారికి సమాధానం చెబుతాడు. సై అంటే సై అన్నట్లే ఉంటుంది అతడి వ్యవహారం. కొన్నిసార్లు కోహ్లి మరీ ఎక్కువ స్పందిస్తాడని.. ప్రత్యర్థులతో అమర్యాదరకంగా వ్యవహరిస్తాడని అప్పుడప్పుడూ విమర్శలు కూడా వస్తుంటాయి. అయిదే ఇదంతా కోహ్లిలో నాణానికి ఒకవైపు! అవసరమైనపుడు ప్రత్యర్థులను గౌరవించడం, వారికి బాసటగా నిలవడంలోనూ కోహ్లి ముందుంటాడు. అఫ్గానిస్థాన్తో ప్రపంచకప్ మ్యాచ్లో నవీనుల్ హక్ విషయంలో అతను వ్యవహరించిన తీరే అందుకు నిదర్శనం.
వన్డే ప్రపంచకప్లో భాగంగా బుధవారం దిల్లీలో అఫ్గానిస్థాన్తో తలపడి ఘనవిజయం సాధించింది భారత్. ఈ మ్యాచ్లో అందరి దృష్టినీ ఆకర్షించిన దృశ్యం.. అఫ్గానిస్థాన్ పేసర్ నవీనుల్ హక్తో స్నేహంగా మెలగడమే. ఈ ఏడాది ఐపీఎల్లో వీళ్లిద్దరికీ జరిగిన గొడవను అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. ఆ గొడవ తర్వాత నవీనుల్.. కోహ్లి అభిమానులకు విలన్ అయిపోయాడు. అతను ఎక్కడ మ్యాచ్ ఆడినా.. ‘‘కోహ్లి కోహ్లి’’ అంటూ అరవడమే పనిగా పెట్టుకున్నారు విరాట్ ఫ్యాన్స్. ప్రపంచకప్లో అఫ్గాన్ ఆడిన తొలి మ్యాచ్లోనూ నవీనుల్ బౌలింగ్కు వచ్చినపుడల్లా ‘‘కోహ్లి’’ నినాదాలు వినిపించాయి. ఇక భారత్తో మ్యాచ్లో అయితే ఈ నినాదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.
దిల్లీ కోహ్లి సొంత నగరం కావడంతో అతడి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వాళ్లు నవీనుల్ను లక్ష్యంగా చేసుకున్నారు. అతను బ్యాటింగ్కు వచ్చినపుడు స్టేడియమంతా కోహ్లి నినాదాలు హోరెత్తాయి. ఆపై కోహ్లికి నవీనుల్ బంతులేస్తున్నపుడు అభిమానులు ఇంకా రెచ్చిపోయారు. అయితే ప్రత్యర్థి ఆటగాడిని ఇలా లక్ష్యంగా చేసుకుని అవమానకరంగా వ్యవహరించడం కోహ్లికి నచ్చలేదు. నవీనుల్ తనతో గొడవపడ్డప్పుడు విరాట్ ఎంత ఆగ్రహం ప్రదర్శించాడో తెలిసిందే. కానీ అభిమానులు ఇప్పుడిలా చేయడం విరాట్కు రుచించలేదు. అందుకే తర్వాత అభిమానుల వైపు చేత్తో సంజ్ఞ చేస్తూ నినాదాలు ఆపేయమన్నాడు. దీంతో ఫ్యాన్స్ శాంతించారు. తర్వాత నవీనుల్తో నవ్వుతూ మాట్లాడ్డమే కాక.. అతడి భుజంపై చేయి వేసి సన్నిహితంగా కనిపించాడు విరాట్. ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. మన అతిథి పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించిన కోహ్లిని కొనియాడుతూ నెటిజన్లు అతణ్ని ప్రశంసల్లో ముంచెత్తారు.
ఏంటి వాళ్లిద్దరి గొడవ?
ఈ ఏడాది ఐపీఎల్లో బెంగళూరు-లఖ్నవూ మ్యాచ్ సందర్భంగా కోహ్లికి, నవీనుల్కు పెద్ద గొడవే నడిచింది. నవీనుల్ ఔటైనపుడు కోహ్లి తన షూను చూపిస్తూ అతణ్ని ఏదో అన్నాడు. దీంతో నవీనుల్ కూడా ఏదో తిడుతూ పెవిలియన్కు వెళ్లాడు. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు కరచాలనం చేసుకునేటపుడు నవీనుల్.. కోహ్లితో కొంత అమర్యాదకరంగా వ్యవహరించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ మ్యాచ్ తర్వాత కూడా నవీనుల్ తగ్గలేదు. బెంగళూరు ఓ మ్యాచ్లో ఓడినపుడు వ్యంగ్యంగా ఒక పోస్టు పెట్టాడు. దీంతో కోహ్లి అభిమానులకు అతను లక్ష్యంగా మారాడు. అప్పట్నుంచి అతను ఇండియాలో ఎక్కడ మ్యాచ్ ఆడినా.. కోహ్లి నినాదాలతో అభిమానులు గోల గోల చేస్తున్నారు. ప్రపంచకప్లోనూ అఫ్గానిస్థాన్ ఆడిన తొలి మ్యాచ్లో అదే చేశారు. కానీ భారత్తో మ్యాచ్ సందర్భంగా ఈ గొడవకు కోహ్లి తెరదించాడు.
అప్పుడు స్మిత్ కోసం..
విరాట్ ప్రత్యర్థి ఆటగాడికి బాసటగా నిలవడం తొలిసారేమీ కాదు. 2019లో అతను ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు అండగా నిలబడిన తీరు ప్రశంసలందుకుంది. స్మిత్ అంతకుముందు ఏడాదే బాల్ టాంపరింగ్ కుంభకోణంలో భాగం కావడం వల్ల ఏడాది పాటు నిషేధానికి గురయ్యాడు. నిషేధం పూర్తి చేసుకున్నాక వన్డే ప్రపంచకప్లో ఆడుతుండగా.. భారత్తో మ్యాచ్లో అభిమానులు అతణ్ని గేలి చేశారు. స్మిత్ మోసగాడన్నట్లుగా కొందరు నినాదాలు చేశారు. చేసిన తప్పుకి శిక్ష కూడా అనుభవించాక స్మిత్ను ఇలా అభిమానులు లక్ష్యంగా చేసుకోవడం కోహ్లికి నచ్చలేదు. దీంతో అతను అలా చేయొద్దంటూ అభిమానులను వారించాడు. దీంతో స్టేడియం సద్దుమణిగింది. ఈ చర్యతో స్మిత్ కోహ్లి దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు కూడా చెప్పాడు. తర్వాత ఐసీసీ.. కోహ్లికి ‘స్పిరిట్ ఆఫ్ ద క్రికెట్’ అవార్డు కూడా ఇవ్వడం విశేషం.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు