IND vs BAN: బంగ్లాతో మ్యాచ్.. ఆసియా కప్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకొనేనా..?
వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) భారత్ మరో మ్యాచ్కు సిద్ధమవుతోంది. గురువారం బంగ్లాదేశ్తో (IND vs BAN) పుణె వేదికగా తలపడనుంది. వరుసగా నాలుగో మ్యాచ్ను గెలిచి సెమీస్ రేసులో ముందుండాలని భారత్ సన్నద్ధమవుతోంది.
వన్డే ప్రపంచకప్ సంచలనాలతో కొనసాగుతోంది.
మొన్న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ను అఫ్గాన్ మట్టికరిపించింది.
నిన్న ఫేవరెట్గా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు నెదర్లాండ్స్ చెక్ పెట్టి.. తొలిసారి టెస్టు అర్హత కలిగిన జట్టును ఓడించి సంచలనం సృష్టించింది.
మరోసారి అలాంటిదేమైనా చోటు చేసుకుంటుందా...? అనే సందేహం అభిమానుల్లో కలగడం సహజమే. ఎందుకంటే గురువారం భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ జరగనుంది. పుణె వేదికగా తలపడనున్న మ్యాచ్లో టీమ్ఇండియానే ఫేవరెట్. కానీ సంచలనాలకు వేదికగా మారిన వరల్డ్ కప్లో ఎప్పుడు..? ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. వరుసగా హ్యాట్రిక్ విజయాలతో కొనసాగుతున్న భారత్ మరో విజయాన్ని సొంతం చేసుకుని సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది. గత మ్యాచుల్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ చేతుల్లో ఘోరంగా ఓటమి చవిచూసిన బంగ్లా ఈసారైనా పుంజుకోవాలని బలంగా కోరుకుంటోంది.
అన్ని విభాగాలు పటిష్ఠం..
గత మూడు మ్యాచుల్లో టాప్ ఆర్డర్ నుంచి మిడిలార్డర్ వరకు అన్ని పరీక్షలను భారత్ ఎదుర్కొంది. దిగ్విజయంగా టాప్గా నిలిచింది. తొలుత ఆసీస్పై మిడిలార్డర్ రాణించడం.. అఫ్గాన్, పాక్పై భారత టాప్ ఆర్డర్తోపాటు బౌలర్లు విజృంభించడం ఆస్వాదించాం. ఇప్పుడు సంచలనాలకు మారుపేరుగా నిలిచే బంగ్లాదేశ్ను ఎదుర్కోవడంపై దృష్టిసారించాలి. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్, గిల్, విరాట్, కేఎల్ రాహుల్, శ్రేయస్ కూడిన బ్యాటింగ్ విభాగం ఫుల్ఫామ్తో ఉంది. ఆల్రౌండర్లు హార్దిక్, రవీంద్ర జడేజా సమయానికి తగ్గట్టుగా వికెట్లను అందిస్తూ సహకారం ఇస్తున్నారు. పాకిస్థాన్తో మ్యాచ్లో ఏదో మంత్రం చదివినట్లు బంతిని పఠించి వికెట్ తీసిన హార్దిక్ నెట్టింట వైరల్గా మారిపోయాడు. క్రీజ్లో పాతుకుపోయిన ఓపెనర్ను ఔట్ చేశాడు. బౌలర్లు బుమ్రా, సిరాజ్, కుల్దీప్ చెలరేగిపోయిన వైనం తెలిసిందే.
బంగ్లాతో కాస్త జాగ్రత్తే..
బంగ్లాదేశ్తో పోలిస్తే భారత లైనప్ బలంగానే ఉంది. కానీ, ఎలాంటి సమయంలోనైనా ప్రత్యర్థి జట్లకు షాక్ ఇవ్వగలిగే సత్తా బంగ్లా సొంతం. మరీ ముఖ్యంగా షకిబ్ అల్ హసన్ మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే ముష్ఫికర్ రహీమ్, పేసర్ ముస్తాఫిజర్, షోంపుల్, తస్కిన్ అహ్మద్ కూడా కీలకంగా మారారు. గత నాలుగు వన్డేల్లో భారత్పై బంగ్లాదేశ్ మూడింట్లో విజయం సాధించింది. అయితే, అప్పుడు టీమ్ఇండియా పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగలేదు. ప్రయోగాలు చేస్తూ కీలక ఆటగాళ్లు లేకుండానే ఆడింది. అయినా సరే బంగ్లాతో పోరంటే అలసత్వం ప్రదర్శించకూడదు. ఇటీవల ఆసియా కప్ సూపర్-4లోనూ భారత్కు పరాభవం ఎదురైంది.
జట్టు కూర్పే కీలకం..
పుణె వేదికగా కాబట్టి బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ. భారత్ జట్టు కూర్పులో పది స్థానాలు ఫిక్స్డ్గా ఉంటాయి. పేస్ ఆల్రౌండర్ లేదా స్పిన్ ఆల్రౌండర్ అనేది పిచ్ను బట్టి మారుతూ ఉంటారు. అయితే, పుణె కూడా బ్యాటింగ్కు సహకారం ఇస్తుంది కాబట్టి తుది జట్టు ఎలా ఉంటందనేది ఆసక్తికరంగా మారింది. ఇక పేస్ విభాగంలో బుమ్రాతోపాటు షమీని తీసుకోవాలనే సూచనలూ వస్తున్నాయి. మరో వైపు సిరాజ్ కూడా అద్భుతమైన ఫామ్లోనే ఉన్నాడు. ఈ క్రమంలో పేస్ ఆల్రౌండర్గా ఉన్న శార్దూల్ను పక్కన పెట్టేసి షమీని తీసుకోవచ్చనే ఊహాగానాలు క్రికెట్ వర్గాల్లో ఉన్నాయి. షమీకి వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీల్లో మంచి రికార్డు ఉంది. ఈ వరల్డ్ కప్లోని గత మూడు మ్యాచుల్లో ఆడే అవకాశం రాలేదు.
భారత జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్, షమీ/శార్దూల్ ఠాకూర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81