IND vs AUS:: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల.. అడిలైడ్లో పింక్ బాల్ టెస్టు
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ షెడ్యూల్ విడుదలైంది.
దిల్లీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) ఇకమీదట అయిదు మ్యాచ్ల టెస్టు సిరీస్గా జరగనుంది. ఇప్పటి వరకూ 4 మ్యాచ్ల సిరీస్గా కొనసాగిన ఈ ట్రోఫీకి మరో టెస్టును చేర్చినట్లు సోమవారం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. 2024-25 మధ్య జరిగే ఈ సిరీస్ షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. తొలి టెస్టు ఈ ఏడాది నవంబర్ 22న పెర్త్ వేదికగా మొదలవుతుంది. రెండో టెస్టు (పింక్ బాల్ టెస్టు) డే/నైట్ జరగనుంది. దీనికి అడిలైడ్ ఓవల్ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. మూడో టెస్టు బ్రిస్బేన్, నాలుగో టెస్టు మెల్బోర్న్, ఐదో టెస్టుకు సిడ్నీ వేదిక కానుంది. 1991-92 తర్వాత భారత్, ఆసీస్ అయిదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడటం ఇదే తొలిసారి. ఈ ఏడాది డిసెంబరులో భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఆసీస్తో మూడు వన్డేలు ఆడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. తొలి రెండు వన్డేలు డిసెంబరు 5, 8న బ్రిస్బేన్లో, మూడో వన్డే డిసెంబరు 8న పెర్త్లో జరుగనుంది.
ఇక, బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో గత నాలుగు సిరీస్ల్లో టీమ్ఇండియా (Team India)నే వరుసగా విజేతగా నిలిచింది. ఇందులో రెండు సిరీస్ల్లో ఆసీస్ను వారి సొంత గడ్డపైనే ఓడించడం విశేషం. అయితే.. గత ఏడాది లండన్లో జరిగిన WTC ఫైనల్లో మాత్రం భారత్ను ఆస్ట్రేలియా ఓడించి గదను ఎగరేసుకుపోయింది.
2024-25 బోర్డర్- గావస్కర్ ట్రోఫీ షెడ్యూల్
- తొలి టెస్టు: నవంబర్ 22-26, పెర్త్
- రెండో టెస్టు: డిసెంబరు 6-10, అడిలైడ్ (డే/నైట్)
- మూడో టెస్టు: డిసెంబరు 14-18, బ్రిస్బేన్
- నాలుగో టెస్టు: డిసెంబరు 26-30, మెల్బోర్న్
- అయిదో టెస్టు: జనవరి 3-7, సిడ్నీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!