IND vs ENG: లండన్కు మరో స్టార్ ప్లేయర్.. ఐదో టెస్టులో ఆడటం అనుమానమే?
ఇప్పుడు మరో టీమ్ఇండియా ఆటగాడు లండన్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. గాయం తగ్గకపోవడంతో అక్కడికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని భావిస్తున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్లో (IND vs ENG) భారత్ 3-1 ఆధిక్యంతో దూసుకుపోయింది. చివరి మ్యాచ్ ధర్మశాల వేదికగా మార్చి 7 నుంచి ప్రారంభం కానుంది. టీమ్ఇండియా అద్భుత పోరాటంతో ఇంగ్లాండ్ను చిత్తు చేసి ఇప్పటికే సిరీస్ను కైవసం చేసుకుంది. గాయం కారణంగా గత మూడు టెస్టులకు దూరంగా ఉన్న భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ (KL Rahul) చివరి మ్యాచ్కైనా అందుబాటులోకి వస్తాడని ఆశించినా అలా జరగలేదు. గాయం నుంచి కోలుకోలేదని.. ఫిట్నెస్ సాధించలేదని తెలుస్తోంది. దీంతో చికిత్స కోసం అతడు లండన్ వెళ్తున్నట్లు సమాచారం.
ఇంగ్లిష్ జట్టుతో సిరీస్ కోసం ప్రకటించిన చివరి మూడు టెస్టుల స్క్వాడ్లో కేఎల్ రాహుల్ పేరుంది. కానీ, ఫిట్నెస్ను నిరూపించుకుంటేనే తుది జట్టులో అవకాశం ఇస్తామని మేనేజ్మెంట్ ముందే కండీషన్ పెట్టింది. ఇప్పుడు సిరీస్ ఎలానూ గెలిచాం కాబట్టి ఆటగాళ్ల గాయాల విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకొనేందుకు బీసీసీఐ సిద్ధంగా లేదు. ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ ముగిసిన పది రోజుల్లోనే ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఆ మెగా లీగ్ తర్వాత టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఇప్పటికే షమీ లండన్లోనే శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. అతడు ఐపీఎల్కూ అందుబాటులో ఉండటం లేదు. మరి కేఎల్ ఫిట్నెస్ పరిస్థితి కూడా కొద్ది రోజుల్లోనే వెల్లడి కానుంది. మెగా లీగ్లో పాల్గొనడంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
బుమ్రా వచ్చేస్తాడు..
వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా నాలుగో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న బుమ్రా (Bumrah) చివరి మ్యాచ్లో ఆడనున్నాడు. ధర్మశాల పేసర్లకు స్వర్గధామం. ఈ క్రమంలో అతడితోపాటు మరో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లకు అవకాశం ఇవ్వొచ్చు. అరంగేట్ర మ్యాచ్లోనే అదరగొట్టిన ఆకాశ్ దీప్, సిరాజ్ ఆడటం ఖాయమే. ఇద్దరు స్పిన్నర్లు అశ్విన్, జడేజాకే తుది జట్టులో అవకాశం ఉంటుంది. మూడో స్నిన్నర్ను తీసుకేనే ఛాన్స్లు తక్కువ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి