IND w Vs AUS w: భారత అమ్మాయిలు అదుర్స్.. ఆస్ట్రేలియాపై తొలి టెస్టు విజయం
టెస్టు క్రికెట్ చరిత్రలో ఆసీస్పై తొలిసారి భారత మహిళల (IND w Vs AUS w) జట్టు విజయం సాధించింది. ముంబయి వేదికగా జరిగిన మ్యాచ్లో ఆధిపత్యం ప్రదర్శించి జయకేతనం ఎగురువేసింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత అమ్మాయిలు అద్భుత ఆటతీరును ప్రదర్శించారు. మొన్న ఇంగ్లాండ్ను భారీ తేడాతో ఓడించిన టీమ్ఇండియా.. నేడు ఆసీస్పై తొలిసారి టెస్టుల్లో (IND w Vs AUS w) విజయం సాధించింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ను భారత్ 8 వికెట్ల తేడాతో గెలుచుకుంది. దీంతో ఆసీస్తో తలపడిన 11 టెస్టుల్లో టీమ్ఇండియాకిదే తొలి విజయం. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా స్నేహ్ రాణా నిలిచింది.
ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్టులో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. ఓవర్నైట్ 233/5 స్కోరుతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఆసీస్ 261 పరుగులకే ఆలౌటైంది. దీంతో 75 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండు వికెట్ల నష్టంతోనే విజయతీరాలకు చేరింది . స్మృతీ మంధాన (38*), జెమీమా రోడ్రిగ్స్ (12*) క్రీజ్లో ఉండి గెలిపించారు. షఫాలీ వర్మ 4, రిచా ఘోష్ 13 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లు కిమ్ గార్త్, గార్డెన్ చెరో వికెట్ పడగొట్టారు.
అదరగొట్టిన స్నేహ్ రాణా
నాలుగో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్లో క్రీజ్లో పాతుకుపోయిన అన్నాబెల్ సదర్లాండ్ (27)ను స్నేహ్ రాణా ఔట్ చేసి భారత్కు బ్రేక్ ఇచ్చింది. వెంటనే అలానా కింగ్ (0)ను డకౌట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన జొనాసెన్ (9: 42 బంతుల్లో) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. చివరి రాజేశ్వరి గౌక్వాడ్ (2/42) జొనాసెన్తోపాటు కిమ్ గార్త్ను బౌల్డ్ చేసి ఆసీస్ ఇన్నింగ్స్ను ముగించింది. స్నేహ్ రాణా తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీయడం గమనార్హం.
ప్రతి ఒక్కరి శ్రమ ఫలితమిది: హర్మన్
‘‘జట్టులోని ప్రతి సభ్యులు శ్రమించారు. ఆసీస్పై విజయంతో చరిత్ర సృష్టించగలిగాం. సానుకూల దృక్పథంతో క్రికెట్ను ఆడటం వల్ల కలిగే ప్రయోజనమిదే. మరీ ఆత్మరక్షణ ధోరణిలో క్రికెట్ ఆడాలని అనుకోలేదు. మంచి భాగస్వామ్యాలను నిర్మించి స్కోరు బోర్డుపై భారీగా పరుగులు ఉంచాలనిఅనుకున్నాం. అలానే సాధించాం. టెస్టు మ్యాచ్ ఆడాలనేది ప్రతి ఒక్కరి కల. దానిని నెరవేర్చినందుకు బీసీసీఐకి ధన్యవాదాలు. సెలక్టర్లు మాకు మద్దతుగా నిలిచారు. టెస్టు క్రికెట్ను ఆదరించడానికి వచ్చిన ప్రతి ఒక్క అభిమానికి కృతజ్ఞతలు’’ అని భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ వ్యాఖ్యానించింది.
జట్లు స్కోర్లు ఇవీ:
ఆసీస్: తొలి ఇన్నింగ్స్ : 219/10, రెండో ఇన్నింగ్స్: 261/10
భారత్: తొలి ఇన్నింగ్స్ 406 ఆలౌట్. రెండో ఇన్నింగ్స్ 75/2.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి