Bengaluru: డుప్లెసిస్ వన్డౌన్లో రావాలి.. వారిద్దరిని పక్కన పెట్టేయాలి: క్రిష్
బెంగళూరు రెండు ఓటములతో ఇబ్బంది పడుతోంది. అయితే, జట్టులో సమూల మార్పులు తీసుకురావాలని మాజీ క్రికెటర్లు సూచించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్లో బెంగళూరు మూడు మ్యాచ్లు ఆడి.. రెండు ఓటములను చవిచూసింది. ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్ల్లో ఆ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ విఫలమై నిరాశ పరిచాడు. బౌలర్లూ గొప్ప ప్రదర్శనేమీ చేయలేదు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక్కడే కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. దీంతో బెంగళూరు జట్టుపై మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. అదే సమయంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ బెంగళూరు మేనేజ్మెంట్కు కీలక సూచనలు చేశాడు.
‘‘విల్ జాక్స్ బ్యాటర్గా హిట్టింగ్ చేస్తాడు. ఆఫ్ స్పిన్ వేయగలడు. నేను బెంగళూరు కెప్టెన్ అయితే జాక్స్ను విరాట్తో కలిసి ఓపెనర్గా పంపిస్తా. ఫాఫ్ను మూడో స్థానంలో ఆడిస్తా. కామెరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్ ఆ తర్వాత వస్తారు. జాక్స్తో రెండు ఓవర్లు వేయిస్తాను. గత మూడు మ్యాచుల్లోనూ విఫలమైన అల్జారీ జోసెఫ్తోపాటు రజత్ పటీదార్ను పక్కన పెట్టేయాలి. యువ బౌలర్ ఆకాశ్ దీప్కు అవకాశం కల్పించాలి. అప్పుడు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకం వస్తుంది. లేకపోతే సరైన బౌలింగ్ లేకుండా ఇబ్బంది పడుతూనే ఉండాల్సి ఉంటుంది. కోల్కతాతో మ్యాచ్లో బెంగళూరు బౌలర్లు ఒక్క బౌన్సర్ కూడా వేయకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది’’ అని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు.
కోహ్లీ మరీ నిదానంగానా?: చోప్రా
‘‘సునీల్ నరైన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. భారీ సిక్స్లు కొట్టాడు. మ్యాచ్ను అతడు తమ వైపు లాగేసుకున్నాడు. ఫిల్ సాల్ట్ కూడా దూకుడుగా ఆడాడు. మొదటి ఓవర్లోనే 18 పరుగులు రాబట్టాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్కు పవర్ప్లేలోనే 85 పరుగులు సాధించారు. అల్జారీ జోసెఫ్, సిరాజ్, యశ్ దయాల్.. ఎవరినీ వదిలిపెట్టలేదు. విరాట్ కోహ్లీ మాత్రం 59 బంతుల్లో 83 పరుగులు చేశాడు. ఇక తొలి ఆరు ఓవర్లలో బెంగళూరు బౌలర్లు బౌన్సర్లు, యార్కర్లకు అస్సలు ప్రయత్నించలేదు’’ అని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విశ్లేషించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత