Team India: ఈసారి ‘బెస్ట్ ఫీల్డర్’ మెడల్.. అనౌన్స్ చేసిన క్రికెట్ దిగ్గజం
వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) టీమ్ఇండియా వరుస విజయాలు సాధించడంలో ఫీల్డింగ్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో అత్యుత్తమ ప్రదర్శన చేసేవారికి ‘బెస్ట్ ఫీల్డర్’ మెడల్ను ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మైదానంలో అత్యుత్తమ ఫీల్డింగ్ ప్రమాణాలతోపాటు సహచరుల్లో ఉత్సాహం నింపే ఆటగాడిని ఎంపిక చేసి ‘బెస్ట్ ఫీల్డర్’ (Best Fielder) అవార్డును టీమ్ఇండియా మేనేజ్మెంట్ అందిస్తోంది. శ్రీలంకతో మ్యాచ్లోనూ భారత ఆటగాళ్లు (IND vs SL) అదరగొట్టేశారు. అయితే, ఒకే ఒక్కరికి ‘బెస్ట్ ఫీల్డర్’ మెడల్ను ఫీల్డింగ్ కోచ్ దిలీప్ అందించారు. అయితే, ఈసారి వినూత్నంగా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ‘బెస్ట్ ఫీల్డర్’ ఎవరనేది ప్రకటించడం విశేషం. మరోసారి శ్రేయస్ అయ్యర్ ఈ మెడల్ను సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఫీల్డింగ్ కోచ్ దిలీప్, క్రికెట్ లెజెండ్ సచిన్ తెందూల్కర్ మాట్లాడిన వీడియోను భారత క్రికెట్ టీమ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
‘‘శ్రీలంకతో మ్యాచ్లో భారత ఆటగాళ్లు అద్భుత ప్రతిభ చూపారు. క్యాచ్లు, ఫీల్డింగ్, బంతిని విసరడం ఎక్కడైనా సరే రవీంద్ర జడేజా కనిపించాడు. ప్రతి ఒక్కరూ చురుగ్గా ఉన్నారు. కేఎల్ రాహుల్ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ బాగా చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డర్లను సెట్ చేయడం చాలా బాగుంది. అయితే, ఈసారి విజేత ఎవరనేది మాత్రం నేను చెప్పడం లేదు. స్పెషల్ గెస్ట్ ఉన్నారు’’ అని దిలీప్ తెలిపాడు. ఆటగాళ్లను టీవీ స్క్రీన్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ప్రత్యక్షమయ్యాడు.
2003 వరల్డ్ కప్ గుర్తుకొచ్చింది: సచిన్
వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్న టీమ్ఇండియాను చూస్తుంటే 2003 వరల్డ్ కప్ గుర్తుకొచ్చిందని సచిన్ వ్యాఖ్యానించాడు. ‘‘రోహిత్ ఒక రోజు నన్ను కలిసి ఇలా ఫీల్డింగ్ మెడల్ గురించి చెప్పాడు. దీంతో నేను ఒక్కసారిగా 20 ఏళ్ల గతానికి వెళ్లిపోయా. దక్షిణాఫ్రికా వేదికగా ఆడిన మ్యాచ్లు గుర్తుకొచ్చాయి. మేం కూడా ఒక ఛార్ట్ను ఉంచుకున్నాం. ‘నేను చేయగలను. మేం చేయగలం’ అని ప్రతిఒక్కరం ప్రతిజ్ఞ చేశాం. దేశం కోసం వందశాతం నిబద్ధతతో ఆడేందుకు అది స్ఫూర్తిగా నిలిచేది. ఇప్పుడు ఈ మెడల్ కూడా ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం నింపుతుందని భావిస్తున్నా. శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా శ్రేయస్ అయ్యర్కు బెస్ట్ ఫీల్డర్ మెడల్ దక్కింది’’ అని తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.