IND vs ENG : చివరి వరకూ పోరాడిన ధ్రువ్‌ జురెల్‌.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 307/10

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 307 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది.

Updated : 25 Feb 2024 11:56 IST

రాంచి : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 307 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ప్రస్తుతం 46 పరుగుల వెనుకంజలో ఉంది. ప్రత్యర్థి స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోలేక కష్టాల్లో పడ్డ రోహిత్‌ సేన.. 219/7తో మూడో రోజు ఆటను ప్రారంభించింది. మరో 88 పరుగులు మాత్రమే జోడించి మిగతా వికెట్లను కోల్పోయింది. ధ్రువ్‌ జురెల్‌(90) చివరి వరకూ పోరాడి.. శతకానికి చేరువలో హార్ట్‌లీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్‌ (73) మరోసారి ఆకట్టుకోగా.. గిల్‌ 38, కుల్‌దీప్‌ 28 పరుగులు చేశారు. 

ఇంగ్లాండ్‌ బౌలర్లలో బషీర్‌ 5, హార్ట్‌లీ 3, అండర్సన్‌ 2 వికెట్లు తీశారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 353 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని