IND vs ENG: బజ్బాల్.. ఇంకేదైనా పేరు పెట్టుకోండి.. భారత్లో ఆడటం కష్టమే: మాజీ క్రికెటర్లు
భారత్ను (IND vs ENG) ఓడించి సిరీస్ పట్టేయాలని చూసిన ఇంగ్లాండ్కు ఎదురు దెబ్బే తగిలింది. బజ్బాల్ ఆటతో ఆధిపత్యం ప్రదర్శించడంలోనూ విఫలమైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐదు టెస్టుల సిరీస్కు ముందు.. భారత్ జట్టుకు ‘బజ్బాల్’ క్రికెట్ రుచి చూపిస్తామని ప్రగల్భాలు పలికిన ఇంగ్లాండ్కు సిరీస్ ఓటమి ఎదురైంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో స్వదేశంలో భారత్ను ఓడించడం అంత సులువేం కాదని వారికి తెలిసొచ్చింది. ఇదే విషయంపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘ఇంగ్లాండ్ కఠిన సవాల్కు సిద్ధమై వచ్చింది. వారు ఆడేది ‘బజ్బాల్’ లేదా.. ఇంకేదైనా పిల్చుకోండి. స్వదేశంలో భారత్ను ఢీకొట్టడం తేలిక కాదు. గత పదేళ్ల కాలంలో టీమ్ఇండియా ఇక్కడ ఒక్క సిరీస్నూ కోల్పోలేదు. ఇంగ్లిష్ జట్టు ఇటీవల విభిన్నంగా ఆడుతోంది. కానీ, ఇక్కడ మాత్రం వారి బౌలింగ్ ఎటాక్ బలహీనంగా ఉంది. భారత బ్యాటింగ్ లైనప్ను సవాల్ చేసే స్థాయిలో లేదు. స్పిన్ను ఎదుర్కొని పరుగులు చేయడంలోనూ ఇంగ్లాండ్ తడబాటుకు గురైంది. ఇక బెన్ స్టోక్స్, బెయిర్ స్టో, జో రూట్ వంటి సీనియర్ బ్యాటర్ల నుంచి నిలకడగా పరుగులు రాబట్టలేదు. కొన్ని కీలకమైన వాటిని అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యారు. దూకుడుగా బ్యాటింగ్ చేయాలని చెప్పడం తేలికే కానీ.. అందరూ అలా చేయడం కష్టం’’ అని అనిల్ కుంబ్లే తెలిపాడు.
అక్కడ మినహా..
‘‘భారత్ - ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మనం ‘బజ్బాల్’ అని వింటూ ఉన్నాం కానీ ఈ సిరీస్లో చూడలేదు. 190 పరుగులు వెనకబడి టర్నింగ్ పిచ్పై స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లతో ఆధిక్యంలో రావడం బాగానే ఉంది. ఇలాంటి సమయంలో విభిన్నమైన క్రికెట్ ఆడతామని నిరూపించారు. ఇదే మా ఆటతీరంటూ బజ్బాల్కు తెరలేపారు. కొన్నిసార్లు విజయవంతమైనప్పటికీ.. ఎక్కువగా విఫలమై ఇంగ్లాండ్ ఓటమిని చవిచూసింది. సీనియర్ ఆటగాడు జో రూట్ను కూడా ఇలానే ఆడాలని చెప్పడం సరైంది కాదు. డిఫెన్సివ్ మోడ్తోనే చకచకా పరుగులు సాధిస్తాడు. బెయిర్స్టో, బెన్ స్టోక్స్ కనీసం బ్యాటింగ్ పిచ్లపైనైనా కీలక ఇన్నింగ్స్లు ఆడాల్సింది. అభిమానులు ఆటను మరింత ఆస్వాదించేలా చేయడంలో ఇంగ్లాండ్ సక్సెస్ అవుతుందేమో కానీ.. ఫలితాలను రాబట్టడంలో మాత్రం వెనుకబడింది’’ అని ఆకాశ్ చోప్రా విశ్లేషించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల