Bengaluru: డుప్లెసిస్ వన్డౌన్లో రావాలి.. వారిద్దరిని పక్కన పెట్టేయాలి: క్రిష్
బెంగళూరు రెండు ఓటములతో ఇబ్బంది పడుతోంది. అయితే, జట్టులో సమూల మార్పులు తీసుకురావాలని మాజీ క్రికెటర్లు సూచించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్లో బెంగళూరు మూడు మ్యాచ్లు ఆడి.. రెండు ఓటములను చవిచూసింది. ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్ల్లో ఆ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ విఫలమై నిరాశ పరిచాడు. బౌలర్లూ గొప్ప ప్రదర్శనేమీ చేయలేదు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక్కడే కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. దీంతో బెంగళూరు జట్టుపై మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. అదే సమయంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ బెంగళూరు మేనేజ్మెంట్కు కీలక సూచనలు చేశాడు.
‘‘విల్ జాక్స్ బ్యాటర్గా హిట్టింగ్ చేస్తాడు. ఆఫ్ స్పిన్ వేయగలడు. నేను బెంగళూరు కెప్టెన్ అయితే జాక్స్ను విరాట్తో కలిసి ఓపెనర్గా పంపిస్తా. ఫాఫ్ను మూడో స్థానంలో ఆడిస్తా. కామెరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్ ఆ తర్వాత వస్తారు. జాక్స్తో రెండు ఓవర్లు వేయిస్తాను. గత మూడు మ్యాచుల్లోనూ విఫలమైన అల్జారీ జోసెఫ్తోపాటు రజత్ పటీదార్ను పక్కన పెట్టేయాలి. యువ బౌలర్ ఆకాశ్ దీప్కు అవకాశం కల్పించాలి. అప్పుడు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకం వస్తుంది. లేకపోతే సరైన బౌలింగ్ లేకుండా ఇబ్బంది పడుతూనే ఉండాల్సి ఉంటుంది. కోల్కతాతో మ్యాచ్లో బెంగళూరు బౌలర్లు ఒక్క బౌన్సర్ కూడా వేయకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది’’ అని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు.
కోహ్లీ మరీ నిదానంగానా?: చోప్రా
‘‘సునీల్ నరైన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. భారీ సిక్స్లు కొట్టాడు. మ్యాచ్ను అతడు తమ వైపు లాగేసుకున్నాడు. ఫిల్ సాల్ట్ కూడా దూకుడుగా ఆడాడు. మొదటి ఓవర్లోనే 18 పరుగులు రాబట్టాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్కు పవర్ప్లేలోనే 85 పరుగులు సాధించారు. అల్జారీ జోసెఫ్, సిరాజ్, యశ్ దయాల్.. ఎవరినీ వదిలిపెట్టలేదు. విరాట్ కోహ్లీ మాత్రం 59 బంతుల్లో 83 పరుగులు చేశాడు. ఇక తొలి ఆరు ఓవర్లలో బెంగళూరు బౌలర్లు బౌన్సర్లు, యార్కర్లకు అస్సలు ప్రయత్నించలేదు’’ అని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విశ్లేషించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
ఉత్కంఠ పరిస్థితుల్లో ప్లేఆఫ్స్కు చేరుకున్న బెంగళూరు ఆటగాళ్లు సంబరాలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలో చెన్నై ప్లేయర్లతో కరచాలనం చేసేందుకు కాస్త సమయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. -
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై ప్లేఆఫ్స్కు చేరలేదు. దీంతో ధోనీ ఆటను చూసే అవకాశం కోల్పోయామనే బాధ అభిమానుల్లో ఉంది. అయితే, అతడి భవితవ్యంపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. -
కోహ్లీ రికార్డు బద్దలు.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయ్: అభిషేక్ శర్మ
హైదరాబాద్ ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో ఓపెనర్గా అభిషేక్ శర్మదీ కీలక పాత్రే. మరో ఆటగాడు ట్రావిస్ హెడ్తో కలిసి అదిరే ఆరంభాలను ఇచ్చాడు. -
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు జట్టు అద్భుతం చేసింది. ఊహించని విధంగా నాకౌట్కు చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. -
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
హైదరాబాద్ అద్భుతం చేసింది. ఐపీఎల్ 2024 సీజన్ ప్లేఆఫ్స్కు రెండో స్థానంతో దూసుకెళ్లింది. సొంతమైదానం ఉప్పల్ వేదికగా జరిగిన చివరి లీగ్లో పంజాబ్పై విజయం సాధించింది. -
దంచికొట్టి..దర్జాగా
అదే దూకుడు.. అదే దంచుడు. లక్ష్యం ఏమో 215. అయినా తమ ముందు అది చిన్నదే అంటూ.. సన్రైజర్స్ మరోసారి రెచ్చిపోయింది. -
సీఎస్కేను ఆపగలనని నమ్మా
చెన్నై సూపర్ కింగ్స్ని చివరి ఓవర్లో 17 పరుగులు చేయకుండా ఆపగలనని నమ్మానని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాళ్ తెలిపాడు. -
ఒక్క బంతీ పడకుండానే..
ఐపీఎల్-17లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ వర్షార్పణం అయింది. -
ఛాంప్స్ సాత్విక్-చిరాగ్
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అదరగొట్టారు. -
లీగ్ దశ ముగిసె..
పరుగుల వరద పారిన మ్యాచ్లు.. ఉత్కంఠభరితంగా ముగిసిన సమరాలు.. రికార్డుల మీద రికార్డులు! దాదాపు రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-17లో లీగ్ దశ ముగిసింది. -
ప్రసారదారుపై మండిపడ్డ రోహిత్
క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందటూ ఐపీఎల్ ప్రసారదారుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. -
ధోని ఆఖరి మ్యాచ్ ఆడాడని అనుకోవట్లేదు
దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని తన కెరీర్లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడినట్లు తాను భావించట్లేదని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. -
‘లక్ష్య’ దీప్తి రికార్డు
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి (తెలంగాణ) సత్తాచాటింది. -
అర్జున్ గేమ్ డ్రా
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. -
మను ఆధిపత్యం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో స్టార్ షూటర్ మను బాకర్ ఆధిపత్యం ప్రదర్శించింది. -
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఐఆర్జీసీకి ఆప్తుడు.. ఎవరీ హొస్సేన్ అమీర్ అబ్దొల్లహియన్
-
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..!
-
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
-
ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి
-
ప్రాసిక్యూటర్ టు ప్రెసిడెంట్: ఎవరీ ఇబ్రహీం రైసీ..?
-
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు