Suryakumar: సూర్యకుమార్కు అవకాశాలివ్వండి.. ప్రపంచకప్లో దుమ్మురేపుతాడు: యువీ
ఆసీస్తో మూడు వన్డేల్లోనూ గోల్డెన్ డక్ అయి విమర్శలకు గురవుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)కు భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ మద్దతుగా నిలిచాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో వరుసగా మూడు మ్యాచ్ల్లోనూ గోల్డెన్ డక్గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. దీంతో అతడిని వన్డే జట్టు నుంచి తప్పించి టీ20లకే పరిమితం చేయాలని కొంతమంది మాజీలు, క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, సూర్యకుమార్ యాదవ్కు భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) మద్దతుగా నిలిచాడు. వన్డేల్లో సూర్య మున్ముందు రాణిస్తాడని, ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ (World Cup 2023)లో భారత్కు కీలక ఆటగాడిగా మారతాడని యూవీ అభిప్రాయపడ్డాడు.
‘ప్రతి క్రీడాకారుడు తన కెరీర్లో ఎత్తుపల్లాలను చూస్తాడు. మనమందరం దీనిని అనుభవించాం. సూర్యకుమార్ యాదవ్ టీమ్ఇండియాకు కీలకమైన ఆటగాడని నేను నమ్ముతున్నాను. అతనికి మరిన్ని అవకాశాలిస్తే వన్డే ప్రపంచ కప్లో కీలక పాత్ర పోషిస్తాడు. సూర్యకుమార్ తప్పకుండా మళ్లీ ఫామ్ని అందుకుంటాడు’ అని యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు. ఈ ఏడాది అక్టోబర్- నవంబర్ మధ్య వన్డే ప్రపంచ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి భారతే ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం.
ఇక, టీ20ల్లో అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో మాత్రం ఆశించినమేరకు రాణించలేకపోతున్నాడు. 21 ఇన్నింగ్స్ల్లో 24.06 సగటుతో 433 పరుగులే చేశాడు. ఆసీస్తో జరిగిన సిరీస్లో వైఫల్యాన్ని మర్చిపోయి మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్-16 సీజన్లో రాణించడంపై సూర్యకుమార్ దృష్టిపెట్టాలి. అక్కడ రాణిస్తేనే తర్వాత జరిగే వన్డే సిరీస్లకు అతడిని ఎంపిక చేసే అవకాశాలుంటాయి. లేకపోతే సూర్యకుమార్ వన్డే కెరీర్ ప్రమాదంలో పడినట్లే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్సీబీ.. ఆశల పల్లకిలో
నిజంగా ఇది ఎవరూ ఊహించనిదే. ఎప్పుడో కథ ముగిసిన జట్టుగా కనిపించిన ఆర్సీబీ వరుసగా అయిదో విజయంతో అనూహ్యంగా ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. రజత్ పటీదార్ బ్యాటింగ్ మెరుపులకు బౌలర్ల శ్రమ తోడవడంతో దిల్లీని చిత్తుగా ఓడించిన ఆ జట్టు.. మొత్తంగా ఆరో విజయంతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి దూసుకెళ్లింది. -
చెన్నై గట్టెక్కింది
చెన్నై నిలిచింది. సొంతగడ్డ చెపాక్లో అదరగొట్టి ప్లేఆఫ్స్కు చేరువైంది. పెద్దగా మెరుపుల్లేని.. భారీస్కోర్లు నమోదుకాని పోరులో రాజస్థాన్ను ఓడించిన సీఎస్కే 13 మ్యాచ్ల్లో ఏడో విజయంతో మూడో స్థానానికి చేరుకుంది. -
ధోని మళ్లీ చెన్నైకి వస్తాడా?
ఆదివారం రాజస్థాన్తో మ్యాచ్ అనంతరం చెపాక్ స్టేడియంలో భావోద్వేగ వాతావరణం కనిపించింది. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే ఊహాగానాల నేపథ్యంలో చెపాక్లో మళ్లీ అతణ్ని చూస్తామో లేదో అని అభిమానుల్లో అన్న సందేహాలు నెలకొన్నాయి. -
అందుకే జడేజా ఔట్
రాజస్థాన్తో మ్యాచ్లో జడేజా ఔట్ చర్చనీయాంశమైంది. ఫీల్డింగ్కు అవరోధం కలిగించాడనే కారణంతో మూడో అంపైర్ జడేజాను ఔట్గా ప్రకటించాడు. అవేశ్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో అయిదో బంతిని ఆడిన జడేజా రెండో పరుగుకు ప్రయత్నించాడు. -
కోట్లు వస్తున్నాయిగా.. ఇంకేంటి బాధ?
లఖ్నవూ సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకాపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశ్నించాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో లఖ్నవూ చిత్తుగా ఓడిన తర్వాత.. -
వాళ్ల జీతాల్లో కోత పెట్టాలి
టీ20లో ప్రపంచకప్లో ఆడనున్న తమ ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి త్వరగా స్వదేశానికి రావాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆదేశించడంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. త్వరగా ఐపీఎల్ను వీడే ఆటగాళ్ల జీతాల్లో కోత పెట్టాలని డిమాండ్ చేశాడు. -
పారిస్లో అతనొక్కడే..
భారత రెజ్లర్లు సుజీత్ కల్కాల్ (65 కేజీ), జైదీప్ అహ్లావత్ (74 కేజీ)లకు తీవ్ర నిరాశ. పారిస్ ఒలింపిక్స్ బెర్తు సాధించాలన్న వీరి ఆశ తీరలేదు. ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయర్స్ రెపిచేజ్లో సుజీత్ 2-2తో అలెన్ రుథర్ఫర్డ్ (అమెరికా)తో సమానంగా నిలిచాడు. -
కార్ల్సన్కు ప్రజ్ఞానంద షాక్
ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)కు భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద మరోసారి షాకిచ్చాడు. ఇటీవలి కాలంలో కార్ల్సన్ను తరుచుగా ఓడిస్తున్న ప్రజ్ఞానంద.. శనివారం సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ 11వ రౌండ్లో 69 ఎత్తుల్లో పైచేయి సాధించాడు. -
సత్తాచాటిన ‘లక్ష్య’ అనూష
జాతీయ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ మల్లాల అనూష సత్తాచాటింది. ఆదివారం భువనేశ్వర్లో జరిగిన మహిళల ట్రిపుల్ జంప్లో ఆమె పసిడి సొంతం చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఇచ్చిన ఎయిర్క్రాఫ్ట్లను నడిపే సామర్థ్యం మా పైలట్లకు లేదు: మాల్దీవుల మంత్రి
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (13/05/24)
-
క్లీంకారకు ఉపాసన థ్యాంక్స్.. ఒకే ఫ్రేమ్లో అక్కినేని హీరోలు
-
నాకు తప్ప వారందరికీ వివాహమైంది: సోనాక్షి సిన్హా
-
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
-
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్