IND vs AUS:: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల.. అడిలైడ్లో పింక్ బాల్ టెస్టు
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ షెడ్యూల్ విడుదలైంది.
దిల్లీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) ఇకమీదట అయిదు మ్యాచ్ల టెస్టు సిరీస్గా జరగనుంది. ఇప్పటి వరకూ 4 మ్యాచ్ల సిరీస్గా కొనసాగిన ఈ ట్రోఫీకి మరో టెస్టును చేర్చినట్లు సోమవారం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. 2024-25 మధ్య జరిగే ఈ సిరీస్ షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. తొలి టెస్టు ఈ ఏడాది నవంబర్ 22న పెర్త్ వేదికగా మొదలవుతుంది. రెండో టెస్టు (పింక్ బాల్ టెస్టు) డే/నైట్ జరగనుంది. దీనికి అడిలైడ్ ఓవల్ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. మూడో టెస్టు బ్రిస్బేన్, నాలుగో టెస్టు మెల్బోర్న్, ఐదో టెస్టుకు సిడ్నీ వేదిక కానుంది. 1991-92 తర్వాత భారత్, ఆసీస్ అయిదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడటం ఇదే తొలిసారి. ఈ ఏడాది డిసెంబరులో భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఆసీస్తో మూడు వన్డేలు ఆడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. తొలి రెండు వన్డేలు డిసెంబరు 5, 8న బ్రిస్బేన్లో, మూడో వన్డే డిసెంబరు 8న పెర్త్లో జరుగనుంది.
ఇక, బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో గత నాలుగు సిరీస్ల్లో టీమ్ఇండియా (Team India)నే వరుసగా విజేతగా నిలిచింది. ఇందులో రెండు సిరీస్ల్లో ఆసీస్ను వారి సొంత గడ్డపైనే ఓడించడం విశేషం. అయితే.. గత ఏడాది లండన్లో జరిగిన WTC ఫైనల్లో మాత్రం భారత్ను ఆస్ట్రేలియా ఓడించి గదను ఎగరేసుకుపోయింది.
2024-25 బోర్డర్- గావస్కర్ ట్రోఫీ షెడ్యూల్
- తొలి టెస్టు: నవంబర్ 22-26, పెర్త్
- రెండో టెస్టు: డిసెంబరు 6-10, అడిలైడ్ (డే/నైట్)
- మూడో టెస్టు: డిసెంబరు 14-18, బ్రిస్బేన్
- నాలుగో టెస్టు: డిసెంబరు 26-30, మెల్బోర్న్
- అయిదో టెస్టు: జనవరి 3-7, సిడ్నీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్