IND vs AUS: మొదటి రోజు ఆట పూర్తి.. శతకం బాదిన ఖవాజా
భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో మొదటి రోజు ఆట పూర్తయింది.
అహ్మదాబాద్: భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో మొదటి రోజు ఆట పూర్తయింది. ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్లో ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా (104*; 251 బంతుల్లో 15 ఫోర్లు) శతకం బాదాడు. కామెరూన్ గ్రీన్ (49*; 64 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచరీకి ఒక పరుగు దూరంలో నిలిచాడు. ట్రావిస్ హెడ్ (32; 44 బంతుల్లో 7 ఫోర్లు), లబుషేన్ (3), హ్యాండ్స్కాంబ్ (17; 27 బంతుల్లో 3 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (38; 135 బంతుల్లో 3 ఫోర్లు) పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమి రెండు వికెట్లు పడగొట్టగా.. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
ఆరంభంలో ఆచితూచి ఆడి తర్వాత దూకుడు పెంచిన ఓపెనర్ ట్రావిస్ హెడ్ అశ్విన్ వెనక్కి పంపాడు. హెడ్ జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కొద్దిసేపటికే లబుషేన్ (3)ను షమీ క్లీన్బౌల్డ్ చేశాడు. ఆఫ్సైడ్ వేసిన బంతిని ఆడిన లబుషేన్ బ్యాట్ ఎడ్జ్ తీసుకోవడంతో బౌల్డయ్యాడు. లంచ్ బ్రేక్ సమయానికి ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 29 ఓవర్లలో 75 పరుగులు చేసింది. రెండో సెషన్లో ఆసీస్ బ్యాటర్లు నెమ్మదిగా ఆడి భారత బౌలర్లను పరీక్షించారు. వికెట్ పడకుండానే ఆ సెషన్ ముగిసింది. ఈ సెషన్లో ఆసీస్ 74 పరుగులు చేసింది.
దాదాపు 40 ఓవర్ల తర్వాత ఆసీస్ మూడో వికెట్ను కోల్పోయింది. టీ విరామం తర్వాత స్టీవ్ స్మిత్ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. దీంతో ఉస్మాన్ ఖవాజాతో కలిసి మూడో వికెట్కు నిర్మించిన 79 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. స్టీవ్ స్మిత్ ఔటైన తర్వాత క్రీజ్లోకి వచ్చిన పీటర్ హ్యాండ్స్కాంబ్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే షమీ వేసిన (70.4వ ఓవర్) బంతికి క్లీన్బౌల్డ్ అయి పెవిలియన్కు చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన గ్రీన్ దూకుడుగా ఆడగా.. ఖవాజా నెమ్మదిగా ఆడాడు. ఉమేశ్ యాదవ్ వేసిన 82 ఓవర్, షమీ వేసిన 85 ఓవర్లో గ్రీన్ రెండేసి బౌండరీలు బాదాడు. షమీ వేసిన మొదటి రోజు ఆఖరి ఓవర్లో తొలి బంతికి బౌండరీ బాది ఖవాజా శతకం పూర్తి చేసుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం