IND vs BAN: బంగ్లాతో మ్యాచ్.. ఆసియా కప్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకొనేనా..?
వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) భారత్ మరో మ్యాచ్కు సిద్ధమవుతోంది. గురువారం బంగ్లాదేశ్తో (IND vs BAN) పుణె వేదికగా తలపడనుంది. వరుసగా నాలుగో మ్యాచ్ను గెలిచి సెమీస్ రేసులో ముందుండాలని భారత్ సన్నద్ధమవుతోంది.
వన్డే ప్రపంచకప్ సంచలనాలతో కొనసాగుతోంది.
మొన్న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ను అఫ్గాన్ మట్టికరిపించింది.
నిన్న ఫేవరెట్గా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు నెదర్లాండ్స్ చెక్ పెట్టి.. తొలిసారి టెస్టు అర్హత కలిగిన జట్టును ఓడించి సంచలనం సృష్టించింది.
మరోసారి అలాంటిదేమైనా చోటు చేసుకుంటుందా...? అనే సందేహం అభిమానుల్లో కలగడం సహజమే. ఎందుకంటే గురువారం భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ జరగనుంది. పుణె వేదికగా తలపడనున్న మ్యాచ్లో టీమ్ఇండియానే ఫేవరెట్. కానీ సంచలనాలకు వేదికగా మారిన వరల్డ్ కప్లో ఎప్పుడు..? ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. వరుసగా హ్యాట్రిక్ విజయాలతో కొనసాగుతున్న భారత్ మరో విజయాన్ని సొంతం చేసుకుని సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది. గత మ్యాచుల్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ చేతుల్లో ఘోరంగా ఓటమి చవిచూసిన బంగ్లా ఈసారైనా పుంజుకోవాలని బలంగా కోరుకుంటోంది.
అన్ని విభాగాలు పటిష్ఠం..
గత మూడు మ్యాచుల్లో టాప్ ఆర్డర్ నుంచి మిడిలార్డర్ వరకు అన్ని పరీక్షలను భారత్ ఎదుర్కొంది. దిగ్విజయంగా టాప్గా నిలిచింది. తొలుత ఆసీస్పై మిడిలార్డర్ రాణించడం.. అఫ్గాన్, పాక్పై భారత టాప్ ఆర్డర్తోపాటు బౌలర్లు విజృంభించడం ఆస్వాదించాం. ఇప్పుడు సంచలనాలకు మారుపేరుగా నిలిచే బంగ్లాదేశ్ను ఎదుర్కోవడంపై దృష్టిసారించాలి. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్, గిల్, విరాట్, కేఎల్ రాహుల్, శ్రేయస్ కూడిన బ్యాటింగ్ విభాగం ఫుల్ఫామ్తో ఉంది. ఆల్రౌండర్లు హార్దిక్, రవీంద్ర జడేజా సమయానికి తగ్గట్టుగా వికెట్లను అందిస్తూ సహకారం ఇస్తున్నారు. పాకిస్థాన్తో మ్యాచ్లో ఏదో మంత్రం చదివినట్లు బంతిని పఠించి వికెట్ తీసిన హార్దిక్ నెట్టింట వైరల్గా మారిపోయాడు. క్రీజ్లో పాతుకుపోయిన ఓపెనర్ను ఔట్ చేశాడు. బౌలర్లు బుమ్రా, సిరాజ్, కుల్దీప్ చెలరేగిపోయిన వైనం తెలిసిందే.
బంగ్లాతో కాస్త జాగ్రత్తే..
బంగ్లాదేశ్తో పోలిస్తే భారత లైనప్ బలంగానే ఉంది. కానీ, ఎలాంటి సమయంలోనైనా ప్రత్యర్థి జట్లకు షాక్ ఇవ్వగలిగే సత్తా బంగ్లా సొంతం. మరీ ముఖ్యంగా షకిబ్ అల్ హసన్ మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే ముష్ఫికర్ రహీమ్, పేసర్ ముస్తాఫిజర్, షోంపుల్, తస్కిన్ అహ్మద్ కూడా కీలకంగా మారారు. గత నాలుగు వన్డేల్లో భారత్పై బంగ్లాదేశ్ మూడింట్లో విజయం సాధించింది. అయితే, అప్పుడు టీమ్ఇండియా పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగలేదు. ప్రయోగాలు చేస్తూ కీలక ఆటగాళ్లు లేకుండానే ఆడింది. అయినా సరే బంగ్లాతో పోరంటే అలసత్వం ప్రదర్శించకూడదు. ఇటీవల ఆసియా కప్ సూపర్-4లోనూ భారత్కు పరాభవం ఎదురైంది.
జట్టు కూర్పే కీలకం..
పుణె వేదికగా కాబట్టి బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ. భారత్ జట్టు కూర్పులో పది స్థానాలు ఫిక్స్డ్గా ఉంటాయి. పేస్ ఆల్రౌండర్ లేదా స్పిన్ ఆల్రౌండర్ అనేది పిచ్ను బట్టి మారుతూ ఉంటారు. అయితే, పుణె కూడా బ్యాటింగ్కు సహకారం ఇస్తుంది కాబట్టి తుది జట్టు ఎలా ఉంటందనేది ఆసక్తికరంగా మారింది. ఇక పేస్ విభాగంలో బుమ్రాతోపాటు షమీని తీసుకోవాలనే సూచనలూ వస్తున్నాయి. మరో వైపు సిరాజ్ కూడా అద్భుతమైన ఫామ్లోనే ఉన్నాడు. ఈ క్రమంలో పేస్ ఆల్రౌండర్గా ఉన్న శార్దూల్ను పక్కన పెట్టేసి షమీని తీసుకోవచ్చనే ఊహాగానాలు క్రికెట్ వర్గాల్లో ఉన్నాయి. షమీకి వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీల్లో మంచి రికార్డు ఉంది. ఈ వరల్డ్ కప్లోని గత మూడు మ్యాచుల్లో ఆడే అవకాశం రాలేదు.
భారత జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్, షమీ/శార్దూల్ ఠాకూర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెడుతుందా ?
ఐపీఎల్లో వాంఖడే వేదికగా మరో మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్తో ముంబయి తలపడేందుకు సిద్ధమవుతోంది. -
Lucknow vs Kolkata: కృష్ణప్ప గౌతమ్ సూపర్ రన్నింగ్ క్యాచ్.. ఫీల్డింగ్ కోచ్ రియాక్షన్ చూశారా?
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా ఆదివారం కోల్కతాతో జరిగిన మ్యాచ్లో లఖ్నవూ 98 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కానీ, ఈ మ్యాచ్లో లఖ్నవూ ఫీల్డర్ కృష్ణప్ప గౌతమ్ ఓ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
ఐపీఎల్ ముగిసిన వారం రోజులకే మరో క్రికెట్ సంగ్రామం ప్రారంభం కానుంది. కానీ, దానిపై ఉగ్రమూకలు కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై ఐసీసీ స్పందించింది. -
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
కోల్కతా చేతిలో భారీ ఓటమితో లఖ్నవూ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమవుతుంది. -
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
తన టీ20 కెరీర్లో తొలిసారి ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఐపీఎల్ 17వ సీజన్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో క్రీజ్లోకి వచ్చిన ధోనీ మొదటి బంతికే ఔటయ్యాడు. -
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్కతా ప్లేఆఫ్స్ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు. -
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెడుతుందా ?
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM